కొత్త సినిమా రిలీజయ్యాక ఆ రోజు రాత్రికే పైరసీ వెర్షన్ ఆన్ లైన్లోకి వచ్చేయడం మామూలే. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నదే. పైరసీని అడ్డుకోవడానికి పరిశ్రమ జనాలు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఈ జాఢ్యం ఆగట్లేదు. ఐతే కొన్నిసార్లు కొత్త సినిమాలు రిలీజ్ కాకముందే లీక్ అయిపోవడం, ఆన్లైన్లో సినిమా సినిమా మొత్తం ప్రత్యక్షం అయిపోయే దారుణ ఉదంతాలు కూడా జరుగుతుంటాయి. అప్పట్లో అత్తారింటికి దారేది సినిమా ఇలాగే నెట్లో ప్రత్యక్షం అయిపోవడం ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. మరికొన్ని చిత్రాలు కూడా ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నాయి.
ఇప్పుడు ఓ కొత్త సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందు ఆన్ లైన్లో లీక్ అయిపోయింది. ఆ చిత్రమే.. మిమి. 1 నేనొక్కడినే హీరోయిన్ కృతి సనన్ ప్రధాన పాత్ర పోషించిన హిందీ చిత్రమిది. ఈ నెల 30న నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ కావాల్సి ఉంది.
ఐతే ఈ లోపు మిమి హెచ్డీ వెర్షన్ ఆన్ లైన్లోకి వచ్చేసింది. ఇంటర్నెట్లోకి ఓ సినిమా వచ్చిందంటే.. దానికి అడ్డు కట్ట వేయడం అంత సులువు కాదు. మొబైళ్లలో వైరల్ అయిపోతుంది. మిమి పరిస్థితి కూడా అంతే. పైరసీ వెర్షన్ను తీయించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తున్నప్పటికీ దాన్ని ఇప్పటికే చాలామంది షేర్ చేసేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర నిర్మాతలు, నెట్ ఫ్లిక్స్ వాళ్లు వెంటనే స్పందించి.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30న కాకుండా సోమవారం సాయంత్రమే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ చేసేశారు. విడుదలకు నాలుగు రోజుల ముందే సినిమా ఇలా లీక్ అయిందంటే అది కచ్చితంగా చిత్ర బృందంలోని వారి పనే అయ్యుంటుంది. నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ అంటే ఇప్పటికే సినిమాకు సంబంధించి కంటెంట్ అంతా వాళ్లకే ఇచ్చేసి ఉంటారు.
ఐతే చిత్ర బృందంలో ఎవరిదగ్గరైనా పస్ట్ కాపీ వెర్షన్ ఉండి ఏవైనా కారణాలతో ఇలా లీక్ చేశారేమో తెలియదు. చిత్ర బృందం దీనిపై విచారిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే పోలీసులను కూడా ఆశ్రయించినట్లు సమాచారం. డబ్బుకు ఆశపడి ఒక ఫారిన్ జంట కోసం సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి చూసే మధ్యతరగతి అమ్మాయి కథ ఇది.
This post was last modified on July 27, 2021 7:51 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…