తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తిరుగులేని స్థాయిని అందుకున్న కథానాయిక అనుష్క. గత దశాబ్దంన్నరలో టాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోయిన్లను చూశాం. గ్లామర్, యాక్టింగ్ విషయంలో ఎవరికి వాళ్లే సాటే అనిపించే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ అనుష్క లాంటి స్థాయి మాత్రం ఎవరూ అందుకోలేదు. కెరీర్ ఆరంభంలోనే ‘అరుంధతి’తో ఆమె ఒకేసారి చాలా మెట్లు ఎక్కేసింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కథానాయికగా నటిస్తూ అందుకున్న విజయాలకు తోడు రుద్రమదేవి, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆమె ఎవ్వరూ అందుకోలేని స్థాయిని చేరుకుంది.
ఐతే కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో కొన్నిసార్లు అనుష్క తప్పటడుగులూ వేసింది. మరో ‘అరుంధతి’ అవుతుందనుకున్న ‘పంచాక్షరి’.. గొప్ప ప్రయోగం అవుతుందనుకున్న ‘సైజ్ జీరో’.. ‘భాగమతి’ని మించి పోతుందనుకున్న ‘నిశ్శబ్దం’ ఏమయ్యాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుష్క ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
‘నిశ్శబ్దం’ తర్వాత మరోసారి గ్యాప్ తీసుకున్న స్వీటీ.. నవీన్ పొలిశెట్టి కాంబినేషన్లో ఒక వెరైటీ సినిమా ఏదో చేయబోతోందన్నారు. దాని గురించి ఇప్పటిదాకా ఏ అప్డేట్ లేదు. ఐతే ఇప్పుడేమో తమిళ చిత్రం ‘నేత్రికన్’ రీమేక్లో అనుష్క నటించనుందంటూ ఓ ప్రచారం మొదలైంది. నయనతార ప్రధాన పాత్రలో ‘గృహం’ దర్శకుడు మిలింద్ రావు రూపొందించిన ఈ చిత్రం ఇటీవలే హాట్ స్టార్లో నేరుగా రిలీజైంది. ఐతే అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం విఫలమైంది. మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులో ఉండటం గమనార్హం.
మరి నెగెటివ్ టాక్ తెచ్చుకుని, తెలుగులో కూడా అందుబాటులో ఉన్న సినిమాను అనుష్క ప్రధాన పాత్రలో రీమేక్ చేయడమేంటో అర్థం కావడం లేదు. ఆల్రెడీ సైజ్ జీరో, నిశ్శబ్దం చిత్రాల్లో డీగ్లామరస్ రోల్స్ చేసి అనుష్క గట్టి ఎదురు దెబ్బలు తింది. అవి చాలవన్నట్లు ఇప్పుడు నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలో, అది కూడా అంధురాలిగా కనిపించడం అంటే పెద్ద తప్పటడుగే అవుతుంది. అనుష్క అంత పని చేయదనే ఆశిద్దాం.
This post was last modified on August 16, 2021 6:27 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…