ప్రముఖ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ గాయాలపాలైనట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆయన చేతికి బలమైన గాయమైంది. ఆ సమయంలో ట్రీట్మెంట్ అందించారు. కానీ తాజాగా మరోసారి ఆ గాయం తిరగబడడంతో ఆయన్ని ముంబై లీలావతి హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఈ విషయం గురించి అభిషేక్ కానీ బచ్చన్ ఫ్యామిలీ కానీ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు.
అయితే హాస్పిటల్ లో ఉన్న కొడుకును చూడడానికి అమితాబ్ బచ్చన్ తన కూతురు శ్వేతా బచ్చన్ తో కలిసి హాస్పిటల్ కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే ఈ ఫొటోల్లో ఎక్కడా ఐశ్వర్యారాయ్ మాత్రం కనిపించలేదు. అభిషేక్ ను పరామర్శించడానికి ఐశ్వర్య హాస్పిటల్ కి రాకపోవడం ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల మధ్యప్రదేశ్ వెళ్లిన ఐశ్వర్య ఇప్పుడు తిరిగి ముంబైకి చేరుకుంది. అయితే ఆమె హాస్పిటల్ వద్ద కనిపించకపోవడంతో అభిషేక్ ని ఆమె పట్టించుకోవడం లేదంటూ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
This post was last modified on August 24, 2021 1:38 pm
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…
ఫార్చునర్ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…