ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తన రెండో కుమారుడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. తన నిర్మాణంలో తేజ దర్శకుడిగా సినిమాను సెట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సురేష్ బాబు తన సినిమాల ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ తేజ మాత్రం కథకు అవసరమంటే కాంప్రమైజ్ అవ్వరు. దాంతో ఇద్దరి మధ్య అప్పుడే గ్యాప్ మొదలైందని సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా కృతిశెట్టిని తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో సురేష్ వెనుకంజ వేశారు. కృతి అయితే కోటి వరకు అడుగుతుందని.. వేరే హీరోయిన్ ను తీసుకోమని సురేష్ బాబు చెప్పడంతో తేజ రాజీ పడ్డారు. అయితే ఇప్పుడు మరో యాక్టర్ విషయంలో కూడా సురేష్ బాబు ఇలానే చేస్తున్నట్లు సమాచారం. కథలో కీలకపాత్ర కోసం సముద్రఖనితో సంప్రదింపులు జరిపారు తేజ. ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి రెడీగానే ఉన్నారు.
కానీ మళ్లీ రెమ్యునరేషన్ దగ్గర ఇష్యూ వచ్చినట్లు సమాచారం. సముద్రఖని అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి సురేష్ బాబు సిద్ధంగా లేరట. దీంతో ఆయనకు బదులుగా మరొకరిని తీసుకోమని తేజకి చెప్పారట. కానీ ఈసారి మాత్రం తేజ కాంప్రమైజ్ అవ్వకూడదని డిసైడ్ అయ్యారట. ఈ విషయంలో కాస్త పట్టుదలగా ఉండి సురేష్ బాబుని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పటివరకు ఆ పాత్రకు సంబంధించిన సీన్లను చిత్రీకరించకుండా పక్కన పెడుతున్నారు. మరి తేజ రిక్వెస్ట్ ను సురేష్ బాబు యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి!
This post was last modified on August 10, 2021 7:07 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…