Movie News

‘బిగ్ బాస్’ హౌస్ లో ఇద్దరికి కరోనా?

సెప్టెంబరు 5 నుంచి బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్-5 సందడి చేయబోతోన్న నేపథ్యంలో వీక్షకులు ఆ షో కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే, గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బిగ్ బాస్ హౌస్ లో కరోనా కలకలం మొదలైందని తెలుస్తోంది. హౌస్ లోని ఇద్దరు సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరు కంటెస్టెంట్లను ప్రస్తుతానికి క్వారంటైన్ లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేయబోతున్న కంటెస్టెంట్లంతా ఆల్రెడీ క్వారంటైన్ లో ఉన్నారు. కానీ, అనూహ్యంగా వారిలో ఇద్దరు కరోనా బారినపడడంతో నిర్వాహకులు టెన్షన్ పడుతున్నారట. మరి, ఆ ఇద్దరు లేకుండానే షోను ప్రారంభిస్తారా..లేదంటే కొత్త కంటెస్టెంట్లను తీసుకుంటారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు, బిగ్ బాస్ ఐదో సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే భిన్నంగా సీజన్-5 నిర్వహించబోతున్నారట. సెప్టెంబర్‌ 5న గ్రాండ్‌గా ప్రారంభం కాబోతున్న ఈ షో తొలి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లను నాగ్ పరిచయం చేయబోతున్నారు. అయితే, ఈ సారి హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ ఎవరన్నదాని పై సస్పెన్స్ వీడలేదు. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకరిద్దరు మినహా… దాదాపుగా ఆ కంటెస్టెంట్లే ఫైనల్ అవుతారని కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

యాంకర్‌ రవి, లోబో, కార్తీకదీపం ఫేమ్‌ ఉమాదేవి, నటి లహరి షారి, యాంకర్‌ ప్రత్యూష, యానీ మాస్టర్, సిరి హన్మంత్‌, ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక, నటి ప్రియ, నవ్య స్వామి, 7 ఆర్ట్స్ సరయు సుమన్, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, ఫోక్ సింగర్ కోమలి, యాంకర్ కమ్ నటి వర్షిణి, ఆట సందీప్ భార్య జ్యోతిల పేర్లు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అయితే, వీరితోపాటు కొత్తగా కొరియోగ్రాఫర్‌ నటరాజ్‌, సింగర్‌ శ్రీరామచంద్ర పేర్లు కూడా రేసులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిలో బిగ్‌బాస్‌ హౌస్ లోకి అడుగుపెట్టబోయేది ఎవరన్నది తేలాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

This post was last modified on August 28, 2021 8:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago