తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు రీస్టార్ట్ అయి మూడు వారాలు గడుస్తోంది. ఐతే ఇంకా అనుకున్నంతగా వాటిలో కళ కనిపించట్లేదు. ఇప్పటిదాకా వచ్చిన కొత్త చిత్రాలేవీ పూర్తి స్థాయిలో మెప్పించలేదు. ఎస్ఆర్ కళ్యాణమండపం, పాగల్ చిత్రాలకు కొంత హంగామా కనిపించింది కానీ.. అదంతా తొలి రోజు వరకే. ముఖ్యంగా చెప్పాలంటే మార్నింగ్ షోలకే సందడి పరిమితం అయింది.
ఈ రెండు చిత్రాలూ అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ప్రేక్షకులు వాటిని ఎంజాయ్ చేయలేకపోయారు. తిమ్మరసు పర్వాలేదనిపించింది కానీ.. దానికి థియేటర్లలో పెద్దగా హడావుడి లేదు. ఈ వారం రానున్న సినిమాల్లో ‘రాజ రాజ చోర’ పరిస్థితి పర్వాలేదు. ఆ తర్వాతి వారం శ్రీదేవి సోడా సెంటర్, ఇచట వాహనములు నిలుపరాదు సినిమాలపై ఆసక్తి ఓ మోస్తరుగా ఉంది కానీ.. టాలీవుడ్కు అసలైన ఊపు తెస్తాయనే ఆశ వీటిపై లేదు.
స్టార్ ఇమేజ్ ఉన్న హీరో హీరోయిన్లు నటించి.. మంచి క్రేజ్ ఉన్న సినిమా కోసం ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అలాంటి సినిమా వస్తేనే బాక్సాఫీస్కు అసలైన కిక్కు. ‘లవ్ స్టోరి’ కచ్చితంగా ఆ తరహా సినిమానే. కరోనా సెకండ్ వేవ్ ఎటాక్ లేకుంటే ఏప్రిల్ 16నే ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ అనివార్య పరిస్థితుల్లో వాయిదా పడి.. థియేటర్లు పున:ప్రారంభం అయ్యాక మంచి టైమింగ్ కోసం ఎదురు చూస్తోందీ చిత్రం. నెమ్మదిగా పరిస్థితులు మెరుగవుతుండటం.. ఏపీలో టికెట్ల రేట్ల గొడవ కూడా పరిష్కారం అయ్యేలా కనిపిస్తుండటం ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఇచ్చారు.
సెప్టెంబరు 10న ఈ శేఖర్ కమ్ముల సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగచైతన్య మరీ పెద్ద స్టార్ కాకున్నా.. అతను సాయిపల్లవితో జోడీ కట్టడం.. ‘ఫిదా’ తర్వాత కమ్ముల తీసిన సినిమా కావడం.. దీని పాటలు, ఇతర ప్రోమోలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఓ పెద్ద సినిమా స్థాయిలో దీనికి క్రేజ్ ఉంది. ఈ చిత్రం వస్తే బాక్సాఫీస్కు అసలైన ఊపు వస్తుందని.. టాలీవుడ్కు మళ్లీ మంచి రోజులు మొదలైనట్లే అని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…