మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన చిరు ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా తరువాత బాబీతో ఓ సినిమా అలానే మెహర్ రమేష్ తో మరో సినిమా చేయబోతున్నారు. రీసెంట్ గా చిరంజీవి పుట్టినరోజు నాడు ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను రివీల్ చేశారు. చిరు-బాబీ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది.
చిరు మాస్ లుక్ లో దర్శనమిచ్చారు. అయితే ఈ సినిమా టైటిల్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు. మొదటినుండి కూడా దీనికి ‘వీరయ్య’ అనే టైటిల్ అనుకుంటున్నారు. బాబీ కూడా అదే టైటిల్ తో కథ రాసుకున్నాడు. చిరు కూడా ఓకే చెప్పారు కానీ ఇప్పుడు ‘వీరయ్య’ టైటిల్ మరీ పాత వాసన కొడుతుందని.. మార్చమని దర్శకుడికి చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే చిరు పుట్టినరోజు నాడు టైటిల్ ప్రకటించలేదు.
ఇప్పుడు సినిమాకి కొత్త టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అదేంటంటే ‘వాల్తేర్ శీను’. చిరుకి కూడా ఈ టైటిల్ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట. సరైన సమయం చూసుకొని ఈ టైటిల్ అనౌన్స్మెంట్ చేయాలని చూస్తున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారు. చిరు ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.
This post was last modified on August 26, 2021 12:02 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…