దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ నుంచి దోస్తీ పేరుతో తొలి పాటను ఆదివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ భాషలకు చెందిన అయిదుగురు మ్యుజీషియన్స్ ఈ పాటను వేర్వేరు భాషల్లో ఆలపించారు. ఈ పాటకు మిశ్రమ స్పందన వస్తోంది ప్రేక్షకుల నుంచి.
కీరవాణి.. అయిదుగురు మ్యుజీషియన్స్.. అలాగే హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లతో ఈ పాటను చాలా గ్రాండ్గా చిత్రీకరించిన విధానం మాత్రం అభిమానులను ఆకట్టుకుంది. ఐతే ఈ పాటను చిత్రీకరించడంలో దర్శకుడు రాజమౌళి పాత్ర ఏమీ లేదట.
అసలీ మ్యూజిక్ వీడియో ఐడియానే ఆయనది కాదట. రాజమౌళి తనయుడు కార్తికేయనే దీనికి కర్త కర్మ క్రియ అట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళే వెల్లడించడం విశేషం. ట్విట్టర్ ద్వారా ఆయనీ విషయాన్ని బయటపెట్టాడు.
తాను ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ చిత్రీకరణలో బిజీగా ఉండగా.. దోస్తీ పాటకు సంబంధించి మ్యూజిక్ వీడియో చేద్దామన్న ఆలోచన చేసింది.. ఈ పాటను గ్రాండ్గా చిత్రీకరించింది కార్తికేయ అని రాజమౌళి తెలిపాడు. సతీష్ కృష్ణన్ అనే డ్యాన్స్ కొరియోగ్రాఫర్తో కలిసి కార్తికేయ ఈ పాటను ప్లాన్ చేసి షూట్ చేశాడని జక్కన్న వెల్లడించాడు.
ఈ పాటలో భాగమైన మ్యుజీషియన్లకు, లిరిసిస్టులకు రాజమౌళి కృతజ్ఞతలు చెప్పాడు. బేసిగ్గా దోస్తీ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారని.. దాన్ని వివిధ భాషలకు చెందిన లిరిసిస్టులు అడాప్ట్ చేసుకుని వారి వారి భాషల్లో అద్భుతమైన సాహిత్యం సమకూర్చారని రాజమౌళి కొనియాడాడు.
ఇంతకుముందు రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో విషయంలోనూ తన క్రెడిట్ ఏమీ లేదని.. రెండు నెలల పాటు కష్టపడి దాన్ని కార్తికేయనే తీర్చిదిద్దాడని తన కొడుక్కి అప్పుడు కూడా రాజమౌళి ఘనత కట్టబెట్టడం తెలిసిందే.
This post was last modified on August 2, 2021 10:48 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…