ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తన రెండో కుమారుడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. తన నిర్మాణంలో తేజ దర్శకుడిగా సినిమాను సెట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సురేష్ బాబు తన సినిమాల ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ తేజ మాత్రం కథకు అవసరమంటే కాంప్రమైజ్ అవ్వరు. దాంతో ఇద్దరి మధ్య అప్పుడే గ్యాప్ మొదలైందని సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా కృతిశెట్టిని తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో సురేష్ వెనుకంజ వేశారు. కృతి అయితే కోటి వరకు అడుగుతుందని.. వేరే హీరోయిన్ ను తీసుకోమని సురేష్ బాబు చెప్పడంతో తేజ రాజీ పడ్డారు. అయితే ఇప్పుడు మరో యాక్టర్ విషయంలో కూడా సురేష్ బాబు ఇలానే చేస్తున్నట్లు సమాచారం. కథలో కీలకపాత్ర కోసం సముద్రఖనితో సంప్రదింపులు జరిపారు తేజ. ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి రెడీగానే ఉన్నారు.
కానీ మళ్లీ రెమ్యునరేషన్ దగ్గర ఇష్యూ వచ్చినట్లు సమాచారం. సముద్రఖని అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి సురేష్ బాబు సిద్ధంగా లేరట. దీంతో ఆయనకు బదులుగా మరొకరిని తీసుకోమని తేజకి చెప్పారట. కానీ ఈసారి మాత్రం తేజ కాంప్రమైజ్ అవ్వకూడదని డిసైడ్ అయ్యారట. ఈ విషయంలో కాస్త పట్టుదలగా ఉండి సురేష్ బాబుని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పటివరకు ఆ పాత్రకు సంబంధించిన సీన్లను చిత్రీకరించకుండా పక్కన పెడుతున్నారు. మరి తేజ రిక్వెస్ట్ ను సురేష్ బాబు యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి!
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…