కరోనా పుణ్యమా అని ఇండియాలో వెబ్ సిరీస్ల మేకింగ్ బాగా ఊపందుకుంది. బాలీవుడ్లో ముందు నుంచే పెద్ద పెద్ద స్టార్లు వెబ్ సిరీస్ల్లో నటిస్తుండగా.. ఇప్పుడా ఒరవడి ఇంకా పెరిగింది. అజయ్ దేవగణ్, షాహిద్ కపూర్ లాంటి బడా హీరోలు డిజిటల్ డెబ్యూకు రెడీ అయిపోయారు. ఇక తెలుగు స్టార్లు కూడా ఆ దిశగా అడుగులు వేయాల్సిన రోజులు వచ్చేశాయి.
అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్లు డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకరి గురించి స్పష్టత వచ్చేసింది. వెంకీ డిజిటల్ అరంగేట్రాన్ని ఆయన సోదరుడు దగ్గుబాటి వెంకటేష్ ఖరారు చేశారు. వెంకీ ఓ హిందీ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇందులో తన కొడుకు రానా దగ్గుబాటి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తాడని చెప్పారాయన.
నెట్ ఫ్లిక్స్ భాగస్వామ్యంతో సురేష్ ప్రొడక్షన్సే ఈ సిరీస్ను నిర్మించబోతుండటం విశేషం. ప్రధానంగా హిందీలో తెరకెక్కే ఈ సిరీస్ను పాన్ ఇండియా లెవెల్లో వివిధ భాషల్లో రిలీజ్ చేస్తారట. వెంకీ 90వ దశకంలో కొన్ని హిందీ సినిమాలు చేశాడు. ఆ తర్వాత మాత్రం బాలీవుడ్ వైపు చూడలేదు. దమ్ మారో దమ్, డిపార్ట్మెంట్, బాహుబలి, ఘాజీ లాంటి చిత్రాలతో రానాకు హిందీలో మంచి గుర్తింపే ఉంది.
అతడి సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజవుతున్నాయి. హిందీలో సిరీస్ కాబట్టి బాలీవుడ్ నుంచి పేరున్న ఆర్టిస్టులను తీసుకునే అవకాశముంది. కాబట్టి ఈ సిరీస్కు మంచి క్రేజే రావచ్చు. మరి వెండితెరపై ఇప్పటిదాకా కలిసి నటించని వెంకీ-రానా ఇలా బుల్లితెర కోసం జట్టు కడుతుండటం విశేషమే. బహుశా ఈ ఇద్దరూ కలిసి ఓ థ్రిల్లర్ సిరీస్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే వివరాలు వెల్లడి కానున్నాయి.
This post was last modified on August 15, 2021 12:57 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…
నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్…
ఒక డిజాస్టర్ పడితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డు గతంలో ఎంత ఉందనేది నిర్మాతలు పట్టించుకోరు. అందులోనూ వెటరన్ డైరెక్టర్స్…
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా…