Movie News

మణిరత్నం సార్.. ఏదో అనుకుంటే

మణిరత్నం లాంటి లెజెండర్ ఫిలి మేకర్ నిర్మాణంలో.. ప్రియదర్శన్, గౌతమ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, కార్తీక్ నరేన్ లాంటి మేటి దర్శకులు.. సూర్య, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, సిద్దార్థ్, రేవతి, పార్వతి లాంటి ప్రముఖ ఆర్టిస్టులు.. ఏఆర్ రెహమాన్, సంతోష్ శివన్ లాంటి గ్రేట్ టెక్నీషియన్స్ కలిసి ఓ ఆంథాలజీ ఫిలిం తీశారంటే దాని మీద అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేదేముంది?

కరోనా కష్ట కాలంలో తమిళ ఇండస్ట్రీలో పని లేక కష్టపడుతున్న వారిని ఆదుకునే ఉద్దేశంతో ఇంతమంది ప్రముఖులు కలిసి నెట్ ఫ్లిక్స్ భాగస్వామ్యంతో చేసిన ఆంథాలజీ ఫిలిం ‘నవరస’ టీజర్.. ట్రైలర్లతో ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారమే ఈ ఫిలిం రిలీజైంది. ఐతే ఎంతో ఎగ్జైట్మెంట్‌తో ఈ సిరీస్ చూసిన వాళ్లు చాలా వరకు నిరుత్సాహానికే గురవుతున్నారు. నవరసాల్లో ఒక్కో రసాన్ని ప్రతిబింబించేలా తొమ్మిది ఎపిసోడ్లు రూపొందగా ఇందులో రెండు మూడు మినహా అంత ఎఫెక్టివ్‌గా లేవు అనే అభిప్రాయం వినిపిస్తోంది.

అన్నింట్లోకి అరవింద్ స్వామి తొలిసారి దర్శకుడిగా మారి రూపొందించిన ‘రౌద్రం’ సెగ్మెంట్‌కు ఎక్కువగా ప్రశంసలు దక్కుతున్నాయి. అరవింద్ స్వామిలో మంచి దర్శకుడున్నాడనే అభిప్రాయాన్ని ఈ ఎపిసోడ్ కలిగించింది. అలాగే కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిసోడ్ ‘ప్రాజెక్ట్ అగ్ని’ కూడా బాగుందనే అంటున్నారు. యోగిబాబు ప్రధాన పాత్రలో హాస్య ప్రధానంగా సాగే ‘సమ్మర్ ఆఫ్ 1992’ కూడా ఓకే అంటున్నారు. మిగతా ఎపిసోడ్లన్నింటికీ థంప్స్ డౌన్ అంటున్నారు ప్రేక్షకులు.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్య చేసిన ఎపిసోడ్.. విజయ్ సేతుపతి-ప్రకాష్ రాజ్-రేవతి నటించిన సెగ్మెంట్ నిరాశకే గురి చేశాయి. మిగతా ఎపిసోడ్లకు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఇంత గొప్ప టీం చేసిన ఆంథాలజీ ఫిలిం వారి స్థాయికి తగ్గట్లు లేదని.. ఎంతో ఆశిస్తే చాలా వరకు ఎపిసోడ్లను మామూలుగా లాగించేశారనే కామెంట్లు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.

This post was last modified on August 7, 2021 8:15 pm

Share
Show comments
Published by
suman
Tags: Navarasa

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

38 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago