సెకండ్ ఇన్నింగ్స్లో మెగాస్టార్ చిరంజీవి మామూలు ఊపులో లేడు. సైరా నరసింహారెడ్డి కోసం కొంచెం ఎక్కువ సమయం వెచ్చించిన చిరు.. ఆ తర్వాత చకచకా సినిమాలు ఓకే చేసేస్తున్నాడు. ఒక్కొక్కటిగా పట్టాలెక్కించేస్తున్నాడు. కరోనా కారణంగా ఆచార్య కొంచెం ఆలస్యమైనప్పటికీ.. సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత ఆ సినిమా పని పూర్తయిపోయింది.
ఇటీవలే మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ను మొదలుపెట్టడం తెలిసిందే. ఆ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే పేరు ఖరారు చేస్తూ ఈ రోజు ప్రి లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆదివారం చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులకు ఈ చిత్ర బృందం ఈ కానుక ఇచ్చింది. దీంతో పాటు ఆచార్య నుంచి ఏదో ఒక విశేషాన్ని పంచుకోబోతోంది చిత్ర బృందం.
అలాగే బాబీ దర్శకత్వంలో చిరు నటించనున్న 154వ సినిమా, మెహర్ రమేష్ డైరెక్షన్లో చిరు చేయనున్న 155వ సినిమా నుంచి కూడా అభిమానులకు కానుకలు అందబోతున్న సంగతి ఖరారైంది. ఇక్కడి వరకు ముందు నుంచి అంచనాలు ఉన్నాయి కానీ.. ఇప్పుడో కొత్త సర్ప్రైజ్ కూడా రాబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. యువ దర్శకుడు మెగాస్టార్ కోసం ఒక కథ రెడీ చేసి ఆయనకు వినిపించినట్లు ఇటీవలే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని.. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని.. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన కూడా ఉంటుందని అంటున్నారు.
మారుతి లాంటి ట్రెండీ డైరెక్టర్ చిరును డైరెక్ట్ చేస్తే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. మారుతికి కూడా ఇది చాలా పెద్ద అవకాశం అవుతుంది. యువి వాళ్ల స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఆదివారం చిరు 156 గురించి నిజంగానే అనౌన్స్మెంట్ ఉంటుందేమో చూడాలి.
This post was last modified on August 22, 2021 6:08 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…