Movie News

ముంబై వర్షాలు.. నటుడికి రూ.25 లక్షల నష్టం!

దేశంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రం వర్షాల దాటికి వణికిపోతుంది. గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునగగా.. ఎంతోమంది నిరాశ్రయులు అవుతున్నారు. ఆర్ధిక, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ క్రమంలో తనకు కూడా వర్షాల కారణంగా భారీ నష్టం జరిగిందని చెబుతున్నారు నటుడు కుశాల్ టాండన్. హిందీ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన ఈ నటుడు 2019లో ‘ఆర్బర్ 28’ అనే పేరుతో రెస్టారెంట్ మొదలుపెట్టారు.

దీని ప్రారంభోత్సవ వేడుకకు హార్దిక్ పాండ్య, సిద్ధార్థ్ శుక్ల, సోహైల్ ఖాన్ లాంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే కొన్నిరోజుల పాటు వ్యాపారం బాగానే కొనసాగింది. కానీ కరోనా కారణంగా రెస్టారెంట్ ను మూసేయాల్సిన పరిస్థితి కలిగింది. లాక్ డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుండగా.. ఇప్పుడేమో వర్షాల దాటికి అతడి రెస్టారెంట్ ధ్వంసమైంది. ఈ విషయం గురించి కుశాల్ స్వయంగా చెప్పారు.

కోవిడ్ కారణంగా వ్యాపారం దెబ్బతిందని.. రెండు సార్లు రెస్టారెంట్ ను క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా రెస్టారెంట్ లను తెరిచినప్పటికీ కస్టమర్లు మాత్రం వచ్చేవారు కాదని.. ఇప్పుడేమో భారీ వర్షాల కారణంగా రెస్టారెంట్ కి డ్యామేజ్ జరిగిందని.. పాతిక లక్షల వరకు నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కురిసిన సమయంలో వాచ్ మెన్, గార్డులు అక్కడ లేకపోవడం మంచిదైందని చెప్పుకొచ్చారు.




This post was last modified on July 24, 2021 10:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

44 minutes ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

57 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

5 hours ago