తమ సినిమాలు విడుదలయ్యే ముందు అందరూ గొప్పలు చెప్పుకునేవాళ్లే. కొందరైతే మరీ మరీ శ్రుతి మించిపోయి స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారు. దాని వల్ల కొన్నిసార్లు మంచి జరుగుతుంది, కొన్నిసార్లు చెడు జరుగుతుంది.
ముందు నుంచి స్టేజ్ల మీద చాలా అగ్రెసివ్గా మాట్లాడ్డం అలవాటైన యువ కథానాయకుడు విశ్వక్సేన్.. తన కొత్త చిత్రం పాగల్ గురించి ప్రి రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్లు సంచలనం రేపాయి. ఈ సినిమాతో మూసుకున్న థియేటర్లు కూడా తెరిపించేస్తా.. లేకుంటే పేరు మార్చుకుంటా అంటూ అతను ఇచ్చిన స్టేట్మెంట్ చర్చనీయాంశం అయింది.
ఇంకా సినిమా గురించి ఓ రేంజిలో చెప్పుకుంటూ పోయాడు విశ్వక్. ఐతే శనివారం థియేటర్లకు వెళ్లి సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ విశ్వక్ కామెంట్స్ చాలా అతిగానే అనిపించాయి. ఫస్టాఫ్లో కొన్ని కామెడీ సీన్లు, విశ్వక్ పెర్ఫామెన్స్ వరకు ఓకే కానీ.. అంతకుమించి సినిమాలో ఏమంత విషయం లేదు. సీరియస్గా కథలోకి దిగిన దగ్గర్నుంచి సినిమా గాడి తప్పింది. దీంతో విశ్వక్ చెప్పిందేంటి.. సినిమాలో ఉన్నదేంటి అంటూ నెటిజన్లు రివర్స్లో అతణ్ని ఆడుకోవడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం నుంచి విశ్వక్ బాగా ట్రోల్ అవుతున్నాడు.
ఐతే ఇలా ట్రోల్ అయితే అయ్యాడు కానీ.. ప్రి రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్లతో అతడి లక్ష్యం మాత్రం నెరవేరింది. పాగల్కు అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాలకు మించి జరిగాయి. శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సినిమాకు ఫుల్స్ పడ్డాయి. చాలా చోట్ల మార్నింగ్ షోలకు టికెట్లు దొరకని పరిస్థితి కనిపించింది. ఇప్పుడు డివైడ్ టాక్ వల్ల వీకెండ్ తర్వాత సినిమా పరిస్థితి కష్టమే కావచ్చు కానీ.. వారాంతం వరకు ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబట్టి నిర్మాతలు, బయ్యర్లను బయటపడేసేలాగే కనిపిస్తోంది.
This post was last modified on August 14, 2021 6:38 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…