సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్లో ఒక రకమైన నిస్తేజం నెలకొంది. థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు లభించినా వెంటనే వెండితెరలు వెలుగులు సంతరించుకోలేదు. కొత్త సినిమాల విడుదలకు నిర్మాతలు కూడా అంత ఉత్సాహం చూపించలేదు. కరోనా మూడో వేవ్ భయాలు జనాల్లో కొనసాగుతుండటం, ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్ల గొడవ ఎంతకీ తేలకపోవడం ఇందుకు కారణం కావచ్చు. థియేటర్లు తెరుచుకున్నాక గత పది రోజుల్లో చిన్న సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తొలి వారం సినిమాలకు ఆశించినంత స్పందన కనిపించకపోవడంతో రెండో వారం ఊపు తగ్గింది. ఈ వారం చిత్రాల్లో ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’కి ఓపెనింగ్స్ పర్వాలేదు. మిగతా సినిమాలను ప్రేక్షకులు అస్సలు పట్టించుకోవడం లేదు.
ఈ టైంలో మంచి క్రేజున్న సినిమాలను తెస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ విడుదలకు సిద్ధంగా ఉన్న ‘లవ్ స్టోరి’ సినిమాను మేకర్స్ అట్టిపెట్టుకుని ఉన్నారు. ‘విరాటపర్వం’ సంగతి ఎటూ తేలట్లేదు. మ్యాస్ట్రో, టక్ జగదీష్ సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఇలాంటి టైంలో యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో విశ్వక్సేన్ తన కొత్త చిత్రం ‘పాగల్’ను వచ్చే శనివారం విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. దిల్ రాజు, బెక్కెం వేణుగోపాల్ కలిసి నిర్మించిన చిత్రమిది. నరేష్ కుప్పిలి అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. ఈ సినిమా టీజర్ వచ్చి చాలా రోజులైంది. ఏప్రిల్ నెలాఖర్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వల్ల వాయిదా వేశారు. ఐతే థియేటర్ల పున:ప్రారంభం తర్వాత ‘పాగల్’ రిలీజ్ గురించి ఏ డిస్కషన్ లేదు. ప్రమోషన్లు కూడా ఏమీ లేవు.
ఉన్నట్లుండి ఆగస్టు 14 అంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. గత రెండు వారాల్లో వచ్చిన తిమ్మరసు, ఇష్క్, ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రాల రిలీజ్ గురించి కొన్ని వారాల ముందే ప్రకటనలు వచ్చాయి. ముందు నుంచి ప్రమోట్ చేస్తూ వచ్చారు. కానీ ‘పాగల్’ రిలీజ్ గురించి మాత్రం ఇప్పుడే చెబుతున్నారు. ఈ వారం రోజులు గట్టిగా ప్రమోట్ చేసి గ్రాండ్గా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లున్నారు. ఈ టైంలో రావడం రిస్కే అయినప్పటికి చిత్ర బృందం ధైర్యం చేస్తోంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. దీని రిజల్ట్ను బట్టి మీడియం రేంజ్ సినిమాల రిలీజ్ ప్లానింగ్ ఉండొచ్చు.
This post was last modified on August 8, 2021 1:24 pm
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…