Movie News

‘సలార్’లో సీనియర్ నటుడు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. మరోపక్క ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ శృతిహాసన్ కూడా జాయిన్ అయింది. సెట్ లో ప్రభాస్ ఇంటి భోజనంతో ట్రీట్ ఇచ్చినట్లు శృతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్ట్ పెట్టింది.

ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల నుండి పేరున్న నటీనటులను తీసుకుంటున్నారు. తాజాగా సీనియర్ నటుడు జగపతిబాబుని తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన్ను ఇదివరకే సంప్రదించారట. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. తాజా షెడ్యూల్ లో జగపతిబాబు కూడా పాల్గొనడంతో విషయం బయటకొచ్చింది. సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందట.

ఇక విలన్ రోల్ కోసం మరో పాపులర్ నటుడిని ఆన్ బోర్డ్ చేయబోతున్నారు. అలానే సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ను సంప్రదిస్తున్నారట. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘కేజీఎఫ్’ సినిమాకి పని చేసిన టెక్నికల్ టీమ్ మొత్తం ‘సలార్’ సినిమాకి కూడా పని చేస్తుంది. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.

This post was last modified on August 9, 2021 9:41 am

Share
Show comments

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago