ఎవరా హీరోయిన్.. ఆమె పోరాటం చేస్తున్నది ఏ నిర్మాణ సంస్థ మీద అన్న ఆసక్తి కలుగుతోందా? ఐతే ఇది మన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం కాదులెండి. హాలీవుడ్లో తలెత్తిన ఇష్యూ. ఫేమస్ హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్.. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ డిస్నీ మీద న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఆ సంస్థకు వ్యతిరేకంగా లా సూట్ వేసింది. డిస్నీ నిర్మాణంలో తాను ప్రధాన పాత్ర పోషించిన ‘బ్లాక్ విడో’ చిత్రాన్ని థియేటర్లతో పాటు ఒకేసారి డిజిటల్లో రిలీజ్ చేస్తుండటమే ఇందుకు కారణం.
తనకు, ఆ సంస్థకు జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రం థియేటర్లలోనే రిలీజ్ కావాలని.. తద్వారా వచ్చే ఆదాయంలో తనకు వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని.. కానీ ఆ అగ్రిమెంట్ను బ్రేక్ చేస్తూ డిస్నీ సంస్థ ‘బ్లాక్ విడో’ చిత్రాన్ని ఒకేసారి థియేటర్లతో పాటు డిజిటల్ రిలీజ్కు సిద్ధం చేస్తోందని స్కార్లెట్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఒక చిత్రాన్ని థియేటర్లతో పాటు డిజిటల్లో ఒకేసారి రిలీజ్ చేస్తే.. థియేట్రికల్ రన్ ద్వారా వచ్చే ఆదాయం ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. ఆ మేరకు స్కార్లెట్కు థియేటర్ రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. అందుకే ఆమె డిస్నీ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. హాలీవుడ్లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉండి, ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో స్కార్లెట్ ఒకరు. అందుకే ఆమె హీరోల మాదిరే సినిమా రెవెన్యూలో వాటా తీసుకునేలా ఒప్పందాలు చేసుకుంటోంది.
‘బ్లాక్ విడో’ విషయంలో డిస్నీ వాళ్లతో ఇలాగే ఒప్పందం కుదిరింది. ఐతే కరోనా నేపథ్యంలో డిస్నీ సంస్థ ప్రణాళికలన్నీ మారిపోయాయి. కేవలం థియేట్రికల్ రన్ మీద ఆధారపడే పరిస్థితి లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ చిత్రాలను వీలును బట్టి థియేటర్లలో, అలాగే ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తోంది. ‘బ్లాక్ విడో’ను కూడా అదే తరహాలో రిలీజ్కు రెడీ చేసింది. కానీ ఇప్పుడు స్కార్లెట్ లా సూట్ వేయడం డిస్నీకి షాకే. మరి ఆ సంస్థ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on July 30, 2021 10:31 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…