రితీశ్ దేశ్ముఖ్.. పెద్ద స్టార్ ఏమీ కాదు కానీ, బాలీవుడ్లో బాగానే పాపులర్. ముఖ్యమంత్రి కొడుకు హీరో అయితే పాపులర్ కాకుండా ఎలా ఉంటాడు? మహరాష్ట్రకు రెండు పర్యాయాలు సీఎంగా పని చేసిన విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు అతను. ఆయన కేంద్ర కేబినెట్లోనూ పని చేశారు.
ముందు తండ్రి బ్యాకప్తోనే హీరోగా అవకాశాలు తెచ్చుకున్నప్పటికీ.. ఆ తర్వాత సొంత గుర్తింపు తెచ్చుకుని నటుడిగా కొనసాగుతున్నాడు రితీశ్. తండ్రి మీద అమితమైన ప్రేమాభిమానాలు ఉన్న రితీశ్.. మంగళవారం తండ్రి జయంతిని పురస్కరించుకుని ఒక ఎమోషనల్ వీడియోతో కన్నీళ్లు పెట్టించేశాడు. తన ఇంట్లో హ్యాగర్కు తగిలించిన ఉన్న తండ్రి ట్రేడ్ మార్క్ పొలిటికల్ సూట్ దగ్గరికెళ్లిన రితీశ్.. చొక్కాలోపలికి ఒక చేతిని పోనిచ్చాడు.
తండ్రి తనను హత్తుకుని భుజం మీద చెయ్యి వేసి నిమురుతున్న ఫీలింగ్ తీసుకొచ్చాడతను. బ్యాగ్రౌండ్లో ఒక హృద్యమైన పాట కూడా పెట్టించాడు. పక్కనే తండ్రి ఫొటోను చూపించి హ్యాపీ బర్త్ డే అంటూ విష్ చేశాడు. ఎంతో హృద్యంగా అనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విలాస్ అభిమానులందరికీ ఇది కన్నీళ్లు పెట్టిస్తోంది. తండ్రీ కొడుకుల అనుబంధానికి అద్దం పట్టేలా ఉందీ వీడియో. 1999-2003, 2004-2008 మధ్య రెండు పర్యాయాలు విలాస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశాడు.
ఆ తర్వాత కొంత కాలానికి అనారోగ్యం బారిన పడ్డ ఆయన.. అవయవాలు దెబ్బతినడంతో 2012లో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రితీశ్ దేశ్ ముఖ్ భార్య జెనీలియా తెలుగు సినిమాల్లో పాపులర్ హీరోయిన్గా కొనసాగిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి చేసిన తొలి సినిమా ‘తుజే మేరీ కసమ్’ (నువ్వే కావాలి రీమేక్) సందర్భంగా ప్రేమలో పడ్డారు. పదేళ్ల పాటు ప్రేమికులుగా కొనసాగి.. తర్వాత పెళ్లి చేసుకున్నారు.
This post was last modified on May 27, 2020 9:22 am
రామాయణ టీజర్ మీద సోషల్ మీడియాలో ఎంత నెగటివిటీ నడుస్తుందో తెలిసిందే. విజువల్స్ బాగానే ఉన్నప్పటికీ వాటి ప్రెజెంటేషన్, క్వాలిటీ…
మొన్న విడుదలైన రాకాస, బైకర్ రెండూ స్టడీగా ఉన్నాయి. అయితే వాటికొచ్చిన టాక్స్ తో పోల్చుకుంటే వసూళ్లు అంత వేగంగా…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ హాట్ హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. చాలా వరకు సినిమా ప్రమోషన్లకు, ఈవెంట్లకు గ్లామర్…
టాలీవుడ్లో అడివి శేష్ది విచిత్రమైన ప్రయాణం. హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో కర్మ, కిస్ సినిమాలు తీసి బొక్క బోర్లా పడ్డ అతను..…
ఏపీలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల సంఖ్య దాదాపు 88 వరకు ఉంటుందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రాల వారిగా ఇటీవల కేంద్ర…
విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లో పూజలు నిర్వహించటానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్).. శృంగేరి…