రాజమౌళి సినిమాలు ఓ పట్టాన విడుదల కావు. ఏళ్లకు ఏళ్లు షూటింగ్ లు చేస్తూనే ఉంటారు. పెర్ఫెక్షన్ కోసం సినిమాలను చెక్కుతూనే ఉంటారు. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. దానికి తోడు కరోనా రావడంతో సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. 2020లో సినిమాను విడుదల చేస్తామన్నారు. అలా జరగలేదు. ఈ ఏడాది దసరాకు వస్తుందని చాలా నమ్మకంగా చెబుతున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాదిలో కూడా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ఉండదట.
తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అక్టోబర్ నెలాఖరుకి గానీ సినిమా ఫస్ట్ కాపీ రెడీ కాదట. అందుకే సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ దసరాకి వస్తుందని అనౌన్స్ చేయడంతో టాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ఇలా చాలా సినిమాలు సంక్రాంతి రేసులోకి వచ్చాయి.
ఇప్పుడు రాజమౌళి మళ్లీ తన సినిమా డేట్ ని మార్చుకొని సంక్రాంతికి రావాలని చూస్తుండడంతో మిగిలిన చిత్ర నిర్మాతల పరిస్థితి అయోమయంగా మారింది. సంక్రాంతి సీజన్ ను మిస్ చేసుకుంటే మళ్లీ సమ్మర్ వరకు ఎదురుచూడాలి. అప్పటివరకు సినిమాలను వాయిదా వేయలేరు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పరిస్థితి కూడా అలానే ఉంది. నిర్మాత దానయ్య మాత్రం సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ వస్తుందనే సంకేతాలు ఇస్తున్నారట. మరి అప్పటికి ఎన్ని సినిమాలు డ్రాప్ అవుతాయో.. ఎన్ని పోటీకి నిలబడతాయో చూడాలి!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…