దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ నుంచి దోస్తీ పేరుతో తొలి పాటను ఆదివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ భాషలకు చెందిన అయిదుగురు మ్యుజీషియన్స్ ఈ పాటను వేర్వేరు భాషల్లో ఆలపించారు. ఈ పాటకు మిశ్రమ స్పందన వస్తోంది ప్రేక్షకుల నుంచి.
కీరవాణి.. అయిదుగురు మ్యుజీషియన్స్.. అలాగే హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లతో ఈ పాటను చాలా గ్రాండ్గా చిత్రీకరించిన విధానం మాత్రం అభిమానులను ఆకట్టుకుంది. ఐతే ఈ పాటను చిత్రీకరించడంలో దర్శకుడు రాజమౌళి పాత్ర ఏమీ లేదట.
అసలీ మ్యూజిక్ వీడియో ఐడియానే ఆయనది కాదట. రాజమౌళి తనయుడు కార్తికేయనే దీనికి కర్త కర్మ క్రియ అట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళే వెల్లడించడం విశేషం. ట్విట్టర్ ద్వారా ఆయనీ విషయాన్ని బయటపెట్టాడు.
తాను ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ చిత్రీకరణలో బిజీగా ఉండగా.. దోస్తీ పాటకు సంబంధించి మ్యూజిక్ వీడియో చేద్దామన్న ఆలోచన చేసింది.. ఈ పాటను గ్రాండ్గా చిత్రీకరించింది కార్తికేయ అని రాజమౌళి తెలిపాడు. సతీష్ కృష్ణన్ అనే డ్యాన్స్ కొరియోగ్రాఫర్తో కలిసి కార్తికేయ ఈ పాటను ప్లాన్ చేసి షూట్ చేశాడని జక్కన్న వెల్లడించాడు.
ఈ పాటలో భాగమైన మ్యుజీషియన్లకు, లిరిసిస్టులకు రాజమౌళి కృతజ్ఞతలు చెప్పాడు. బేసిగ్గా దోస్తీ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారని.. దాన్ని వివిధ భాషలకు చెందిన లిరిసిస్టులు అడాప్ట్ చేసుకుని వారి వారి భాషల్లో అద్భుతమైన సాహిత్యం సమకూర్చారని రాజమౌళి కొనియాడాడు.
ఇంతకుముందు రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో విషయంలోనూ తన క్రెడిట్ ఏమీ లేదని.. రెండు నెలల పాటు కష్టపడి దాన్ని కార్తికేయనే తీర్చిదిద్దాడని తన కొడుక్కి అప్పుడు కూడా రాజమౌళి ఘనత కట్టబెట్టడం తెలిసిందే.
This post was last modified on August 2, 2021 10:48 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…