Movie News

అడివి శేష్ సినిమాకు ఇది దెబ్బే


క్షణం, గూఢచారి, ఎవరు లాంటి సినిమాలతో అడివి శేష్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో పెరిగిందో తెలిసిందే. వేరే భాషల వాళ్లూ అతడి సినిమాలు చూసి బాగా ఇంప్రెస్ అయిపోయారు. ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ శేష్‌కు ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే అతను ‘మేజర్’తో పాన్ ఇండియా లెవెల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో వీర మరణం పొంది హీరోగా అవతరించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ముంబయి దాడుల హీరో మీద సినిమా అంటే మామూలుగానే దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. పైగా శేష్ ఈ సినిమా చేస్తుండటంతో అంచనాలు ఇంకా పెరిగాయి. ఆ మధ్య రిలీజైన టీజర్ కూడా ఆసక్తిని పెంచేలాగే సాగింది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ చిత్రానికి ఇప్పుడో గట్టి దెబ్బ తగిలింది. అదే.. షేర్షా.

సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా దక్షిణాది దర్శకుడు విష్ణువర్ధన్ రూపొందించిన ‘షేర్షా’ గురువారమే అమేజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కార్గిల్ వార్ హీరో మేజర్ విక్రమ్ బత్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

దీంతో ‘మేజర్’కు వచ్చిన సమస్య ఏంటి అంటే.. ఈ రెండు కథల్లో సారూప్యత కనిపిస్తుంది. ఇద్దరూ దేశం కోసం ప్రాణాలు విడిచిన సైనికులే. విక్రమ్ పాకిస్థాన్ సైన్యం, ఉగ్రవాదులతో పోరాడితే.. సందీప్ పాక్ ఉగ్రవాదులతో తలపడ్డాడు. దేశానికి ముప్పు వాటిల్లినపుడు ఇద్దరు సైనికులు ఏం చేశారన్నదే రెండు సినిమాల నేపథ్యం. వేర్వేరు ప్రాంతాల్లో నడిచిన కథలే అయినా.. దేశభక్తి ప్రధానంగా ఉండే ఎమోషన్ రెండింట్లోనూ ఒకటే. ఈ తరహా సినిమాల్లో ఒకటి మంచి అనుభూతిని ఇచ్చాక.. కొన్ని నెలల్లోనే ఇంకో సినిమా వస్తే కొంచెం ప్రేక్షకులకు మొనాటనస్‌గా అనిపిస్తుంది. ‘మేజర్’ కూడా ఇంతే బాగా ఉన్నప్పటికీ.. అప్పటికి ఇలాంటి ఓ సినిమా చూసిన ప్రేక్షకులు ఏమేర ఆసక్తిని ప్రదర్శిస్తారన్నది డౌట్. ముఖ్యంగా నార్త్ మార్కెట్లో ‘మేజర్’కు ఇది ఇబ్బంది కలిగించే విషయమే.

This post was last modified on August 12, 2021 5:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

21 minutes ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

45 minutes ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

2 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

4 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

5 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

6 hours ago