టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత అక్కినేని త్వరలోనే ప్రభాస్ సినిమాలో నటించబోతుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. దీపికా పదుకోన్ హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం సమంతను సంప్రదించినట్లు వార్తలొచ్చాయి.
కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. సమంత సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. అసలు ప్రభాస్ సినిమా ఆఫర్ రాలేదని తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్ కె’ సినిమాకి సంబంధించి ఆమెని ఎవరూ సంప్రదించలేరట. ప్రస్తుతం ఆమె ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసే పనిలో పడింది. ఈ పౌరాణిక గాథ పూర్తయితే గానీ మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించే స్థితిలో లేదని అంటున్నారు.
ఇక నాగ్ అశ్విన్ తన సినిమా కోసం ఇతర భాషల నుండి నటీనటులను దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ యాక్టర్ ను తీసుకున్నారు. అలానే మరికొంతమంది పేరున్న ఆర్టిస్ట్ లు రాబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను నిర్మించనున్నారు. అశ్వనీదత్ నిర్మించనున్న ఈ సినిమా 2023లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
This post was last modified on July 29, 2021 11:24 am
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…