ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలంలో మల్టీస్టారర్ సినిమాలు బాగా వచ్చేవి. ఆ తరువాత అలాంటి కథలు రావడం తగ్గిపోయాయి. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ హీరోలుగా ఆధిపత్యం చెలాయించిన సమయంలో మల్టీస్టారర్ కథలు రాలేదు. నిజానికి అలాంటి కథలను దర్శకులు రెడీ చేసుకున్నా.. ఎందుకో వర్కవుట్ కాలేదు. దర్శకుడు మణిరత్నం తీసిన ‘ఘర్షణ’ కథ ముందుగా వెంకీ-నాగార్జులకు వినిపించారు.
కానీ కొన్ని కారణాల వలన ఈ ఇద్దరు హీరోలు కథను రిజెక్ట్ చేశారు. ఆ తరువాత ప్రభు-కార్తీక్ లను హీరోలుగా పెట్టి సూపర్ హిట్ కొట్టారు మణిరత్నం. ఇక చిరంజీవి-నాగార్జున చాలా ఏళ్లుగా మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నారు. కానీ కథ దొరకడం లేదు. వీరి తరంలో సెట్ కానీ మల్టీస్టారర్లను ఈ తరం హీరోలు వర్కవుట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో కొన్ని మల్టీస్టారర్లు వచ్చాయి. త్వరలోనే మరికొన్ని క్రేజీ కాంబినేషన్స్ ను చూడబోతున్నాం. ఇప్పుడు మరో మల్టీస్టారర్ కథ సెట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రీసెంట్ ఓ కథ విన్నారట. అందులో మరో హీరోకి కూడా స్కోప్ ఉందని తెలుస్తోంది. ముందుగా ఇద్దరు మెగా హీరోలతో సినిమా అనుకున్నారు కానీ సాయి ధరమ్ తేజ్.. నాగచైతన్య, అఖిల్ లలో ఎవరైనా చేస్తే బాగుటుందని సూచించారట. ఇప్పుడు కథ అక్కినేని బ్రదర్స్ దగ్గరకు వెళ్లిందని సమాచారం. వీరిద్దరిలో ఎవరు ఓకే చెప్పినా.. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయం.
This post was last modified on July 23, 2021 1:08 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…