పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘తమ్ముడు’ ఒకటి. హిందీ చిత్రం ‘జో జీతా వోహి సికిందర్’ ఆధారంగా కొత్త దర్శకుడు అరుణ్ ప్రసాద్ ఈ సినిమాను రూపొందించాడు. ఐతే హిందీతో పోలిస్తే తెలుగులో మార్పులుంటాయి. ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. ఒరిజనల్ నచ్చి పవన్ సైతం కొంత మేర క్రియేటివ్ సైడ్ అరుణ్ ప్రసాద్కు సాయం చేసి ఈ సినిమా తెలుగులో ఇంకా మెరుగ్గా తయారవడంతో తన వంతు కృషి చేశాడు.
విశేషం ఏంటంటే.. మరో మెగా హీరో అల్లు అర్జున్కు హిందీలో ఆల్ టైం ఫేవరెట్ సినిమా ఇదేనట. తాజాగా ఓ ఇంగ్లిష్ డైలీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతనీ విషయాన్ని వెల్లడించాడు. హిందీలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘జో జీతా వోహి సికిందర్’ తనకెంతో ఇష్టమైన చిత్రమని.. దాన్ని 20 సార్లకు పైగా చూశానని బన్నీ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
‘తమ్ముడు’లో పవన్ బాక్సింగ్ నేర్చుకుని విలన్తో ఫైట్ చేస్తే.. హిందీలో సైక్లింగ్ నేపథ్యంలో కథ నడుస్తుంది. అక్కడ మన్సూర్ ఖాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. 1992లో విడుదలైన ఈ చిత్రం అప్పటికి ఆమిర్ ఖాన్ కెరీర్లో బిగ్టెస్ట్ హిట్గా నిలిచింది. ఏడేళ్ల తర్వాత తెలుగులో తెరకెక్కి ఇక్కడా మంచి విజయం సాధించింది.
ఇది కాక మరో రెండు హిందీ సినిమాల్ని తాను అమితంగా ఇష్టపడతానని అన్నాడు బన్నీ. అందులో ఒకటి బాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్.. దిల్వాలే దుల్హానియా లే జాయేంగే. ఈ సినిమాను కూడా చాలాసార్లు చూసినట్లు బన్నీ తెలిపాడు. షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా ఆదిత్య చోప్రా రూపొందించిన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
ఇక మోడర్న్ హిందీ సినిమాల విషయానికి వస్తే.. గల్లీబాయ్ తనకు చాలా ఇష్టమైన చిత్రమని బన్నీ తెలిపాడు. ఈ సినిమాను కూడా మూణ్నాలుగుసార్లు చూసినట్లు వెల్లడించాడు. ఈ చిత్రాన్ని మెగా హీరోల్లోనే ఒకరితో రీమేక్ చేస్తారని ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
This post was last modified on May 25, 2020 2:55 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…