మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన చిరు ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా తరువాత బాబీతో ఓ సినిమా అలానే మెహర్ రమేష్ తో మరో సినిమా చేయబోతున్నారు. రీసెంట్ గా చిరంజీవి పుట్టినరోజు నాడు ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను రివీల్ చేశారు. చిరు-బాబీ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది.
చిరు మాస్ లుక్ లో దర్శనమిచ్చారు. అయితే ఈ సినిమా టైటిల్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు. మొదటినుండి కూడా దీనికి ‘వీరయ్య’ అనే టైటిల్ అనుకుంటున్నారు. బాబీ కూడా అదే టైటిల్ తో కథ రాసుకున్నాడు. చిరు కూడా ఓకే చెప్పారు కానీ ఇప్పుడు ‘వీరయ్య’ టైటిల్ మరీ పాత వాసన కొడుతుందని.. మార్చమని దర్శకుడికి చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే చిరు పుట్టినరోజు నాడు టైటిల్ ప్రకటించలేదు.
ఇప్పుడు సినిమాకి కొత్త టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అదేంటంటే ‘వాల్తేర్ శీను’. చిరుకి కూడా ఈ టైటిల్ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట. సరైన సమయం చూసుకొని ఈ టైటిల్ అనౌన్స్మెంట్ చేయాలని చూస్తున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారు. చిరు ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.
This post was last modified on August 26, 2021 12:02 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…