టాలీవుడ్ సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్కు బాలీవుడ్లో మంచి గుర్తింపు, గౌరవం తీసుకొచ్చిన సినిమా ‘భజరంగి భాయిజాన్’. ‘బాహుబలి: ది బిగినింగ్’ రిలీజైన కొన్ని రోజులకే విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్నందుకుంది. రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాలు చేసే సల్మాన్.. ఈ సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. సల్మాన్కు ఇలాంటి సినిమా ఇచ్చినందుకు అతడి తండ్రి, లెజెండరీ రైటర్ సలీమ్ ఖాన్ ఎంతో సంతోషించి విజయేంద్ర ప్రసాద్కు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఐతే విజయేంద్ర ప్రసాద్.. ముందుగా ఈ కథను రాజమౌళి తీస్తే బాగుంటుందని ఫీలయ్యాడట. తన కొడుక్కి ఈ కథ కూడా చెప్పాడట. కానీ రాజమౌళి ఈ సినిమా తాను చేయనని చెప్పడంతో కథను మాత్రం సల్మాన్ ఖాన్కు ఇచ్చేయగా.. కబీర్ ఖాన్తో డైరెక్ట్ చేయించినట్లు విజయేంద్ర వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా విజయేంద్ర ఈ విషయం చెప్పాడు.
సల్మాన్కు కథ చెప్పాక.. రాజమౌళికి ‘భజరంగి భాయిజాన్’ స్టోరీ వినిపించానని.. ఆ కథ తన కొడుక్కి కూడా బాగా నచ్చిందని.. ఐతే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తావా అని అడిగితే మాత్రం తాను చేయనని రాజమౌళి చెప్పాడని విజయేంద్ర తెలిపాడు. ఐతే ‘భజరంగి భాయిజాన్’ విడుదలయ్యాక తాను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనందుకు ఫీలవుతున్నట్లు చెప్పాడని.. రాజమౌళి సరైన మూడ్లో లేనపుడు తాను ఈ కథ చెప్పడం తప్పయిందని విజయేంద్ర తెలిపాడు.
‘బాహుబలి’ కోసం ఎర్రటి ఎండలో వెయ్యిమందికి పైగా ఆర్టిస్టులతో భారీ యుద్ధ సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్న సమయంలో తాను అతడికి ఈ కథ చెప్పానని.. బ్యాడ్ మూడ్లో ఉండటంతో తాను ఈ సినిమాను డైరెక్ట్ చేయలేకపోయానని రాజమౌళి తనకు తర్వాత చెప్పాడని విజయేంద్ర తెలిపాడు. ఇక ఒకప్పుడు రాజమౌళి తన స్థాయిలో విజయవంతం కావాలని కోరుకునేవాడినని.. కానీ ఇప్పుడు అతడి స్థాయిని తాను అందుకోవడానికి కష్టపడుతున్నానని విజయేంద్ర చెప్పడం విశేషం.
This post was last modified on July 22, 2021 11:21 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…