మోసగాళ్లకు మోసగాడు.. తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాల్లో ఒకటి. సూపర్ స్టార్ కృష్ణ ఎంతో సాహసోపేతంగా చేసిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఇండియానా జోన్స్ తరహాలో నిధి వేట నేపథ్యంలో ఇండియాలో తెరకెక్కిన తొలి కౌబాయ్ చిత్రమిది. అప్పటిదాకా బాలీవుడ్లోనూ కౌబాయ్ సినిమాలు రాలేదు. అలాంటిది తెలుగులో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని రూపొందించి సంచలనం రేపాడు కృష్ణ.
ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాదు.. అప్పట్లోనే రూ.7 లక్షల భారీ బడ్జెట్లో సినిమాను నిర్మించి .. తెలుగు ప్రేక్షకులు అప్పటిదాకా చూడని లొకేషన్లలో షూటింగ్ చేసి తనకు తానే సాటి అనిపించాడు కృష్ణ. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో భారీ వసూళ్లు దక్కించుకున్నాక.. హిందీ, తమిళం, కన్నడతో పాటు ఇంగ్లిష్ భాషలోనూ అనువాదం అయి అంతర్జాతీయ స్థాయిలో విడుదల కావడం విశేషం.
ఐతే ఈ సినిమా తీస్తున్నపుడు, తీశాక కృష్ణను అందరూ నిరుత్సాహపరిచిన వాళ్లేనట. తెలుగులో ఇలాంటి సినిమా అస్సలు వర్కవుట్ కాదనే చాలామంది అన్నారట. సినిమాల జడ్జిమెంట్ విషయంలో తిరుగులేని పేరున్న విజయా సంస్థ అధినేత చక్రపాణి అయితే ఈ సినిమా ఆడే అవకాశమే లేదని తీర్పిచ్చేశారట.
‘మోసగాళ్లకు మోసగాడు’ విడుదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృష్ణనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘చక్రపాణి గారికి సినిమా చూపిస్తే ఏమిటీ అవతారాలు.. మన నేటివిటీకి తగిన సినిమా కాదు. ఆడదు అనేశారు. ఆయన జడ్జిమెంట్ చాలా కరెక్ట్గా ఉండేది. ఆయన ఓ సినిమా ఆడదు అన్నారంటే ఆడేది కాదు. కానీ ‘మోసగాళ్లకు మోసగాడు’ విషయంలో ఆయన అంచనాలు తప్పాయి. ఈ సినిమాకు చెన్నైలో ప్రివ్యూ వేసినపుడు చూసిన వాళ్లలో కూడా చాలామంది ఆఢటం కష్టమనే అన్నారు. కానీ ఎన్టీఆర్ గారు మాత్రం మంచి మాస్ చిత్రం తీశామని అభినందించారు. సినిమా హిట్టవుతుందని.. కానీ లేడీస్ చూడరని అన్నారు. ‘మోసగాళ్లకు మోసగాడు’కు లాంగ్ రన్ లేదు కానీ.. వసూళ్లు బాగా వచ్చాయి. తర్వాత వివిధ భాషల్లో ఈ చిత్రాన్ని అనువదించాం’’ అని కృష్ణ తెలిపారు.
This post was last modified on August 28, 2021 12:58 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…