కేవలం ఒక అర నిమిషం నిడివి ఉన్న వీడియోతో దేశాన్ని ఊపేసింది మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్. కొన్నేళ్ల కిందట ఈ అమ్మాయి ఓ చిన్న సినిమాలో భాగంగా కన్ను కొట్టే వీడియోతో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆ వీడియో అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయిపోయింది. విదేశీయులు సైతం ఆ అమ్మాయిని గుర్తుపట్టే పరిస్థితి వచ్చిందంటే అదంతా ఆ వీడియో పుణ్యమే. ఈ పాపులారిటీతో వివిధ భాషల్లో సినిమా అవకాశాలు కూడా అందుకుంది ప్రియా.
హిందీలో రెండు సినిమాలు చేస్తూ.. తెలుగులోనూ రెండు మూడు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అందులో ఒకటి ‘చెక్’ ఈ ఏడాది ఆరంభంలో విడుదలైంది. ఇప్పుడు ‘ఇష్క్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ హిట్ ‘ఇష్క్’కు రీమేక్గా తెరకెక్కిన ఈ మూవీలో ఆమెకు జోడీగా తేజ సజ్జా నటించాడు. ఈ నెల 30న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ మీడియాతో మాట్లాడింది ప్రియ. వింక్ వీడియోతో వచ్చిన పాపులారిటీ సినిమా అవకాశాలు దక్కించుకున్నప్పటికీ వెంటనే సినిమాలు చేయలేదేంటి.. సొంత భాషలో అనుకున్నంత అవకాశాలు దక్కించుకోలేకపోయారేంటి అని అడిగితే.. అందుక్కారణం తన చదువే అని చెప్పింది ప్రియ. కనీసం డిగ్రీ చేశాకే సినిమాల్లో బిజీ కావాలనుకున్నానని.. చదువు మధ్యలో వదిలేసి సినిమాల్లో నటించాలనుకోలేదని ప్రియ చెప్పింది.
మలయాళంలో తనకు కొన్ని పెద్ద సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయని.. కానీ చదువు కోసమే వాటిని వదులుకోవాల్సి వచ్చిందని ప్రియ చెప్పింది. ఐతే తెలుగులో ఇప్పుడు తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని.. సొంత భాషలో కంటే కూడా తెలుగులో తనకు ఎక్కువ పాపులారిటీ కనిపిస్తోందని ప్రియ అంది. ‘ఇష్క్’ సినిమా షూటింగ్ మొదలు కావడానికి కేవలం రెండు రోజుల ముందు తనకు కాల్ వచ్చిందని.. ఒరిజినల్ చూడగానే ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేశానని.. వెంటనే సెట్లో వాలిపోయానని చెప్పింది ప్రియ.
This post was last modified on July 28, 2021 2:27 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…