టాలీవుడ్ సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్కు బాలీవుడ్లో మంచి గుర్తింపు, గౌరవం తీసుకొచ్చిన సినిమా ‘భజరంగి భాయిజాన్’. ‘బాహుబలి: ది బిగినింగ్’ రిలీజైన కొన్ని రోజులకే విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్నందుకుంది. రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాలు చేసే సల్మాన్.. ఈ సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. సల్మాన్కు ఇలాంటి సినిమా ఇచ్చినందుకు అతడి తండ్రి, లెజెండరీ రైటర్ సలీమ్ ఖాన్ ఎంతో సంతోషించి విజయేంద్ర ప్రసాద్కు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఐతే విజయేంద్ర ప్రసాద్.. ముందుగా ఈ కథను రాజమౌళి తీస్తే బాగుంటుందని ఫీలయ్యాడట. తన కొడుక్కి ఈ కథ కూడా చెప్పాడట. కానీ రాజమౌళి ఈ సినిమా తాను చేయనని చెప్పడంతో కథను మాత్రం సల్మాన్ ఖాన్కు ఇచ్చేయగా.. కబీర్ ఖాన్తో డైరెక్ట్ చేయించినట్లు విజయేంద్ర వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా విజయేంద్ర ఈ విషయం చెప్పాడు.
సల్మాన్కు కథ చెప్పాక.. రాజమౌళికి ‘భజరంగి భాయిజాన్’ స్టోరీ వినిపించానని.. ఆ కథ తన కొడుక్కి కూడా బాగా నచ్చిందని.. ఐతే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తావా అని అడిగితే మాత్రం తాను చేయనని రాజమౌళి చెప్పాడని విజయేంద్ర తెలిపాడు. ఐతే ‘భజరంగి భాయిజాన్’ విడుదలయ్యాక తాను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనందుకు ఫీలవుతున్నట్లు చెప్పాడని.. రాజమౌళి సరైన మూడ్లో లేనపుడు తాను ఈ కథ చెప్పడం తప్పయిందని విజయేంద్ర తెలిపాడు.
‘బాహుబలి’ కోసం ఎర్రటి ఎండలో వెయ్యిమందికి పైగా ఆర్టిస్టులతో భారీ యుద్ధ సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్న సమయంలో తాను అతడికి ఈ కథ చెప్పానని.. బ్యాడ్ మూడ్లో ఉండటంతో తాను ఈ సినిమాను డైరెక్ట్ చేయలేకపోయానని రాజమౌళి తనకు తర్వాత చెప్పాడని విజయేంద్ర తెలిపాడు. ఇక ఒకప్పుడు రాజమౌళి తన స్థాయిలో విజయవంతం కావాలని కోరుకునేవాడినని.. కానీ ఇప్పుడు అతడి స్థాయిని తాను అందుకోవడానికి కష్టపడుతున్నానని విజయేంద్ర చెప్పడం విశేషం.
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…