కేవలం ఒక అర నిమిషం నిడివి ఉన్న వీడియోతో దేశాన్ని ఊపేసింది మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్. కొన్నేళ్ల కిందట ఈ అమ్మాయి ఓ చిన్న సినిమాలో భాగంగా కన్ను కొట్టే వీడియోతో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆ వీడియో అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయిపోయింది. విదేశీయులు సైతం ఆ అమ్మాయిని గుర్తుపట్టే పరిస్థితి వచ్చిందంటే అదంతా ఆ వీడియో పుణ్యమే. ఈ పాపులారిటీతో వివిధ భాషల్లో సినిమా అవకాశాలు కూడా అందుకుంది ప్రియా.
హిందీలో రెండు సినిమాలు చేస్తూ.. తెలుగులోనూ రెండు మూడు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అందులో ఒకటి ‘చెక్’ ఈ ఏడాది ఆరంభంలో విడుదలైంది. ఇప్పుడు ‘ఇష్క్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ హిట్ ‘ఇష్క్’కు రీమేక్గా తెరకెక్కిన ఈ మూవీలో ఆమెకు జోడీగా తేజ సజ్జా నటించాడు. ఈ నెల 30న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ మీడియాతో మాట్లాడింది ప్రియ. వింక్ వీడియోతో వచ్చిన పాపులారిటీ సినిమా అవకాశాలు దక్కించుకున్నప్పటికీ వెంటనే సినిమాలు చేయలేదేంటి.. సొంత భాషలో అనుకున్నంత అవకాశాలు దక్కించుకోలేకపోయారేంటి అని అడిగితే.. అందుక్కారణం తన చదువే అని చెప్పింది ప్రియ. కనీసం డిగ్రీ చేశాకే సినిమాల్లో బిజీ కావాలనుకున్నానని.. చదువు మధ్యలో వదిలేసి సినిమాల్లో నటించాలనుకోలేదని ప్రియ చెప్పింది.
మలయాళంలో తనకు కొన్ని పెద్ద సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయని.. కానీ చదువు కోసమే వాటిని వదులుకోవాల్సి వచ్చిందని ప్రియ చెప్పింది. ఐతే తెలుగులో ఇప్పుడు తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని.. సొంత భాషలో కంటే కూడా తెలుగులో తనకు ఎక్కువ పాపులారిటీ కనిపిస్తోందని ప్రియ అంది. ‘ఇష్క్’ సినిమా షూటింగ్ మొదలు కావడానికి కేవలం రెండు రోజుల ముందు తనకు కాల్ వచ్చిందని.. ఒరిజినల్ చూడగానే ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేశానని.. వెంటనే సెట్లో వాలిపోయానని చెప్పింది ప్రియ.
This post was last modified on July 28, 2021 2:27 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…