తమ సినిమాలు విడుదలయ్యే ముందు అందరూ గొప్పలు చెప్పుకునేవాళ్లే. కొందరైతే మరీ మరీ శ్రుతి మించిపోయి స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారు. దాని వల్ల కొన్నిసార్లు మంచి జరుగుతుంది, కొన్నిసార్లు చెడు జరుగుతుంది.
ముందు నుంచి స్టేజ్ల మీద చాలా అగ్రెసివ్గా మాట్లాడ్డం అలవాటైన యువ కథానాయకుడు విశ్వక్సేన్.. తన కొత్త చిత్రం పాగల్ గురించి ప్రి రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్లు సంచలనం రేపాయి. ఈ సినిమాతో మూసుకున్న థియేటర్లు కూడా తెరిపించేస్తా.. లేకుంటే పేరు మార్చుకుంటా అంటూ అతను ఇచ్చిన స్టేట్మెంట్ చర్చనీయాంశం అయింది.
ఇంకా సినిమా గురించి ఓ రేంజిలో చెప్పుకుంటూ పోయాడు విశ్వక్. ఐతే శనివారం థియేటర్లకు వెళ్లి సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ విశ్వక్ కామెంట్స్ చాలా అతిగానే అనిపించాయి. ఫస్టాఫ్లో కొన్ని కామెడీ సీన్లు, విశ్వక్ పెర్ఫామెన్స్ వరకు ఓకే కానీ.. అంతకుమించి సినిమాలో ఏమంత విషయం లేదు. సీరియస్గా కథలోకి దిగిన దగ్గర్నుంచి సినిమా గాడి తప్పింది. దీంతో విశ్వక్ చెప్పిందేంటి.. సినిమాలో ఉన్నదేంటి అంటూ నెటిజన్లు రివర్స్లో అతణ్ని ఆడుకోవడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం నుంచి విశ్వక్ బాగా ట్రోల్ అవుతున్నాడు.
ఐతే ఇలా ట్రోల్ అయితే అయ్యాడు కానీ.. ప్రి రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్లతో అతడి లక్ష్యం మాత్రం నెరవేరింది. పాగల్కు అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాలకు మించి జరిగాయి. శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సినిమాకు ఫుల్స్ పడ్డాయి. చాలా చోట్ల మార్నింగ్ షోలకు టికెట్లు దొరకని పరిస్థితి కనిపించింది. ఇప్పుడు డివైడ్ టాక్ వల్ల వీకెండ్ తర్వాత సినిమా పరిస్థితి కష్టమే కావచ్చు కానీ.. వారాంతం వరకు ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబట్టి నిర్మాతలు, బయ్యర్లను బయటపడేసేలాగే కనిపిస్తోంది.
This post was last modified on August 14, 2021 6:38 pm
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…