ప్రముఖ బాలీవుడ్ సింగర్, నటుడు యోయో హనీ సింగ్ పై ఆయన భార్య షాలిని గృహహింస, లైంగిక వేధింపులు, ఆర్థిక మోసం, మానసిక హింస వంటి కేసులు నమోదు చేసింది. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది షాలిని.
తిస్ హజారీ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శ్రీమతి తానియా సింగ్ ముందు కేసు నమోదు చేయబడింది. కోర్టు హానీ సింగ్ కు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 28లోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది.
పెళ్లి అయిన దగ్గర నుండి హనీ సింగ్ తనను మానసికంగా హింసించడం మొదలుపెట్టాడని.. తాగేసి ఇంటికి వచ్చేవాడని.. చాలా సార్లు తనను కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది. హనీ సింగ్ తల్లితండ్రులు, సోదరు కూడా తనను ఇబ్బందులకు గురి చేశారని షాలిని ఆరోపణలు చేసింది. హనీ సింగ్ కు ఇతర మహిళలతో కూడా అక్రమ సంబంధాలు ఉన్నట్లు షాలిని చెప్పుకొచ్చింది. నిజానికి హనీ సింగ్ కు షాలినితో 2011లోనే వివాహం జరిగింది.
కానీ అతడు మూడేళ్ల వరకు తనకు పెళ్లైన విషయాన్ని బయటపెట్టలేదు. 2014లో ‘రాస్టార్’ అనే రియాలిటీ షోలో తన భార్యను జనాలకు పరిచయం చేశాడు హనీ సింగ్. ఆ సమయంలో అందరూ షాకయ్యారు. ఇక బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లతో హనీ సింగ్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
‘కాక్టెయిల్’ సినిమాలో ఆంగ్రేజీ బీట్ సాంగ్ తో హనీ సింగ్ బాగా పాపులర్ అయ్యాడు. ఆ తరువాత నుండి అతడికి బాలీవుడ్ లో తిరుగులేకుండా పోయింది. మరి ఇప్పుడు షాలిని ఇచ్చిన ఫిర్యాదులు అతడి కెరీర్ పై ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయేమో చూడాలి!
This post was last modified on August 4, 2021 7:54 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…