Chiranjeevi
ఆగస్టు 22.. మెగాస్టార్ అభిమానులందరికీ ఒక పండుగ రోజు. ఆ రోజు చిరంజీవి పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. మధ్యలో సినిమాలకు దూరంగా ఉన్న పదేళ్లను పక్కన పెడితే.. మిగతా సమయాల్లో ప్రతి ఏటా ఆ రోజు ఏదో రకంగా ఆయన సినిమాల సందడి పక్కా. అందులోనూ రీఎంట్రీ తర్వాత చిరు తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది చాలా సినిమాలే లైన్లో పెట్టారు. ఆల్రెడీ చేస్తున్న రెండు సినిమాలకు తోడు.. మరో రెండు చిత్రాలు ఖరారయ్యాయి. ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్తో ఈ ఆగస్టు 22న సోషల్ మీడియా హోరెత్తబోతోందని సమాచారం.
ఆచార్య సినిమా నుంచి ఒక వీడియో గ్లింప్స్తో చిరుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పబోతోందట చిత్ర బృందం. ఇక చిరు ఇటీవలే మొదలుపెట్టిన లూసిఫర్ రీమేక్కు సంబంధించి ఫస్ట్ లుక్ లాంచ్ పక్క అంటున్నారు. ఈ చిత్ర టైటిల్ను కూడా అదే రోజు ప్రకటిస్తారేమో చూడాలి. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మరోవైపు బాబీ దర్శకత్వంలో చిరు చేయనున్న సినిమా గురించి ఒక పోస్టర్తో అధికారిక ప్రకటన ఇస్తారంటున్నారు. ఈ సినిమాలో చిరు లుక్ను కూడా రిలీజ్ చేస్తారంటున్నారు. దానిపై క్లారిటీ లేదు.
ఇంకోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు చేయనున్న కొత్త చిత్రం నుంచి కూడా ఓ అప్డేట్ పక్కా అని మెగా ఫ్యామిలీ సన్నిహిత పీఆర్వో ఒకరు ట్విట్టర్లో వెల్లడించారు. దీంతో పాటుగా కామన్ డీపీ, స్పేస్, స్పెషల్ ట్రెండ్స్ లాంటి అభిమానులను అలరించే సోషల్ మీడియా కార్యక్రమాలు కూడా ఆగస్టు 22న సందడి చేయబోతున్నాయి. మొత్తంగా ఆ రోజంతా సోషల్ మీడియా చిరు నామస్మరణతో హోరెత్తబోతోందన్నది స్పష్టం.
This post was last modified on August 18, 2021 10:25 am
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…