ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తన రెండో కుమారుడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. తన నిర్మాణంలో తేజ దర్శకుడిగా సినిమాను సెట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సురేష్ బాబు తన సినిమాల ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ తేజ మాత్రం కథకు అవసరమంటే కాంప్రమైజ్ అవ్వరు. దాంతో ఇద్దరి మధ్య అప్పుడే గ్యాప్ మొదలైందని సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా కృతిశెట్టిని తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో సురేష్ వెనుకంజ వేశారు. కృతి అయితే కోటి వరకు అడుగుతుందని.. వేరే హీరోయిన్ ను తీసుకోమని సురేష్ బాబు చెప్పడంతో తేజ రాజీ పడ్డారు. అయితే ఇప్పుడు మరో యాక్టర్ విషయంలో కూడా సురేష్ బాబు ఇలానే చేస్తున్నట్లు సమాచారం. కథలో కీలకపాత్ర కోసం సముద్రఖనితో సంప్రదింపులు జరిపారు తేజ. ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి రెడీగానే ఉన్నారు.
కానీ మళ్లీ రెమ్యునరేషన్ దగ్గర ఇష్యూ వచ్చినట్లు సమాచారం. సముద్రఖని అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి సురేష్ బాబు సిద్ధంగా లేరట. దీంతో ఆయనకు బదులుగా మరొకరిని తీసుకోమని తేజకి చెప్పారట. కానీ ఈసారి మాత్రం తేజ కాంప్రమైజ్ అవ్వకూడదని డిసైడ్ అయ్యారట. ఈ విషయంలో కాస్త పట్టుదలగా ఉండి సురేష్ బాబుని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పటివరకు ఆ పాత్రకు సంబంధించిన సీన్లను చిత్రీకరించకుండా పక్కన పెడుతున్నారు. మరి తేజ రిక్వెస్ట్ ను సురేష్ బాబు యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి!
This post was last modified on August 10, 2021 7:07 am
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…