మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేస్తున్న ఆయన ఆ తరువాత ‘లూసిఫర్’ రీమేక్ ను పట్టాలెక్కించబోతున్నారు. ఈ సినిమా తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో దర్శకుడు బాబీతో సినిమా చేయాల్సివుంది. ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్ పైకి వెళ్తుందని దర్శకుడు బాబీ అంటున్నారు. ఈ సినిమా మల్టీస్టారర్ అనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ కన్ఫర్మ్ చేశారు.
ఈ సినిమా ఎలా ఉండబోతోందనే దానిపై బాబీ ఓ క్లూ ఇచ్చారు. ‘ఇది స్టార్ కి అభిమానికి మధ్య జరిగే కథ’ అని అన్నారు బాబీ. అంటే ఇప్పుడు చిరుకి తగిన ఫ్యాన్ ను వెతకాలన్నమాట. ఆ రోల్ లో మరో హీరో కనిపించే ఛాన్స్ ఉంది. బాబీ చెప్పిన ఈ స్టోరీ లైన్ వింటే మనకి ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా గుర్తురాక మానదు. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే. స్టార్ హీరోని అభిమానించే ఆర్టీవో ఆఫీసర్ కథే ఈ సినిమా.
నిజానికి ఈ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ సినిమా హక్కులు కొన్నట్లు ఎవరూ అఫీషియల్ గా ప్రకటించలేదు. ఇప్పుడు బాబీ సినిమా స్టోరీ లైన్ వింటుంటే కచ్చితంగా ‘డ్రైవింగ్ లైసెన్స్’ నుండి స్ఫూర్తి పొందారనిపిస్తుంది. నిజంగానే హక్కులు తీసుకొని తెలుగులో రీమేక్ చేస్తున్నారా..? లేక సోల్ పాయింట్ తీసుకొని తన స్టైల్ లో సినిమాను తెరకెక్కిస్తారా అనేది చూడాలి!
This post was last modified on August 2, 2021 10:29 am
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అభ్యర్థులు…
హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన…
మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు…
తీన్మార్ మల్లన్న. నిత్యం మీడియాలో ఉంటూ..తనదైన శైలిలో గత కేసీఆర్ సర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింతపండు నవీన్ గురించి…
ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…
తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…