మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన చిరు ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా తరువాత బాబీతో ఓ సినిమా అలానే మెహర్ రమేష్ తో మరో సినిమా చేయబోతున్నారు. రీసెంట్ గా చిరంజీవి పుట్టినరోజు నాడు ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను రివీల్ చేశారు. చిరు-బాబీ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది.
చిరు మాస్ లుక్ లో దర్శనమిచ్చారు. అయితే ఈ సినిమా టైటిల్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు. మొదటినుండి కూడా దీనికి ‘వీరయ్య’ అనే టైటిల్ అనుకుంటున్నారు. బాబీ కూడా అదే టైటిల్ తో కథ రాసుకున్నాడు. చిరు కూడా ఓకే చెప్పారు కానీ ఇప్పుడు ‘వీరయ్య’ టైటిల్ మరీ పాత వాసన కొడుతుందని.. మార్చమని దర్శకుడికి చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే చిరు పుట్టినరోజు నాడు టైటిల్ ప్రకటించలేదు.
ఇప్పుడు సినిమాకి కొత్త టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అదేంటంటే ‘వాల్తేర్ శీను’. చిరుకి కూడా ఈ టైటిల్ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట. సరైన సమయం చూసుకొని ఈ టైటిల్ అనౌన్స్మెంట్ చేయాలని చూస్తున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారు. చిరు ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.
This post was last modified on August 26, 2021 12:02 pm
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…