ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తన రెండో కుమారుడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. తన నిర్మాణంలో తేజ దర్శకుడిగా సినిమాను సెట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సురేష్ బాబు తన సినిమాల ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ తేజ మాత్రం కథకు అవసరమంటే కాంప్రమైజ్ అవ్వరు. దాంతో ఇద్దరి మధ్య అప్పుడే గ్యాప్ మొదలైందని సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా కృతిశెట్టిని తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో సురేష్ వెనుకంజ వేశారు. కృతి అయితే కోటి వరకు అడుగుతుందని.. వేరే హీరోయిన్ ను తీసుకోమని సురేష్ బాబు చెప్పడంతో తేజ రాజీ పడ్డారు. అయితే ఇప్పుడు మరో యాక్టర్ విషయంలో కూడా సురేష్ బాబు ఇలానే చేస్తున్నట్లు సమాచారం. కథలో కీలకపాత్ర కోసం సముద్రఖనితో సంప్రదింపులు జరిపారు తేజ. ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి రెడీగానే ఉన్నారు.
కానీ మళ్లీ రెమ్యునరేషన్ దగ్గర ఇష్యూ వచ్చినట్లు సమాచారం. సముద్రఖని అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి సురేష్ బాబు సిద్ధంగా లేరట. దీంతో ఆయనకు బదులుగా మరొకరిని తీసుకోమని తేజకి చెప్పారట. కానీ ఈసారి మాత్రం తేజ కాంప్రమైజ్ అవ్వకూడదని డిసైడ్ అయ్యారట. ఈ విషయంలో కాస్త పట్టుదలగా ఉండి సురేష్ బాబుని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పటివరకు ఆ పాత్రకు సంబంధించిన సీన్లను చిత్రీకరించకుండా పక్కన పెడుతున్నారు. మరి తేజ రిక్వెస్ట్ ను సురేష్ బాబు యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి!
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…