ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలంలో మల్టీస్టారర్ సినిమాలు బాగా వచ్చేవి. ఆ తరువాత అలాంటి కథలు రావడం తగ్గిపోయాయి. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ హీరోలుగా ఆధిపత్యం చెలాయించిన సమయంలో మల్టీస్టారర్ కథలు రాలేదు. నిజానికి అలాంటి కథలను దర్శకులు రెడీ చేసుకున్నా.. ఎందుకో వర్కవుట్ కాలేదు. దర్శకుడు మణిరత్నం తీసిన ‘ఘర్షణ’ కథ ముందుగా వెంకీ-నాగార్జులకు వినిపించారు.
కానీ కొన్ని కారణాల వలన ఈ ఇద్దరు హీరోలు కథను రిజెక్ట్ చేశారు. ఆ తరువాత ప్రభు-కార్తీక్ లను హీరోలుగా పెట్టి సూపర్ హిట్ కొట్టారు మణిరత్నం. ఇక చిరంజీవి-నాగార్జున చాలా ఏళ్లుగా మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నారు. కానీ కథ దొరకడం లేదు. వీరి తరంలో సెట్ కానీ మల్టీస్టారర్లను ఈ తరం హీరోలు వర్కవుట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో కొన్ని మల్టీస్టారర్లు వచ్చాయి. త్వరలోనే మరికొన్ని క్రేజీ కాంబినేషన్స్ ను చూడబోతున్నాం. ఇప్పుడు మరో మల్టీస్టారర్ కథ సెట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రీసెంట్ ఓ కథ విన్నారట. అందులో మరో హీరోకి కూడా స్కోప్ ఉందని తెలుస్తోంది. ముందుగా ఇద్దరు మెగా హీరోలతో సినిమా అనుకున్నారు కానీ సాయి ధరమ్ తేజ్.. నాగచైతన్య, అఖిల్ లలో ఎవరైనా చేస్తే బాగుటుందని సూచించారట. ఇప్పుడు కథ అక్కినేని బ్రదర్స్ దగ్గరకు వెళ్లిందని సమాచారం. వీరిద్దరిలో ఎవరు ఓకే చెప్పినా.. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయం.
This post was last modified on July 23, 2021 1:08 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…