మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేస్తున్న ఆయన ఆ తరువాత ‘లూసిఫర్’ రీమేక్ ను పట్టాలెక్కించబోతున్నారు. ఈ సినిమా తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో దర్శకుడు బాబీతో సినిమా చేయాల్సివుంది. ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్ పైకి వెళ్తుందని దర్శకుడు బాబీ అంటున్నారు. ఈ సినిమా మల్టీస్టారర్ అనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ కన్ఫర్మ్ చేశారు.
ఈ సినిమా ఎలా ఉండబోతోందనే దానిపై బాబీ ఓ క్లూ ఇచ్చారు. ‘ఇది స్టార్ కి అభిమానికి మధ్య జరిగే కథ’ అని అన్నారు బాబీ. అంటే ఇప్పుడు చిరుకి తగిన ఫ్యాన్ ను వెతకాలన్నమాట. ఆ రోల్ లో మరో హీరో కనిపించే ఛాన్స్ ఉంది. బాబీ చెప్పిన ఈ స్టోరీ లైన్ వింటే మనకి ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా గుర్తురాక మానదు. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే. స్టార్ హీరోని అభిమానించే ఆర్టీవో ఆఫీసర్ కథే ఈ సినిమా.
నిజానికి ఈ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ సినిమా హక్కులు కొన్నట్లు ఎవరూ అఫీషియల్ గా ప్రకటించలేదు. ఇప్పుడు బాబీ సినిమా స్టోరీ లైన్ వింటుంటే కచ్చితంగా ‘డ్రైవింగ్ లైసెన్స్’ నుండి స్ఫూర్తి పొందారనిపిస్తుంది. నిజంగానే హక్కులు తీసుకొని తెలుగులో రీమేక్ చేస్తున్నారా..? లేక సోల్ పాయింట్ తీసుకొని తన స్టైల్ లో సినిమాను తెరకెక్కిస్తారా అనేది చూడాలి!
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…
రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…