తమిళనాడుకి చెందిన మోడల్, నటి మీరా మిథున్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. గతంలో ఆమె కొన్ని వివాదాలతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె దళితులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. దళితుల కారణంగానే తమిళంలో మంచి సినిమాలు రావడం లేదని ఆమె చెప్పడం కొందరిని ఆగ్రహానికి గురి చేస్తుంది. తాజాగా ఈమె ఒక వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అందులో ఒక డైరెక్టర్ ని ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
సదరు డైరెక్టర్ అనుమతి లేకుండా తన ఫోటోను తీసుకొని పబ్లిసిటీ కోసం వాడుకున్నాడని ఆరోపణలు చేసింది. ఇక్కడితో ఆగకుండా దళితులందరినీ కించపరుస్తూ ఆమె మాట్లాడడం దుమారం రేపుతోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేది దళితులే అని.. వారి కారణంగానే అనవసరమైన గొడవలు, వివాదాలు వస్తుంటాయని ఘాటు కామెంట్స్ చేసింది.
తమిళ ఇండస్ట్రీలో ఎవరైనా దళితులు ఉంటే వాళ్లు వెంటనే బయటకు వెళ్లిపోవాలని.. వారి కారణంగానే క్వాలిటీ సినిమాలు రావడం లేదని చెప్పుకొచ్చింది. దళితులను కించపరిచే విధంగా ఈమె చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని దళిత పక్షపాత పార్టీ విఎస్ కె.. మీరా మిథున్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారాలు కూడా ఉండడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మరి ఈ కేసు నుండి మీరా మిథున్ ఎలా బయటపడుతుందో చూడాలి!
This post was last modified on August 9, 2021 9:46 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…