కరోనాతో అన్ని భాషల సినిమా పరిశ్రమలూ గట్టి దెబ్బలే తిన్నాయి కానీ.. బాలీవుడ్కు తగిలిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్కు మధ్యలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో ఓ మోస్తరుగానే కోలుకున్నాయి. ఇక్కడ రిలీజైన సినిమాలు బాగానే ఆడాయి. వసూళ్లు రాబట్టాయి. కానీ బాలీవుడ్లో మాత్రం ఈ పరిస్థితి లేదు. ఏదో నామమాత్రంగా కొన్ని చిత్రాలు రిలీజయ్యాయి. అవేవీ ఆశించిన ఫలితాలనివ్వలేదు. ఉత్తరాదిన చాలా వరకు థియేటర్లపై ఆంక్షలు కొనసాగాయి.
ఇంతలోనే సెకండ్ వేవ్ వచ్చి మరోసారి థియేటర్లను మూత వేయించింది. మళ్లీ ఇప్పటిదాకా ఉత్తరాది రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకోలేదు. అయినా సరే.. ధైర్యం చేసి అక్షయ్ కుమార్ సినిమా బెల్ బాటమ్ను ఈ గురువారం రిలీజ్ చేశారు. బాలీవుడ్కు కేంద్రమైన ముంబయిలో థియేటర్లు మూతపడి ఉండగా ఈ సినిమా రిలీజవడం గమనార్హం. ఇక్కడే కాక ఉత్తరాదిన మరి కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లపై ఆంక్షలు కొనసాగుతుండటంతో ఓపెనింగ్స్పై బాగా ప్రభావం పడింది.
తొలి రోజు అక్షయ్ సినిమాలు ఇండియాలో దాదాపు 20 కోట్లు వసూలు చేస్తాయి మామూలుగా. కానీ ఈ చిత్రానికి మూడు కోట్ల లోపే నెట్ వసూళ్లు వచ్చాయి. సినిమాకు యావరేజ్ టాక్ ఉండటం, థియేటర్లపై ఆంక్షలు, జనాలు ఇంకా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే మూడ్లోకి రాకపోవడం ఇందుక్కారణం.
ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసిన నిర్మాతలకు ఇంకో పెద్ద కష్టం వచ్చి పడింది. రిలీజ్ రోజే బెల్బాటమ్ ఆన్ లైన్లోకి వచ్చేసింది. తమిళ్ రాకర్స్, ఫిల్మీవ్యాప్ లాంటి పైరసీ వెబ్ సైట్లలో ఈ చిత్రాన్ని లీక్ చేసేశారు. మంచి ప్రింట్ అందుబాటులోకి రావడంతో ఇక ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఏం సినిమా చూస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేయడానికి మిగతా నిర్మాతలు ఏం ధైర్యం చేస్తారు?
This post was last modified on August 21, 2021 7:14 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…