టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత అక్కినేని త్వరలోనే ప్రభాస్ సినిమాలో నటించబోతుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. దీపికా పదుకోన్ హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం సమంతను సంప్రదించినట్లు వార్తలొచ్చాయి.
కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. సమంత సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. అసలు ప్రభాస్ సినిమా ఆఫర్ రాలేదని తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్ కె’ సినిమాకి సంబంధించి ఆమెని ఎవరూ సంప్రదించలేరట. ప్రస్తుతం ఆమె ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసే పనిలో పడింది. ఈ పౌరాణిక గాథ పూర్తయితే గానీ మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించే స్థితిలో లేదని అంటున్నారు.
ఇక నాగ్ అశ్విన్ తన సినిమా కోసం ఇతర భాషల నుండి నటీనటులను దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ యాక్టర్ ను తీసుకున్నారు. అలానే మరికొంతమంది పేరున్న ఆర్టిస్ట్ లు రాబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను నిర్మించనున్నారు. అశ్వనీదత్ నిర్మించనున్న ఈ సినిమా 2023లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…