ఎవరా హీరోయిన్.. ఆమె పోరాటం చేస్తున్నది ఏ నిర్మాణ సంస్థ మీద అన్న ఆసక్తి కలుగుతోందా? ఐతే ఇది మన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం కాదులెండి. హాలీవుడ్లో తలెత్తిన ఇష్యూ. ఫేమస్ హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్.. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ డిస్నీ మీద న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఆ సంస్థకు వ్యతిరేకంగా లా సూట్ వేసింది. డిస్నీ నిర్మాణంలో తాను ప్రధాన పాత్ర పోషించిన ‘బ్లాక్ విడో’ చిత్రాన్ని థియేటర్లతో పాటు ఒకేసారి డిజిటల్లో రిలీజ్ చేస్తుండటమే ఇందుకు కారణం.
తనకు, ఆ సంస్థకు జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రం థియేటర్లలోనే రిలీజ్ కావాలని.. తద్వారా వచ్చే ఆదాయంలో తనకు వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని.. కానీ ఆ అగ్రిమెంట్ను బ్రేక్ చేస్తూ డిస్నీ సంస్థ ‘బ్లాక్ విడో’ చిత్రాన్ని ఒకేసారి థియేటర్లతో పాటు డిజిటల్ రిలీజ్కు సిద్ధం చేస్తోందని స్కార్లెట్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఒక చిత్రాన్ని థియేటర్లతో పాటు డిజిటల్లో ఒకేసారి రిలీజ్ చేస్తే.. థియేట్రికల్ రన్ ద్వారా వచ్చే ఆదాయం ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. ఆ మేరకు స్కార్లెట్కు థియేటర్ రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. అందుకే ఆమె డిస్నీ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. హాలీవుడ్లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉండి, ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో స్కార్లెట్ ఒకరు. అందుకే ఆమె హీరోల మాదిరే సినిమా రెవెన్యూలో వాటా తీసుకునేలా ఒప్పందాలు చేసుకుంటోంది.
‘బ్లాక్ విడో’ విషయంలో డిస్నీ వాళ్లతో ఇలాగే ఒప్పందం కుదిరింది. ఐతే కరోనా నేపథ్యంలో డిస్నీ సంస్థ ప్రణాళికలన్నీ మారిపోయాయి. కేవలం థియేట్రికల్ రన్ మీద ఆధారపడే పరిస్థితి లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ చిత్రాలను వీలును బట్టి థియేటర్లలో, అలాగే ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తోంది. ‘బ్లాక్ విడో’ను కూడా అదే తరహాలో రిలీజ్కు రెడీ చేసింది. కానీ ఇప్పుడు స్కార్లెట్ లా సూట్ వేయడం డిస్నీకి షాకే. మరి ఆ సంస్థ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on July 30, 2021 10:31 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…