ఏమైనా మాటలతో ఎక్కడికో తీసుకెళ్లటం.. పోస్టులతో ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేయటం.. వివాదాలతో ఎప్పటికప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉండటం సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలిసినంత బాగా టాలీవుడ్ లో మరెవరికీ తెలీదనే చెప్పాలి. ఇంతకాలం తన పోస్టులతో సంచలనాలు రేపే ఆయన.. ఈ మద్యన ముద్దుగుమ్మలతో ఆయన చేస్తున్న వీడియోలు.. తీసుకుంటున్న ఫోటోల్ని పోస్టు చేసి కొత్త తరహా చర్చకు తెర తీస్తున్నారు. ఈ మధ్యన మాంచి మందు మూడ్ లో తానెలా చెలరేగిపోతారో అందరికి తెలిసేలా చేశారు వర్మ.
తాజాగా “డియర్ మేఘ” మూవీ ప్రీరిలీజ్ వేడుకకు వెళ్లిన వర్మ.. ఆ సినిమా హీరోయిన్ మేఘా ఆకాశ్ ను తన మాటలతో ఫిదా చేసేశారని చెప్పాలి. ఆయన వేసిన భారీ బిస్కెట్ కు పాపం ఆ హీరోయిన్ ఫ్లాట్ అయిపోవటమే కాదు.. గాల్లో తేలిపోయేలా వర్మ కామెంట్ ఉందని చెప్పాలి. ఈవెంట్ లో మాట్లాడిన వర్మ.. తనకు నలభై ఏళ్ల క్రితం మేఘా ఆకాశ్ లాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. తానిప్పుడు ఇలా ఉండేవాడిని కాదన్నారు.
“మేఘా చాలా స్వీట్ గా ఉంటుంది. తనని కలిసిన వారికి డయాబెటిస్ వస్తుందని నా అభిప్రాయం. 40 ఏళ్ల క్రితం నాకిలాంటి అమ్మాయి కనిపించి ఉంటే నేనిప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. మేఘని పొగిడినట్లు హీరో అదిత్ ను పొగిడితే నన్ను మరోలా అనుకుంటారు కాబట్టి అలా చేయను. అదిత్ మంచి నటుడు” అని వ్యాఖ్యానించారు.
ఈ వీకెండ్ లో విడుదల కానున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా ఈ మూవీని చెబుతున్నారు. వర్మ తాజా వ్యాఖ్యలతో.. మేఘా ఆకాశ్ ను ఒక్కసారి ఆగి చూసే అవకాశం ఉందని చెప్పాలి. ఏమైనా హీరోయిన్లను పొగడటం.. మాటలతో వారి మనసుల్నిదోచేయటం వర్మకే సాధ్యమని చెప్పక తప్పదు.
This post was last modified on August 30, 2021 3:33 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…