యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. మరోపక్క ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ శృతిహాసన్ కూడా జాయిన్ అయింది. సెట్ లో ప్రభాస్ ఇంటి భోజనంతో ట్రీట్ ఇచ్చినట్లు శృతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్ట్ పెట్టింది.
ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల నుండి పేరున్న నటీనటులను తీసుకుంటున్నారు. తాజాగా సీనియర్ నటుడు జగపతిబాబుని తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన్ను ఇదివరకే సంప్రదించారట. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. తాజా షెడ్యూల్ లో జగపతిబాబు కూడా పాల్గొనడంతో విషయం బయటకొచ్చింది. సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందట.
ఇక విలన్ రోల్ కోసం మరో పాపులర్ నటుడిని ఆన్ బోర్డ్ చేయబోతున్నారు. అలానే సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ను సంప్రదిస్తున్నారట. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘కేజీఎఫ్’ సినిమాకి పని చేసిన టెక్నికల్ టీమ్ మొత్తం ‘సలార్’ సినిమాకి కూడా పని చేస్తుంది. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.
This post was last modified on August 9, 2021 9:41 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…