దేశంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రం వర్షాల దాటికి వణికిపోతుంది. గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునగగా.. ఎంతోమంది నిరాశ్రయులు అవుతున్నారు. ఆర్ధిక, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ క్రమంలో తనకు కూడా వర్షాల కారణంగా భారీ నష్టం జరిగిందని చెబుతున్నారు నటుడు కుశాల్ టాండన్. హిందీ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన ఈ నటుడు 2019లో ‘ఆర్బర్ 28’ అనే పేరుతో రెస్టారెంట్ మొదలుపెట్టారు.
దీని ప్రారంభోత్సవ వేడుకకు హార్దిక్ పాండ్య, సిద్ధార్థ్ శుక్ల, సోహైల్ ఖాన్ లాంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే కొన్నిరోజుల పాటు వ్యాపారం బాగానే కొనసాగింది. కానీ కరోనా కారణంగా రెస్టారెంట్ ను మూసేయాల్సిన పరిస్థితి కలిగింది. లాక్ డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుండగా.. ఇప్పుడేమో వర్షాల దాటికి అతడి రెస్టారెంట్ ధ్వంసమైంది. ఈ విషయం గురించి కుశాల్ స్వయంగా చెప్పారు.
కోవిడ్ కారణంగా వ్యాపారం దెబ్బతిందని.. రెండు సార్లు రెస్టారెంట్ ను క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా రెస్టారెంట్ లను తెరిచినప్పటికీ కస్టమర్లు మాత్రం వచ్చేవారు కాదని.. ఇప్పుడేమో భారీ వర్షాల కారణంగా రెస్టారెంట్ కి డ్యామేజ్ జరిగిందని.. పాతిక లక్షల వరకు నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కురిసిన సమయంలో వాచ్ మెన్, గార్డులు అక్కడ లేకపోవడం మంచిదైందని చెప్పుకొచ్చారు.
This post was last modified on July 24, 2021 10:28 am
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…
టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…