కేవలం ఒక అర నిమిషం నిడివి ఉన్న వీడియోతో దేశాన్ని ఊపేసింది మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్. కొన్నేళ్ల కిందట ఈ అమ్మాయి ఓ చిన్న సినిమాలో భాగంగా కన్ను కొట్టే వీడియోతో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆ వీడియో అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయిపోయింది. విదేశీయులు సైతం ఆ అమ్మాయిని గుర్తుపట్టే పరిస్థితి వచ్చిందంటే అదంతా ఆ వీడియో పుణ్యమే. ఈ పాపులారిటీతో వివిధ భాషల్లో సినిమా అవకాశాలు కూడా అందుకుంది ప్రియా.
హిందీలో రెండు సినిమాలు చేస్తూ.. తెలుగులోనూ రెండు మూడు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అందులో ఒకటి ‘చెక్’ ఈ ఏడాది ఆరంభంలో విడుదలైంది. ఇప్పుడు ‘ఇష్క్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ హిట్ ‘ఇష్క్’కు రీమేక్గా తెరకెక్కిన ఈ మూవీలో ఆమెకు జోడీగా తేజ సజ్జా నటించాడు. ఈ నెల 30న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ మీడియాతో మాట్లాడింది ప్రియ. వింక్ వీడియోతో వచ్చిన పాపులారిటీ సినిమా అవకాశాలు దక్కించుకున్నప్పటికీ వెంటనే సినిమాలు చేయలేదేంటి.. సొంత భాషలో అనుకున్నంత అవకాశాలు దక్కించుకోలేకపోయారేంటి అని అడిగితే.. అందుక్కారణం తన చదువే అని చెప్పింది ప్రియ. కనీసం డిగ్రీ చేశాకే సినిమాల్లో బిజీ కావాలనుకున్నానని.. చదువు మధ్యలో వదిలేసి సినిమాల్లో నటించాలనుకోలేదని ప్రియ చెప్పింది.
మలయాళంలో తనకు కొన్ని పెద్ద సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయని.. కానీ చదువు కోసమే వాటిని వదులుకోవాల్సి వచ్చిందని ప్రియ చెప్పింది. ఐతే తెలుగులో ఇప్పుడు తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని.. సొంత భాషలో కంటే కూడా తెలుగులో తనకు ఎక్కువ పాపులారిటీ కనిపిస్తోందని ప్రియ అంది. ‘ఇష్క్’ సినిమా షూటింగ్ మొదలు కావడానికి కేవలం రెండు రోజుల ముందు తనకు కాల్ వచ్చిందని.. ఒరిజినల్ చూడగానే ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేశానని.. వెంటనే సెట్లో వాలిపోయానని చెప్పింది ప్రియ.
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…