హృతిక్ రోషన్.. సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్ అంటే ఇండియన్ యాక్షన్ ఫిలిం లవర్స్ చాలా ఎగ్జైట్ అయిపోతారు. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం బ్యాంగ్ బ్యాంగ్ సూపర్ హిట్టయింది. మళ్లీ ఈ ఇద్దరూ కలిసి చేసిన వార్ మూవీ పెద్ద బ్లాక్బస్టరే అయింది.
యాక్షన్ సినిమాలను చాలా స్టైలిష్గా ప్రెజెంట్ చేస్తాడని పేరున్న సిద్దార్థ్.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా పఠాన్ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తవ్వగానే మళ్లీ అతను హృతిక్తోనే జట్టు కట్టబోతున్నాడు. ఆ చిత్రమే.. ఫైటర్. ఇప్పటిదాకా హృతిక్తో నేల మీదే యాక్షన్ విన్యాసాలు చేయించిన సిద్దార్థ్.. ఈసారి ఆకాశంలో అద్భుతాలు చేయించబోతున్నాడు. ఇది ఇండియాలో తెరకెక్కనున్న పూర్తి స్థాయి ఏరియల్ యాక్షన్ మూవీ.
దీన్ని ఒక ఫ్రాంఛైజీగా తీయబోతున్నట్లు నిర్మాణ సంస్థ వయాకామ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా మొదలు కాకముందే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఏడాదిన్నర తర్వాత 2023 జనవరి 26న గణతంత్ర దినోత్సవ కానుకగా ఫైటర్ విడుదల కానున్నట్లు వయాకామ్ సంస్థ ప్రకటించింది.
ఈ చిత్రంలో హృతిక్ సరసన దీపికా పదుకొనే కథానాయికగా నటించనుంది. హృతిక్-సిద్దార్థ్-దీపికా.. ఈ కాంబినేషనే ప్రేక్షకులను ఎంతో ఎగ్టైజ్ చేస్తోంది. చివరగా వార్ మూవీతోనే పలకరించిన హృతిక్.. ప్రస్తుతం సౌత్ సూపర్ హిట్ మూవీ విక్రమ్ వేద రీమేక్లో నటిస్తున్నాడు.
ఇందులో అతను ఒరిజినల్లో విజయ్ సేతుపతి చేసిన రౌడీ పాత్రలో కనిపించనున్నాడు. మాధవన్ చేసిన పోలీస్ క్యారెక్టర్లో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. మాతృకను రూపొందించిన పుష్కర్-గాయత్రిలే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు.
This post was last modified on August 14, 2021 6:54 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…