తమిళనాడుకి చెందిన మోడల్, నటి మీరా మిథున్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. గతంలో ఆమె కొన్ని వివాదాలతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె దళితులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. దళితుల కారణంగానే తమిళంలో మంచి సినిమాలు రావడం లేదని ఆమె చెప్పడం కొందరిని ఆగ్రహానికి గురి చేస్తుంది. తాజాగా ఈమె ఒక వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అందులో ఒక డైరెక్టర్ ని ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
సదరు డైరెక్టర్ అనుమతి లేకుండా తన ఫోటోను తీసుకొని పబ్లిసిటీ కోసం వాడుకున్నాడని ఆరోపణలు చేసింది. ఇక్కడితో ఆగకుండా దళితులందరినీ కించపరుస్తూ ఆమె మాట్లాడడం దుమారం రేపుతోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేది దళితులే అని.. వారి కారణంగానే అనవసరమైన గొడవలు, వివాదాలు వస్తుంటాయని ఘాటు కామెంట్స్ చేసింది.
తమిళ ఇండస్ట్రీలో ఎవరైనా దళితులు ఉంటే వాళ్లు వెంటనే బయటకు వెళ్లిపోవాలని.. వారి కారణంగానే క్వాలిటీ సినిమాలు రావడం లేదని చెప్పుకొచ్చింది. దళితులను కించపరిచే విధంగా ఈమె చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని దళిత పక్షపాత పార్టీ విఎస్ కె.. మీరా మిథున్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారాలు కూడా ఉండడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మరి ఈ కేసు నుండి మీరా మిథున్ ఎలా బయటపడుతుందో చూడాలి!
This post was last modified on August 9, 2021 9:46 am
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు.…
కొవిడ్ వల్ల సినీ పరిశ్రమలు ఎలా కుదేలయ్యాయో తెలిసిందే. కానీ ఆ టైంలో మలయాళ ఇండస్ట్రీ సైతం ఇబ్బంది పడింది…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్..టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుల మద్య స్నేహబంధం ఇప్పటిది కాదు. ఎప్పుడో చంద్రబాబు…