ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలంలో మల్టీస్టారర్ సినిమాలు బాగా వచ్చేవి. ఆ తరువాత అలాంటి కథలు రావడం తగ్గిపోయాయి. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ హీరోలుగా ఆధిపత్యం చెలాయించిన సమయంలో మల్టీస్టారర్ కథలు రాలేదు. నిజానికి అలాంటి కథలను దర్శకులు రెడీ చేసుకున్నా.. ఎందుకో వర్కవుట్ కాలేదు. దర్శకుడు మణిరత్నం తీసిన ‘ఘర్షణ’ కథ ముందుగా వెంకీ-నాగార్జులకు వినిపించారు.
కానీ కొన్ని కారణాల వలన ఈ ఇద్దరు హీరోలు కథను రిజెక్ట్ చేశారు. ఆ తరువాత ప్రభు-కార్తీక్ లను హీరోలుగా పెట్టి సూపర్ హిట్ కొట్టారు మణిరత్నం. ఇక చిరంజీవి-నాగార్జున చాలా ఏళ్లుగా మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నారు. కానీ కథ దొరకడం లేదు. వీరి తరంలో సెట్ కానీ మల్టీస్టారర్లను ఈ తరం హీరోలు వర్కవుట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో కొన్ని మల్టీస్టారర్లు వచ్చాయి. త్వరలోనే మరికొన్ని క్రేజీ కాంబినేషన్స్ ను చూడబోతున్నాం. ఇప్పుడు మరో మల్టీస్టారర్ కథ సెట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రీసెంట్ ఓ కథ విన్నారట. అందులో మరో హీరోకి కూడా స్కోప్ ఉందని తెలుస్తోంది. ముందుగా ఇద్దరు మెగా హీరోలతో సినిమా అనుకున్నారు కానీ సాయి ధరమ్ తేజ్.. నాగచైతన్య, అఖిల్ లలో ఎవరైనా చేస్తే బాగుటుందని సూచించారట. ఇప్పుడు కథ అక్కినేని బ్రదర్స్ దగ్గరకు వెళ్లిందని సమాచారం. వీరిద్దరిలో ఎవరు ఓకే చెప్పినా.. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయం.
This post was last modified on July 23, 2021 1:08 pm
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్గా…