టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత అక్కినేని త్వరలోనే ప్రభాస్ సినిమాలో నటించబోతుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. దీపికా పదుకోన్ హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం సమంతను సంప్రదించినట్లు వార్తలొచ్చాయి.
కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. సమంత సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. అసలు ప్రభాస్ సినిమా ఆఫర్ రాలేదని తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్ కె’ సినిమాకి సంబంధించి ఆమెని ఎవరూ సంప్రదించలేరట. ప్రస్తుతం ఆమె ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసే పనిలో పడింది. ఈ పౌరాణిక గాథ పూర్తయితే గానీ మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించే స్థితిలో లేదని అంటున్నారు.
ఇక నాగ్ అశ్విన్ తన సినిమా కోసం ఇతర భాషల నుండి నటీనటులను దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ యాక్టర్ ను తీసుకున్నారు. అలానే మరికొంతమంది పేరున్న ఆర్టిస్ట్ లు రాబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను నిర్మించనున్నారు. అశ్వనీదత్ నిర్మించనున్న ఈ సినిమా 2023లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
This post was last modified on July 29, 2021 11:24 am
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైన తర్వాత.. కూటమి పార్టీల అభ్యర్థుల ప్రచారంలో భారీ మార్పు చోటు చేసుకుంది. ముఖ్యంగా ఉమ్మడి…
మహేష్ బాబు బావ అనే గుర్తింపుతో హీరోగా అడుగు పెట్టి కెరీర్ ఆరంభంలో కుదురుకోవడానికి చాలా కష్టపడ్డాడు సుధీర్ బాబు.…
2024లో టాలీవుడ్ నుంచి రాబోయే పెద్ద సినిమాలకు విడుదలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేసినట్లే. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు…
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. రెండు సార్లు గెలిచి మంత్రి పదవి, ఒకసారి ఓడినా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ముచ్చటగా…
పవన్ బాబాయికి ఒక్కసారి ఓటేయండి. ఒక్కసారి ఆయనను అసెంబ్లీకి పంపించండి .. ప్లీజ్ అంటూ.. మెగా ప్రిన్స్ నాగబాబు కుమారుడు…
మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…