తమిళనాడుకి చెందిన మోడల్, నటి మీరా మిథున్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. గతంలో ఆమె కొన్ని వివాదాలతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె దళితులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. దళితుల కారణంగానే తమిళంలో మంచి సినిమాలు రావడం లేదని ఆమె చెప్పడం కొందరిని ఆగ్రహానికి గురి చేస్తుంది. తాజాగా ఈమె ఒక వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అందులో ఒక డైరెక్టర్ ని ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
సదరు డైరెక్టర్ అనుమతి లేకుండా తన ఫోటోను తీసుకొని పబ్లిసిటీ కోసం వాడుకున్నాడని ఆరోపణలు చేసింది. ఇక్కడితో ఆగకుండా దళితులందరినీ కించపరుస్తూ ఆమె మాట్లాడడం దుమారం రేపుతోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేది దళితులే అని.. వారి కారణంగానే అనవసరమైన గొడవలు, వివాదాలు వస్తుంటాయని ఘాటు కామెంట్స్ చేసింది.
తమిళ ఇండస్ట్రీలో ఎవరైనా దళితులు ఉంటే వాళ్లు వెంటనే బయటకు వెళ్లిపోవాలని.. వారి కారణంగానే క్వాలిటీ సినిమాలు రావడం లేదని చెప్పుకొచ్చింది. దళితులను కించపరిచే విధంగా ఈమె చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని దళిత పక్షపాత పార్టీ విఎస్ కె.. మీరా మిథున్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారాలు కూడా ఉండడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మరి ఈ కేసు నుండి మీరా మిథున్ ఎలా బయటపడుతుందో చూడాలి!
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…