Movie News

మా ఎన్నిక‌ల‌పై వాదోప‌వాదాలు


ఎంతో ఆస‌క్తి రేకెత్తిస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లపై ఎటూ తేల్చ‌కుండానే మా స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ముగిసిపోయింది. క‌రోనా నేప‌థ్యంలో ఆదివారం వ‌ర్చువ‌ల్‌గా ఈ స‌మావేశం నిర్వ‌హించారు. సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీ మోహ‌న్, కృష్ణంరాజు, మోహ‌న్ బాబు, ప్ర‌కాష్ రాజ్, న‌రేష్ స‌హా ప‌లువురు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. మా ఎన్నిక‌లు ఎప్పుడు నిర్వ‌హించాల‌నే విష‌యంలో ఈ స‌మావేశంలో వాదోప‌వాదాలు జ‌రిగాయి.

వీలైనంత త్వ‌ర‌గా, సెప్టెంబ‌రులోనే నిర్వ‌హించాల‌ని ప్ర‌కాష్ రాజ్ స‌హా కొంద‌రు డిమాండ్ చేయ‌గా.. మ‌రికొంద‌రేమో అక్టోబ‌రులో ఎన్నిక‌లు జ‌రిపితే మంచిద‌న్నారు. జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ జ‌రిగిన 21 రోజుల్లో, అంటే సెప్టెంబ‌రు 12న ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని.. కుద‌ర‌కుంటే ఇంకో వారం రోజులు మాత్ర‌మే స‌మ‌యం తీసుకోవాల‌ని.. అంత‌కుమించి ఆల‌స్యం చేయొద్ద‌ని ప్ర‌కాష్ రాజ్ అన్నారు. ప్ర‌జాస్వామ్యంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న‌న్నారు.

ఐతే ఇంకో 21 రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌ప‌డం సాధ్యం కాద‌ని ముర‌ళీ మోహ‌న్ అన్నారు. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు తీసుకుని, భౌతిక దూరం పాటిస్తూ ఎన్నిక‌లు జ‌ర‌పాల్సి ఉంటుంద‌ని.. కాబ‌ట్టి సెప్టెంబ‌రు రెండో వారం నుంచి అక్టోబ‌రు రెండో వారం వ‌ర‌కు అనువైన తేదీని చూసి ఎన్నిక‌లు జ‌రుపుతామ‌ని.. ఇంకో వారం రోజుల్లో దీనిపై నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తామ‌ని ముర‌ళీ మోహ‌న్ అన్నారు.

ఇదిలా ఉండ‌గా.. మా జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌లో వాదోప‌వాదాలు జ‌ర‌గ‌డం ప‌ట్ల మోహ‌న్ బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అలాగే మా కోసం ఇంత‌కుముందు బిల్డింగ్ క‌ట్టి, దాన్ని త‌క్కువ ధ‌ర‌కు అమ్మేయ‌డం ప‌ట్ల ఆయ‌న తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఉన్న భ‌వ‌నాన్ని అమ్మేసి ఇప్పుడు మ‌ళ్లీ బిల్డింగ్ కావాల‌న‌డం గురించి ఎవ‌రైనా ఏమైనా మాట్లాడ‌తారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మా స‌మావేశంలో ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్లు ఉంటున్నార‌ని.. ఎవ‌రికి వాళ్లు తాము గొప్ప అనుకుంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

This post was last modified on August 23, 2021 8:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

3 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

5 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

5 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

6 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

6 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

8 hours ago