యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. మరోపక్క ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ శృతిహాసన్ కూడా జాయిన్ అయింది. సెట్ లో ప్రభాస్ ఇంటి భోజనంతో ట్రీట్ ఇచ్చినట్లు శృతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్ట్ పెట్టింది.
ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల నుండి పేరున్న నటీనటులను తీసుకుంటున్నారు. తాజాగా సీనియర్ నటుడు జగపతిబాబుని తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన్ను ఇదివరకే సంప్రదించారట. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. తాజా షెడ్యూల్ లో జగపతిబాబు కూడా పాల్గొనడంతో విషయం బయటకొచ్చింది. సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందట.
ఇక విలన్ రోల్ కోసం మరో పాపులర్ నటుడిని ఆన్ బోర్డ్ చేయబోతున్నారు. అలానే సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ను సంప్రదిస్తున్నారట. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘కేజీఎఫ్’ సినిమాకి పని చేసిన టెక్నికల్ టీమ్ మొత్తం ‘సలార్’ సినిమాకి కూడా పని చేస్తుంది. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.
This post was last modified on August 9, 2021 9:41 am
ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజయం సాధించినప్పటికీ.. ఆ చిత్రంలో రామ్ చరణ్తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో అంత బలం…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక సమరం.. ఓ రేంజ్లో హీటు పుట్టిస్తోంది. ప్రధాన పక్షాలైన.. టీడీపీ, వైసీపీ, జనసేనలు దూకుడుగా ముందుకు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబు నాకు గురువని ఎవడన్నాడు. బుద్ధి…
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ…
మలయాళంలో గత దశాబ్ద కాలంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన నటుడు ఫాహద్ ఫాజిల్. లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్…
సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ పెరిగిపోయాక అనుకరణలు, ట్రోలింగ్ లు విపరీతంగా పెరిగిపోయాయి. త్వరగా వచ్చే పాపులారిటీ కావడంతో ఎలాంటి…