మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేస్తున్న ఆయన ఆ తరువాత ‘లూసిఫర్’ రీమేక్ ను పట్టాలెక్కించబోతున్నారు. ఈ సినిమా తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో దర్శకుడు బాబీతో సినిమా చేయాల్సివుంది. ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్ పైకి వెళ్తుందని దర్శకుడు బాబీ అంటున్నారు. ఈ సినిమా మల్టీస్టారర్ అనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ కన్ఫర్మ్ చేశారు.
ఈ సినిమా ఎలా ఉండబోతోందనే దానిపై బాబీ ఓ క్లూ ఇచ్చారు. ‘ఇది స్టార్ కి అభిమానికి మధ్య జరిగే కథ’ అని అన్నారు బాబీ. అంటే ఇప్పుడు చిరుకి తగిన ఫ్యాన్ ను వెతకాలన్నమాట. ఆ రోల్ లో మరో హీరో కనిపించే ఛాన్స్ ఉంది. బాబీ చెప్పిన ఈ స్టోరీ లైన్ వింటే మనకి ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా గుర్తురాక మానదు. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే. స్టార్ హీరోని అభిమానించే ఆర్టీవో ఆఫీసర్ కథే ఈ సినిమా.
నిజానికి ఈ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ సినిమా హక్కులు కొన్నట్లు ఎవరూ అఫీషియల్ గా ప్రకటించలేదు. ఇప్పుడు బాబీ సినిమా స్టోరీ లైన్ వింటుంటే కచ్చితంగా ‘డ్రైవింగ్ లైసెన్స్’ నుండి స్ఫూర్తి పొందారనిపిస్తుంది. నిజంగానే హక్కులు తీసుకొని తెలుగులో రీమేక్ చేస్తున్నారా..? లేక సోల్ పాయింట్ తీసుకొని తన స్టైల్ లో సినిమాను తెరకెక్కిస్తారా అనేది చూడాలి!
This post was last modified on August 2, 2021 10:29 am
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…
ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…