బాలీవుడ్కు కేంద్రం… అంటే ముంబయి నగరమే. హిందీ చిత్ర పరిశ్రమ పని చేసేదే ఆ నగరం నుంచే. మరి ఆ సిటీలో థియేటర్లన్నీ మూత పడి ఉండగా ఒక హిందీ సినిమా విడుదల కావడాన్ని ఊహించగలమా? అందులోనూ అది అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ నటించిన సినిమా కావడం అనూహ్యం. ఇప్పుడు అదే జరుగుతోంది. అక్షయ్ ప్రధాన పాత్ర పోషించిన కొత్త చిత్రం బెల్ బాటమ్.. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
కానీ మహారాష్ట్రలో ముంబయి సహా పలు ప్రాంతాల్లో థియేటర్లు మూతపడే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత థియేటర్లను తెరిచినట్లే తెరిచి మూయించేశారు. కరోనా మూడో వేవ్ ముప్పును నివారించడానికే ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చింది. ఐతే థియేటర్లు తెరుచుకోగానే బెల్ బాటమ్ చిత్రానికి రిలీజ్ డేట్ ఇచ్చారు. తర్వాత వాయిదా వేశారు. చివరికి ఆగస్టు 19న ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను రిలీజ్ చేయడానికే డిసైడయ్యారు.
కొన్ని రోజుల తర్వాత పరిస్థితులు మారుతాయేమో, ముంబయి సహా ఇతర ప్రాంతాల్లో థియేటర్లు తెరుచుకుంటాయేమో అని చూశారు. కానీ అలా జరగలేదు. మిగతా అన్ని చోట్లా బెల్ బాటమ్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగాయి. సినిమాను ఆపేకొద్దీ నష్టమే అని భావించి.. ఇక రిలీజ్ చేయడానికే చిత్ర బృందం నిర్ణయించుకుంది. ఇంత పెద్ద హిందీ సినిమా రిలీజవుతుంటే.. ముంబయిలో థియేటర్లన్నీ మూత పడి ఉండటం అక్కడి సినీ ప్రియులకు.. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్లకు తీవ్ర ఆవేదన కలిగించేదే.
బాలీవుడ్ ఎలాంటి స్థితిలో ఉందో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఈ సినిమాకు మంచి ఫలితం దక్కి.. ఆ తర్వాత అయినా థియేటర్లు తెరుచుకుంటే మరిన్ని పెద్ద సినిమాలను విడుదల చేయడానికి బాలీవుడ్ రెడీ అవుతోంది. మరి బెల్ బాటమ్ మూవీకి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.
This post was last modified on August 18, 2021 10:53 am
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…