మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన చిరు ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా తరువాత బాబీతో ఓ సినిమా అలానే మెహర్ రమేష్ తో మరో సినిమా చేయబోతున్నారు. రీసెంట్ గా చిరంజీవి పుట్టినరోజు నాడు ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను రివీల్ చేశారు. చిరు-బాబీ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది.
చిరు మాస్ లుక్ లో దర్శనమిచ్చారు. అయితే ఈ సినిమా టైటిల్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు. మొదటినుండి కూడా దీనికి ‘వీరయ్య’ అనే టైటిల్ అనుకుంటున్నారు. బాబీ కూడా అదే టైటిల్ తో కథ రాసుకున్నాడు. చిరు కూడా ఓకే చెప్పారు కానీ ఇప్పుడు ‘వీరయ్య’ టైటిల్ మరీ పాత వాసన కొడుతుందని.. మార్చమని దర్శకుడికి చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే చిరు పుట్టినరోజు నాడు టైటిల్ ప్రకటించలేదు.
ఇప్పుడు సినిమాకి కొత్త టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అదేంటంటే ‘వాల్తేర్ శీను’. చిరుకి కూడా ఈ టైటిల్ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట. సరైన సమయం చూసుకొని ఈ టైటిల్ అనౌన్స్మెంట్ చేయాలని చూస్తున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారు. చిరు ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…