సెకండ్ ఇన్నింగ్స్లో మెగాస్టార్ చిరంజీవి మామూలు ఊపులో లేడు. సైరా నరసింహారెడ్డి కోసం కొంచెం ఎక్కువ సమయం వెచ్చించిన చిరు.. ఆ తర్వాత చకచకా సినిమాలు ఓకే చేసేస్తున్నాడు. ఒక్కొక్కటిగా పట్టాలెక్కించేస్తున్నాడు. కరోనా కారణంగా ఆచార్య కొంచెం ఆలస్యమైనప్పటికీ.. సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత ఆ సినిమా పని పూర్తయిపోయింది.
ఇటీవలే మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ను మొదలుపెట్టడం తెలిసిందే. ఆ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే పేరు ఖరారు చేస్తూ ఈ రోజు ప్రి లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆదివారం చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులకు ఈ చిత్ర బృందం ఈ కానుక ఇచ్చింది. దీంతో పాటు ఆచార్య నుంచి ఏదో ఒక విశేషాన్ని పంచుకోబోతోంది చిత్ర బృందం.
అలాగే బాబీ దర్శకత్వంలో చిరు నటించనున్న 154వ సినిమా, మెహర్ రమేష్ డైరెక్షన్లో చిరు చేయనున్న 155వ సినిమా నుంచి కూడా అభిమానులకు కానుకలు అందబోతున్న సంగతి ఖరారైంది. ఇక్కడి వరకు ముందు నుంచి అంచనాలు ఉన్నాయి కానీ.. ఇప్పుడో కొత్త సర్ప్రైజ్ కూడా రాబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. యువ దర్శకుడు మెగాస్టార్ కోసం ఒక కథ రెడీ చేసి ఆయనకు వినిపించినట్లు ఇటీవలే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని.. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని.. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన కూడా ఉంటుందని అంటున్నారు.
మారుతి లాంటి ట్రెండీ డైరెక్టర్ చిరును డైరెక్ట్ చేస్తే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. మారుతికి కూడా ఇది చాలా పెద్ద అవకాశం అవుతుంది. యువి వాళ్ల స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఆదివారం చిరు 156 గురించి నిజంగానే అనౌన్స్మెంట్ ఉంటుందేమో చూడాలి.
This post was last modified on August 22, 2021 6:08 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…