యువ కథానాయకుల్లో శ్రీ విష్ణు స్టైలే వేరు. అతడి సినిమా అంటే ఏదో ఒక కొత్తదనం ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగేలా విభిన్నమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నాడతను. అప్పట్లో ఒకడుండేవాడు, బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలతో ఎంతో ఆకట్టుకున్న విష్ణు నుంచి వస్తున్న మరో వైవిధ్యమైన సినిమా.. రాజ రాజ చోర. హాసిత్ గోలి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మేఘా ఆకాష్ కథానాయిక. దర్శకుడు రవిబాబు కీలక పాత్ర పోషించాడు. ఈ మధ్యే విడుదలైన దీని ప్రి టీజర్, టీజర్ ప్రేక్షకుల్లో కొత్తగా ఉండి ఆసక్తి రేకెత్తించాయి. సినిమా మీద అంచనాలను పెంచాయి. టీజర్ రిలీజ్ తర్వాత వార్తల్లో లేకుండా పోయిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘రాజ రాజ చోర’ను ఈ నెల 19న థియేటర్లలోకి దించబోతున్నట్లు ప్రకటించారు.
కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత రెండు వారాల కిందటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున:ప్రారంభం కాగా.. నెమ్మదిగా కాస్త క్రేజున్న సినిమాలు ఒక్కొక్కటి థియేటర్లలోకి దిగుతున్నాయి. ఈ వారం విశ్వక్సేన్ సినిమా ‘పాగల్’ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. దానికి యూత్లో క్రేజ్ బాగానే ఉంది. ఈ కోవలోనే యూత్ను ఆకర్షించిన విష్ణు సినిమా సైతం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
విష్ణు ఇందులో దొంగ పాత్రను పోషించడం విశేషం. ఎవరి కంటా పడకుండా వినూత్న పద్ధతుల్లో దొంగతనం చేసే అతడికి కళ్లెం వేయడానికి ఒక టఫ్ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వీళ్లిద్దరి మధ్య ఎత్తులు పై ఎత్తులతో సినిమా నడుస్తుంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తున్న ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు ఉంటే విష్ణు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవడానికి ఆస్కారముంది. థియేటర్ల పరిస్థితి ఏమంత బాగా లేకపోయినా.. కొంచెం పెద్ద సినిమాలు సైతం ఓటీటీ బాట పడుతున్నా.. ధైర్యం చేసి ఇలా థియేటర్లలోనే తమ చిత్రాలను రిలీజ్ చేస్తున్న యువ కథానాయకులను అభినందించాల్సిందే.
This post was last modified on August 11, 2021 5:58 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…