కరోనా పుణ్యమా అని ఇండియాలో వెబ్ సిరీస్ల మేకింగ్ బాగా ఊపందుకుంది. బాలీవుడ్లో ముందు నుంచే పెద్ద పెద్ద స్టార్లు వెబ్ సిరీస్ల్లో నటిస్తుండగా.. ఇప్పుడా ఒరవడి ఇంకా పెరిగింది. అజయ్ దేవగణ్, షాహిద్ కపూర్ లాంటి బడా హీరోలు డిజిటల్ డెబ్యూకు రెడీ అయిపోయారు. ఇక తెలుగు స్టార్లు కూడా ఆ దిశగా అడుగులు వేయాల్సిన రోజులు వచ్చేశాయి.
అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్లు డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకరి గురించి స్పష్టత వచ్చేసింది. వెంకీ డిజిటల్ అరంగేట్రాన్ని ఆయన సోదరుడు దగ్గుబాటి వెంకటేష్ ఖరారు చేశారు. వెంకీ ఓ హిందీ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇందులో తన కొడుకు రానా దగ్గుబాటి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తాడని చెప్పారాయన.
నెట్ ఫ్లిక్స్ భాగస్వామ్యంతో సురేష్ ప్రొడక్షన్సే ఈ సిరీస్ను నిర్మించబోతుండటం విశేషం. ప్రధానంగా హిందీలో తెరకెక్కే ఈ సిరీస్ను పాన్ ఇండియా లెవెల్లో వివిధ భాషల్లో రిలీజ్ చేస్తారట. వెంకీ 90వ దశకంలో కొన్ని హిందీ సినిమాలు చేశాడు. ఆ తర్వాత మాత్రం బాలీవుడ్ వైపు చూడలేదు. దమ్ మారో దమ్, డిపార్ట్మెంట్, బాహుబలి, ఘాజీ లాంటి చిత్రాలతో రానాకు హిందీలో మంచి గుర్తింపే ఉంది.
అతడి సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజవుతున్నాయి. హిందీలో సిరీస్ కాబట్టి బాలీవుడ్ నుంచి పేరున్న ఆర్టిస్టులను తీసుకునే అవకాశముంది. కాబట్టి ఈ సిరీస్కు మంచి క్రేజే రావచ్చు. మరి వెండితెరపై ఇప్పటిదాకా కలిసి నటించని వెంకీ-రానా ఇలా బుల్లితెర కోసం జట్టు కడుతుండటం విశేషమే. బహుశా ఈ ఇద్దరూ కలిసి ఓ థ్రిల్లర్ సిరీస్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే వివరాలు వెల్లడి కానున్నాయి.
This post was last modified on August 15, 2021 12:57 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…