ప్రముఖ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ గాయాలపాలైనట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆయన చేతికి బలమైన గాయమైంది. ఆ సమయంలో ట్రీట్మెంట్ అందించారు. కానీ తాజాగా మరోసారి ఆ గాయం తిరగబడడంతో ఆయన్ని ముంబై లీలావతి హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఈ విషయం గురించి అభిషేక్ కానీ బచ్చన్ ఫ్యామిలీ కానీ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు.
అయితే హాస్పిటల్ లో ఉన్న కొడుకును చూడడానికి అమితాబ్ బచ్చన్ తన కూతురు శ్వేతా బచ్చన్ తో కలిసి హాస్పిటల్ కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే ఈ ఫొటోల్లో ఎక్కడా ఐశ్వర్యారాయ్ మాత్రం కనిపించలేదు. అభిషేక్ ను పరామర్శించడానికి ఐశ్వర్య హాస్పిటల్ కి రాకపోవడం ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల మధ్యప్రదేశ్ వెళ్లిన ఐశ్వర్య ఇప్పుడు తిరిగి ముంబైకి చేరుకుంది. అయితే ఆమె హాస్పిటల్ వద్ద కనిపించకపోవడంతో అభిషేక్ ని ఆమె పట్టించుకోవడం లేదంటూ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…