Movie News

నిర్మాణ సంస్థపై హీరోయిన్ న్యాయ పోరాటం


ఎవరా హీరోయిన్.. ఆమె పోరాటం చేస్తున్నది ఏ నిర్మాణ సంస్థ మీద అన్న ఆసక్తి కలుగుతోందా? ఐతే ఇది మన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం కాదులెండి. హాలీవుడ్లో తలెత్తిన ఇష్యూ. ఫేమస్ హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్.. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ డిస్నీ మీద న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఆ సంస్థకు వ్యతిరేకంగా లా సూట్ వేసింది. డిస్నీ నిర్మాణంలో తాను ప్రధాన పాత్ర పోషించిన ‘బ్లాక్ విడో’ చిత్రాన్ని థియేటర్లతో పాటు ఒకేసారి డిజిటల్లో రిలీజ్ చేస్తుండటమే ఇందుకు కారణం.

తనకు, ఆ సంస్థకు జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రం థియేటర్లలోనే రిలీజ్ కావాలని.. తద్వారా వచ్చే ఆదాయంలో తనకు వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని.. కానీ ఆ అగ్రిమెంట్‌ను బ్రేక్ చేస్తూ డిస్నీ సంస్థ ‘బ్లాక్ విడో’ చిత్రాన్ని ఒకేసారి థియేటర్లతో పాటు డిజిటల్ రిలీజ్‌కు సిద్ధం చేస్తోందని స్కార్లెట్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఒక చిత్రాన్ని థియేటర్లతో పాటు డిజిటల్లో ఒకేసారి రిలీజ్ చేస్తే.. థియేట్రికల్ రన్ ద్వారా వచ్చే ఆదాయం ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. ఆ మేరకు స్కార్లెట్‌కు థియేటర్ రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. అందుకే ఆమె డిస్నీ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. హాలీవుడ్లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉండి, ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో స్కార్లెట్ ఒకరు. అందుకే ఆమె హీరోల మాదిరే సినిమా రెవెన్యూలో వాటా తీసుకునేలా ఒప్పందాలు చేసుకుంటోంది.

‘బ్లాక్ విడో’ విషయంలో డిస్నీ వాళ్లతో ఇలాగే ఒప్పందం కుదిరింది. ఐతే కరోనా నేపథ్యంలో డిస్నీ సంస్థ ప్రణాళికలన్నీ మారిపోయాయి. కేవలం థియేట్రికల్ రన్ మీద ఆధారపడే పరిస్థితి లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ చిత్రాలను వీలును బట్టి థియేటర్లలో, అలాగే ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తోంది. ‘బ్లాక్ విడో’ను కూడా అదే తరహాలో రిలీజ్‌కు రెడీ చేసింది. కానీ ఇప్పుడు స్కార్లెట్ లా సూట్ వేయడం డిస్నీకి షాకే. మరి ఆ సంస్థ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on July 30, 2021 10:31 am

Share
Show comments
Published by
satya

Recent Posts

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

46 mins ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

2 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

3 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

3 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

5 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

5 hours ago