‘బాహుబలి’ లాంటి భారీ చిత్రం తర్వాత ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.. ఒక్కసారిగా రేంజ్ తగ్గించేశారు. మూడేళ్ల పాటు గ్యాప్ తీసుకుని ‘ఉమామహేశ్వరరావు ఉగ్ర రూపస్య’ అనే చిన్న చిత్రాన్ని తెరకెక్కించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా రూపొందించిన చిత్రమిది. సత్యదేవ్ కథానాయకుడిగా నటించాడు. మలయాళంలో మంచి విజయం సాధించిన ‘మహేషింటి ప్రతీకారమ్’కు ఇది రీమేక్. ఐతే వెంకటేష్ దీనికి తనదైన టచ్ ఇచ్చాడు.
ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమోలన్నీ ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల కుదరలేదు. మళ్లీ ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయో.. తమ సినిమాకు ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఈ చిత్ర నిర్మాతలు ఓటీటీలో నేరుగా రిలీజ్ చేసేయడానికి రెడీ అవుతున్నారు.
‘ఉమా మహేశ్వరరావు ఉగ్రరూపస్య’ డిజిటల్ హక్కుల్ని నెట్ ప్లిక్స్ వాళ్లకు అమ్మేశారని.. డైరెక్ట్ ఆన్ లైన్ రిలీజ్కు అగ్రిమెంట్ కుదిరిందని.. లాభాలకే సినిమాను అమ్మారని సమాచారం. త్వరలోనే ప్రిమియర్స్ డేట్ ఇవ్వబోతున్నారట. ఈ సినిమా రేంజ్ ప్రకారం చూస్తే థియేటర్లలో మరీ ఎక్కువ రెవెన్యూ వచ్చే అవకాశం లేదు. ఇలాంటి చిన్న స్థాయి, క్లాస్ సినిమాలకు వసూళ్లు మరీ ఎక్కువేమీ రావు. వెంకటేష్ తొలి సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’కు ఎన్ని ప్రశంసలు వచ్చినా థియేటర్ల ద్వారా పెద్దగా ఆదాయం రాలేదు.
అందులోనూ లాక్ డౌన్ ప్రభావంతో రిలీజ్ మరీ ఆలస్యమయ్యేలా ఉంది. పైగా చాలా సినిమాలు రిలీజ్ కోసం లైన్లో ఉన్నాయి. కరోనా ప్రభావంతో థియేటర్లలో అనేక పరిమితుల దృష్ట్యా కొన్ని నెలల పాటు అంతగా రెవెన్యూ కూడా వచ్చేలా లేదు. అందుకే ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్కు రెడీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందంటున్నారు.
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…