దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ తొలి పాట వచ్చేసింది. దోస్తీ పేరుతో ఆదివారం ఈ పాటను రిలీజ్ చేశారు. కొన్ని రోజుల నుంచి ఈ పాట గురించి చిత్ర బృందం ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ పాట గురించి పెద్ద చర్చే నడుస్తోంది.
ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు.. ముగ్గురు పేరున్న గాయకులు.. ఒక్కో భాషలో ఒక్కొక్కరు ఈ పాటను పాడటం.. సంగీత దర్శకుడు కీరవాణితో వాళ్లందరూ కలిసి ఉన్న ఫొటోతో ఈ పాట గురించి అప్డేట్ ఇవ్వడంతో అంచనాలు పెరిగిపోయాయి. పైగా రాజమౌళి సైతం ఈ సాంగ్కు ఎలివేషన్ ఇచ్చారు.
దీంతో భారీ అంచనాలతో ఈ పాట కోసం ఎదురు చూశారు ఫ్యాన్స్. పాట విని, విజువల్స్ చూశాక కాస్త నిరాశ కనిపిస్తోంది జనాల్లో. కీరవాణి అండ్ కో నుంచి ఇంకా ఎక్కువే ఆశించామన్నది మెజారిటీ అభిమానుల అభిప్రాయం.
ఐతే తెలుగు వెర్షన్ సాంగ్కు సీతారామశాస్త్రి సమకూర్చిన సాహిత్యం మాత్రం అద్భుతంగా ఉంది. కదిలే కార్చిచ్చుకి.. కసిరే బడగళ్లకి.. రవికి మేఘానికీ దోస్తీ లాంటి వాక్యాలు గూస్ బంప్స్ ఇచ్చేవే. తెలుగు వెర్షన్ను ప్రముఖ గాయకుడు హేమచంద్ర పాడాడు. అతడి గానం బాగానే సాగింది. హిందీలో అమిత్ త్రివేది.. మలయాళంలో విజయ్ ఏసుదాస్.. కన్నడలో యాజిన్ నజీర్.. తమిళంలో అనిరుధ్ రవిచందర్ తమ గాత్రాలను అందించారు.
ఐతే మిగతా వెర్షన్లతో పోలిస్తే తమిళ పాట కొంచెం భిన్నంగా, మెరుగ్గా అనిపిస్తుండటం విశేషం. మిగతా వాళ్లతో పోలిస్తే అనిరుధ్ ఎక్కువ ఫీల్తో, టిపికల్ వాయిస్తో ఈ పాట పాడాడన్న ఫీలింగ్ కలుగుతోంది. మిగతా వెర్షన్లతో పోలిస్తే అనిరుధ్ పాట ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. అనిరుధ్ మేటి సంగీత దర్శకుడే కాదు.. మంచి సింగర్ కూడా. ఎన్నో పాటలకు తన గాత్రంతో ప్రాణం పోశాడు. యూత్, మాస్ పల్స్ బాగా తెలిసిన అతను.. ‘ఆర్ఆర్ఆర్’ పాటకు పూర్తి న్యాయం చేశాడనే చెప్పాలి. మిగతా గాయకులతో పోలిస్తే అతడికే ఎక్కువ మార్కులు పడుతున్నాయి.
This post was last modified on August 1, 2021 6:12 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…