రితీశ్ దేశ్ముఖ్.. పెద్ద స్టార్ ఏమీ కాదు కానీ, బాలీవుడ్లో బాగానే పాపులర్. ముఖ్యమంత్రి కొడుకు హీరో అయితే పాపులర్ కాకుండా ఎలా ఉంటాడు? మహరాష్ట్రకు రెండు పర్యాయాలు సీఎంగా పని చేసిన విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు అతను. ఆయన కేంద్ర కేబినెట్లోనూ పని చేశారు.
ముందు తండ్రి బ్యాకప్తోనే హీరోగా అవకాశాలు తెచ్చుకున్నప్పటికీ.. ఆ తర్వాత సొంత గుర్తింపు తెచ్చుకుని నటుడిగా కొనసాగుతున్నాడు రితీశ్. తండ్రి మీద అమితమైన ప్రేమాభిమానాలు ఉన్న రితీశ్.. మంగళవారం తండ్రి జయంతిని పురస్కరించుకుని ఒక ఎమోషనల్ వీడియోతో కన్నీళ్లు పెట్టించేశాడు. తన ఇంట్లో హ్యాగర్కు తగిలించిన ఉన్న తండ్రి ట్రేడ్ మార్క్ పొలిటికల్ సూట్ దగ్గరికెళ్లిన రితీశ్.. చొక్కాలోపలికి ఒక చేతిని పోనిచ్చాడు.
తండ్రి తనను హత్తుకుని భుజం మీద చెయ్యి వేసి నిమురుతున్న ఫీలింగ్ తీసుకొచ్చాడతను. బ్యాగ్రౌండ్లో ఒక హృద్యమైన పాట కూడా పెట్టించాడు. పక్కనే తండ్రి ఫొటోను చూపించి హ్యాపీ బర్త్ డే అంటూ విష్ చేశాడు. ఎంతో హృద్యంగా అనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విలాస్ అభిమానులందరికీ ఇది కన్నీళ్లు పెట్టిస్తోంది. తండ్రీ కొడుకుల అనుబంధానికి అద్దం పట్టేలా ఉందీ వీడియో. 1999-2003, 2004-2008 మధ్య రెండు పర్యాయాలు విలాస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశాడు.
ఆ తర్వాత కొంత కాలానికి అనారోగ్యం బారిన పడ్డ ఆయన.. అవయవాలు దెబ్బతినడంతో 2012లో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రితీశ్ దేశ్ ముఖ్ భార్య జెనీలియా తెలుగు సినిమాల్లో పాపులర్ హీరోయిన్గా కొనసాగిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి చేసిన తొలి సినిమా ‘తుజే మేరీ కసమ్’ (నువ్వే కావాలి రీమేక్) సందర్భంగా ప్రేమలో పడ్డారు. పదేళ్ల పాటు ప్రేమికులుగా కొనసాగి.. తర్వాత పెళ్లి చేసుకున్నారు.
This post was last modified on May 27, 2020 9:22 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…