దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ తొలి పాట వచ్చేసింది. దోస్తీ పేరుతో ఆదివారం ఈ పాటను రిలీజ్ చేశారు. కొన్ని రోజుల నుంచి ఈ పాట గురించి చిత్ర బృందం ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ పాట గురించి పెద్ద చర్చే నడుస్తోంది.
ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు.. ముగ్గురు పేరున్న గాయకులు.. ఒక్కో భాషలో ఒక్కొక్కరు ఈ పాటను పాడటం.. సంగీత దర్శకుడు కీరవాణితో వాళ్లందరూ కలిసి ఉన్న ఫొటోతో ఈ పాట గురించి అప్డేట్ ఇవ్వడంతో అంచనాలు పెరిగిపోయాయి. పైగా రాజమౌళి సైతం ఈ సాంగ్కు ఎలివేషన్ ఇచ్చారు.
దీంతో భారీ అంచనాలతో ఈ పాట కోసం ఎదురు చూశారు ఫ్యాన్స్. పాట విని, విజువల్స్ చూశాక కాస్త నిరాశ కనిపిస్తోంది జనాల్లో. కీరవాణి అండ్ కో నుంచి ఇంకా ఎక్కువే ఆశించామన్నది మెజారిటీ అభిమానుల అభిప్రాయం.
ఐతే తెలుగు వెర్షన్ సాంగ్కు సీతారామశాస్త్రి సమకూర్చిన సాహిత్యం మాత్రం అద్భుతంగా ఉంది. కదిలే కార్చిచ్చుకి.. కసిరే బడగళ్లకి.. రవికి మేఘానికీ దోస్తీ లాంటి వాక్యాలు గూస్ బంప్స్ ఇచ్చేవే. తెలుగు వెర్షన్ను ప్రముఖ గాయకుడు హేమచంద్ర పాడాడు. అతడి గానం బాగానే సాగింది. హిందీలో అమిత్ త్రివేది.. మలయాళంలో విజయ్ ఏసుదాస్.. కన్నడలో యాజిన్ నజీర్.. తమిళంలో అనిరుధ్ రవిచందర్ తమ గాత్రాలను అందించారు.
ఐతే మిగతా వెర్షన్లతో పోలిస్తే తమిళ పాట కొంచెం భిన్నంగా, మెరుగ్గా అనిపిస్తుండటం విశేషం. మిగతా వాళ్లతో పోలిస్తే అనిరుధ్ ఎక్కువ ఫీల్తో, టిపికల్ వాయిస్తో ఈ పాట పాడాడన్న ఫీలింగ్ కలుగుతోంది. మిగతా వెర్షన్లతో పోలిస్తే అనిరుధ్ పాట ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. అనిరుధ్ మేటి సంగీత దర్శకుడే కాదు.. మంచి సింగర్ కూడా. ఎన్నో పాటలకు తన గాత్రంతో ప్రాణం పోశాడు. యూత్, మాస్ పల్స్ బాగా తెలిసిన అతను.. ‘ఆర్ఆర్ఆర్’ పాటకు పూర్తి న్యాయం చేశాడనే చెప్పాలి. మిగతా గాయకులతో పోలిస్తే అతడికే ఎక్కువ మార్కులు పడుతున్నాయి.
This post was last modified on August 1, 2021 6:12 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…