తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు రీస్టార్ట్ అయి మూడు వారాలు గడుస్తోంది. ఐతే ఇంకా అనుకున్నంతగా వాటిలో కళ కనిపించట్లేదు. ఇప్పటిదాకా వచ్చిన కొత్త చిత్రాలేవీ పూర్తి స్థాయిలో మెప్పించలేదు. ఎస్ఆర్ కళ్యాణమండపం, పాగల్ చిత్రాలకు కొంత హంగామా కనిపించింది కానీ.. అదంతా తొలి రోజు వరకే. ముఖ్యంగా చెప్పాలంటే మార్నింగ్ షోలకే సందడి పరిమితం అయింది.
ఈ రెండు చిత్రాలూ అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ప్రేక్షకులు వాటిని ఎంజాయ్ చేయలేకపోయారు. తిమ్మరసు పర్వాలేదనిపించింది కానీ.. దానికి థియేటర్లలో పెద్దగా హడావుడి లేదు. ఈ వారం రానున్న సినిమాల్లో ‘రాజ రాజ చోర’ పరిస్థితి పర్వాలేదు. ఆ తర్వాతి వారం శ్రీదేవి సోడా సెంటర్, ఇచట వాహనములు నిలుపరాదు సినిమాలపై ఆసక్తి ఓ మోస్తరుగా ఉంది కానీ.. టాలీవుడ్కు అసలైన ఊపు తెస్తాయనే ఆశ వీటిపై లేదు.
స్టార్ ఇమేజ్ ఉన్న హీరో హీరోయిన్లు నటించి.. మంచి క్రేజ్ ఉన్న సినిమా కోసం ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అలాంటి సినిమా వస్తేనే బాక్సాఫీస్కు అసలైన కిక్కు. ‘లవ్ స్టోరి’ కచ్చితంగా ఆ తరహా సినిమానే. కరోనా సెకండ్ వేవ్ ఎటాక్ లేకుంటే ఏప్రిల్ 16నే ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ అనివార్య పరిస్థితుల్లో వాయిదా పడి.. థియేటర్లు పున:ప్రారంభం అయ్యాక మంచి టైమింగ్ కోసం ఎదురు చూస్తోందీ చిత్రం. నెమ్మదిగా పరిస్థితులు మెరుగవుతుండటం.. ఏపీలో టికెట్ల రేట్ల గొడవ కూడా పరిష్కారం అయ్యేలా కనిపిస్తుండటం ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఇచ్చారు.
సెప్టెంబరు 10న ఈ శేఖర్ కమ్ముల సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగచైతన్య మరీ పెద్ద స్టార్ కాకున్నా.. అతను సాయిపల్లవితో జోడీ కట్టడం.. ‘ఫిదా’ తర్వాత కమ్ముల తీసిన సినిమా కావడం.. దీని పాటలు, ఇతర ప్రోమోలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఓ పెద్ద సినిమా స్థాయిలో దీనికి క్రేజ్ ఉంది. ఈ చిత్రం వస్తే బాక్సాఫీస్కు అసలైన ఊపు వస్తుందని.. టాలీవుడ్కు మళ్లీ మంచి రోజులు మొదలైనట్లే అని అంచనా వేస్తున్నారు.
This post was last modified on August 18, 2021 1:19 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…