ఈ ఆదివారం మెగా అభిమానులకు పండుగ రోజు. ఎందుకంటే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. ఈ సందర్భంగా గతంలో ఎన్నడూ లేనంత సందడి కనిపిస్తోంది సామాజిక మాధ్యమాల్లో. చిరు నటిస్తున్న రెండు చిత్రాలకు తోడు.. రాబోయే రెండు చిత్రాల విశేషాలను ఈ రోజు పంచుకోవడంతో సోషల్ మీడియా చిరు నామ స్మరణతో హోరెత్తిపోతోంది.
అలాగే చిరంజీవి పాత సినిమాల వీడియోలతో, ఆయన మీద ప్రత్యేకమైన పోస్టులతో అభిమానులు సందడి చేస్తున్నారు. ఇంకా చిరు పుట్టిన రోజు నేపథ్యంలో సుమ ఆధ్వర్యంలో ట్విట్టర్ స్పేస్ కూడా పెట్టారు. ఈ సందడిలా సాగుతుండగానే ఒక వీడియో సోషల్ మీడియాలోకి అడుగుపెట్టింది. మెగా అభిమానులకు అది మామూలు కిక్ ఇవ్వట్లేదు.
ఎందుకంటే అందులో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులతో పాటు వారి ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. ఆదివారం చిరు పుట్టిన రోజు నాడే రాఖీ పౌర్ణమి పండుగ కూడా వచ్చింది. దీంతో మెగా బ్రదర్స్, సిస్టర్స్ అంతా చిరు ఇంట్లో కలిశారు. ఇద్దరు సిస్టర్స్ ముగ్గురు బ్రదర్స్కు రాఖీలు కట్టి వారి నుంచి శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు అందుకున్నారు.
మెగా బ్రదర్స్ ఇలా కలవడం అరుదే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడో కానీ అన్నయ్యలతో కనిపించడు. ముగ్గురూ కూడా చాలా ఉల్లాసంగా, సంతోషంగా కనిపించడం.. చాలా చాలా క్యాజువల్గా గడుపుతున్నట్లుగా వీడియోలో దర్శనమివ్వడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగా అభిమానులనే సహా అందరినీ ఆకట్టుకుంటోంది. వీడియోలో ఒక చోట నాగబాబుకు ఆయన సోదరి రాఖీ కడుతుంటే.. వెనుక పవన్ కళ్యాణ్ లోపలి నుంచి నీళ్లు తీసుకొచ్చి తన చిరు-సురేఖలకు అందిస్తున్న దృశ్యం అభిమానులను మరింతగా ఆకర్షిస్తోంది.
This post was last modified on August 22, 2021 10:12 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…