కేవలం ఒక అర నిమిషం నిడివి ఉన్న వీడియోతో దేశాన్ని ఊపేసింది మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్. కొన్నేళ్ల కిందట ఈ అమ్మాయి ఓ చిన్న సినిమాలో భాగంగా కన్ను కొట్టే వీడియోతో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆ వీడియో అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయిపోయింది. విదేశీయులు సైతం ఆ అమ్మాయిని గుర్తుపట్టే పరిస్థితి వచ్చిందంటే అదంతా ఆ వీడియో పుణ్యమే. ఈ పాపులారిటీతో వివిధ భాషల్లో సినిమా అవకాశాలు కూడా అందుకుంది ప్రియా.
హిందీలో రెండు సినిమాలు చేస్తూ.. తెలుగులోనూ రెండు మూడు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అందులో ఒకటి ‘చెక్’ ఈ ఏడాది ఆరంభంలో విడుదలైంది. ఇప్పుడు ‘ఇష్క్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ హిట్ ‘ఇష్క్’కు రీమేక్గా తెరకెక్కిన ఈ మూవీలో ఆమెకు జోడీగా తేజ సజ్జా నటించాడు. ఈ నెల 30న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ మీడియాతో మాట్లాడింది ప్రియ. వింక్ వీడియోతో వచ్చిన పాపులారిటీ సినిమా అవకాశాలు దక్కించుకున్నప్పటికీ వెంటనే సినిమాలు చేయలేదేంటి.. సొంత భాషలో అనుకున్నంత అవకాశాలు దక్కించుకోలేకపోయారేంటి అని అడిగితే.. అందుక్కారణం తన చదువే అని చెప్పింది ప్రియ. కనీసం డిగ్రీ చేశాకే సినిమాల్లో బిజీ కావాలనుకున్నానని.. చదువు మధ్యలో వదిలేసి సినిమాల్లో నటించాలనుకోలేదని ప్రియ చెప్పింది.
మలయాళంలో తనకు కొన్ని పెద్ద సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయని.. కానీ చదువు కోసమే వాటిని వదులుకోవాల్సి వచ్చిందని ప్రియ చెప్పింది. ఐతే తెలుగులో ఇప్పుడు తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని.. సొంత భాషలో కంటే కూడా తెలుగులో తనకు ఎక్కువ పాపులారిటీ కనిపిస్తోందని ప్రియ అంది. ‘ఇష్క్’ సినిమా షూటింగ్ మొదలు కావడానికి కేవలం రెండు రోజుల ముందు తనకు కాల్ వచ్చిందని.. ఒరిజినల్ చూడగానే ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేశానని.. వెంటనే సెట్లో వాలిపోయానని చెప్పింది ప్రియ.
This post was last modified on July 28, 2021 2:27 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…