ఎవరా హీరోయిన్.. ఆమె పోరాటం చేస్తున్నది ఏ నిర్మాణ సంస్థ మీద అన్న ఆసక్తి కలుగుతోందా? ఐతే ఇది మన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం కాదులెండి. హాలీవుడ్లో తలెత్తిన ఇష్యూ. ఫేమస్ హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్.. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ డిస్నీ మీద న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఆ సంస్థకు వ్యతిరేకంగా లా సూట్ వేసింది. డిస్నీ నిర్మాణంలో తాను ప్రధాన పాత్ర పోషించిన ‘బ్లాక్ విడో’ చిత్రాన్ని థియేటర్లతో పాటు ఒకేసారి డిజిటల్లో రిలీజ్ చేస్తుండటమే ఇందుకు కారణం.
తనకు, ఆ సంస్థకు జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రం థియేటర్లలోనే రిలీజ్ కావాలని.. తద్వారా వచ్చే ఆదాయంలో తనకు వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని.. కానీ ఆ అగ్రిమెంట్ను బ్రేక్ చేస్తూ డిస్నీ సంస్థ ‘బ్లాక్ విడో’ చిత్రాన్ని ఒకేసారి థియేటర్లతో పాటు డిజిటల్ రిలీజ్కు సిద్ధం చేస్తోందని స్కార్లెట్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఒక చిత్రాన్ని థియేటర్లతో పాటు డిజిటల్లో ఒకేసారి రిలీజ్ చేస్తే.. థియేట్రికల్ రన్ ద్వారా వచ్చే ఆదాయం ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. ఆ మేరకు స్కార్లెట్కు థియేటర్ రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. అందుకే ఆమె డిస్నీ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. హాలీవుడ్లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉండి, ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో స్కార్లెట్ ఒకరు. అందుకే ఆమె హీరోల మాదిరే సినిమా రెవెన్యూలో వాటా తీసుకునేలా ఒప్పందాలు చేసుకుంటోంది.
‘బ్లాక్ విడో’ విషయంలో డిస్నీ వాళ్లతో ఇలాగే ఒప్పందం కుదిరింది. ఐతే కరోనా నేపథ్యంలో డిస్నీ సంస్థ ప్రణాళికలన్నీ మారిపోయాయి. కేవలం థియేట్రికల్ రన్ మీద ఆధారపడే పరిస్థితి లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ చిత్రాలను వీలును బట్టి థియేటర్లలో, అలాగే ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తోంది. ‘బ్లాక్ విడో’ను కూడా అదే తరహాలో రిలీజ్కు రెడీ చేసింది. కానీ ఇప్పుడు స్కార్లెట్ లా సూట్ వేయడం డిస్నీకి షాకే. మరి ఆ సంస్థ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on July 30, 2021 10:31 am
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…