గతంలో పెళ్లయిందంటే చాలు.. హీరోయిన్ల కెరీర్లు చాలా వరకు అటకెక్కేసేవి. చాలామంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలన్న నిర్ణయం ముందే తీసుకుని ఏడడుగులు వేసేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. పెళ్లి తర్వాత స్వేచ్ఛగా సినిమాల్లో నటిస్తున్నారు హీరోయిన్లు. కరీనా కపూర్, దీపికా పదుకొనే, సమంత, శ్రియ.. ఈ జాబితాలో చాలామందే కనిపిస్తారు.
కాజల్ అగర్వాల్ సైతం పెళ్లి తర్వాత సినిమాలేమీ మానేయలేదు. ఇంకా మంచి ఊపులోనే సాగుతోంది. పెళ్లికి ముందు నటిస్తున్న ‘ఆచార్య’ను పూర్తి చేసింది. ‘ఇండియన్-2’ను కూడా పూర్తి చేయడానికి రెడీగా ఉంది. ‘ఉమ’ అనే హిందీ చిత్రంతో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. ఇలా ఆమె ఏ ఇబ్బంది లేకుండా సినిమాలు చేసుకుపోతోందంటే అందుకు భర్త గౌతమ్ కిచ్లు సహకారం ఎంతో ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఐతే భర్త సహకారం గురించి చెబుతూనే.. గౌతమ్ సినిమాలు వద్దని ఒక్క మాట అంటే చాలు, వెంటనే మానేస్తానని కాజల్ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగడం, భర్త సహకారం గురించి తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కాజల్ ఈ వ్యాఖ్యలు చేసింది.
“నేను ఎంత కాలం సినీ రంగంలో కొనసాగుతానో తెలియదు. నా భర్త సినీ రంగం నుంచి తప్పుకోవాలని కోరిన మరు క్షణమే నటనకు గుడ్ బై చెప్పేస్తాను. నా భర్త మాటకు విలువ ఇచ్చేలా నడుచుకుంటాను” అని ఒక సంప్రదాయ భారతీయ అమ్మాయిలా సమాధానం చెప్పింది కాజల్. పెళ్లి తర్వాత ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే వ్యక్తగత జీవితానికి కూడా మంచి ప్రాధాన్యమే ఇస్తోంది చందమామ. ఏమాత్రం ఖాళీ దొరికినా గౌతమ్తో విహారానికి వెళ్తూ ఆ ఫొటోలను అభిమానులకు పంచుకుంటూ తానెంత హ్యాపీగా ఉందో చెప్పకనే చెబుతోంది.
This post was last modified on August 12, 2021 5:54 pm
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…