టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత అక్కినేని త్వరలోనే ప్రభాస్ సినిమాలో నటించబోతుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. దీపికా పదుకోన్ హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం సమంతను సంప్రదించినట్లు వార్తలొచ్చాయి.
కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. సమంత సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. అసలు ప్రభాస్ సినిమా ఆఫర్ రాలేదని తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్ కె’ సినిమాకి సంబంధించి ఆమెని ఎవరూ సంప్రదించలేరట. ప్రస్తుతం ఆమె ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసే పనిలో పడింది. ఈ పౌరాణిక గాథ పూర్తయితే గానీ మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించే స్థితిలో లేదని అంటున్నారు.
ఇక నాగ్ అశ్విన్ తన సినిమా కోసం ఇతర భాషల నుండి నటీనటులను దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ యాక్టర్ ను తీసుకున్నారు. అలానే మరికొంతమంది పేరున్న ఆర్టిస్ట్ లు రాబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను నిర్మించనున్నారు. అశ్వనీదత్ నిర్మించనున్న ఈ సినిమా 2023లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
This post was last modified on July 29, 2021 11:24 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…