టాలీవుడ్లో ఎవరి గురించైనా నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తుల్లో సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఎంతటి వాళ్లయినా సరే.. తప్పు చేశారనిపిస్తే ఆయన విమర్శించడానికి వెనుకాడరు. అదే సమయంలో మంచి చేసిన వాళ్ల గురించి పొగడ్డానికి కూడా ఆయన ముందుంటారు. కొన్ని సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి మీద కూడా తమ్మారెడ్డి విమర్శలు చేయడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆయనే చిరంజీవి చేస్తున్న మంచి పనుల గురించి ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకొచ్చారు.
దాసరి మరణానంతరం ఆయన స్థానాన్ని తీసుకోవాలని తనతో సహా చాలామంది కోరగా.. నాకెందుకు నాకెందుకు అంటూ వచ్చారని.. కానీ గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ముందుకు వస్తున్నారని.. అద్భుత రీతిలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని తమ్మారెడ్డి అన్నారు. చిరు సేవా కార్యక్రమాలు ఈ రోజు మొదలుపెట్టినవి కావని.. దశాబ్దాల కిందటే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టారని తమ్మారెడ్డి గుర్తు చేశారు.
కరోనా టైంలో తనే లీడ్ తీసుకుని సినీ కార్మికులకు ఒకటికి మూడుసార్లు సరుకులు పంపిణి చేశారని.. అలాగే వ్యక్తిగతంగా ఎంతోమందికి సాయపడ్డారని తమ్మారెడ్డి అన్నారు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం కూడా చాలానే ఖర్చు చేశారని.. ఇవన్నీ కాకుండా చిరు రోజూ చేసే సాయం ఎవరూ ఊహించలేని స్థాయిలో ఉంటుందని తమ్మారెడ్డి తెలిపారు. ప్రతి రోజూ ఆయన నాలుగైదు లక్షలు దానం చేస్తుంటారని.. సాయం కోరి తనను కలిసే వారిని ఆదుకునేందుకు లక్ష, రెండు లక్షలకు చెక్కులు రాస్తూనే ఉంటారని.. ఇలా చేసిన దానాల గురించి చిరంజీవి అసలు పబ్లిసిటీ చేసుకోరని.. ఈ విషయాలు చాలామందికి తెలియవని తమ్మారెడ్డి అన్నారు.
చిరంజీవి ఒక్కరే దానం చేస్తున్నారని అననని.. చాలామంది సాయాలు చేస్తున్నారని.. కానీ చిరు చేసే సాయాలు చాలా పెద్దవని.. చాలామంది తెలుగు ఇండస్ట్రీ ఏం చేస్తోంది.. నిద్ర పోతోందా అంటుంటారని.. అలాంటి వాళ్లకు సమాధానం చెప్పడానికే ఇప్పుడీ విషయాలు వెల్లడించాల్సి వస్తోందని తమ్మారెడ్డి తెలిపారు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…