టాలీవుడ్ సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్కు బాలీవుడ్లో మంచి గుర్తింపు, గౌరవం తీసుకొచ్చిన సినిమా ‘భజరంగి భాయిజాన్’. ‘బాహుబలి: ది బిగినింగ్’ రిలీజైన కొన్ని రోజులకే విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్నందుకుంది. రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాలు చేసే సల్మాన్.. ఈ సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. సల్మాన్కు ఇలాంటి సినిమా ఇచ్చినందుకు అతడి తండ్రి, లెజెండరీ రైటర్ సలీమ్ ఖాన్ ఎంతో సంతోషించి విజయేంద్ర ప్రసాద్కు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఐతే విజయేంద్ర ప్రసాద్.. ముందుగా ఈ కథను రాజమౌళి తీస్తే బాగుంటుందని ఫీలయ్యాడట. తన కొడుక్కి ఈ కథ కూడా చెప్పాడట. కానీ రాజమౌళి ఈ సినిమా తాను చేయనని చెప్పడంతో కథను మాత్రం సల్మాన్ ఖాన్కు ఇచ్చేయగా.. కబీర్ ఖాన్తో డైరెక్ట్ చేయించినట్లు విజయేంద్ర వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా విజయేంద్ర ఈ విషయం చెప్పాడు.
సల్మాన్కు కథ చెప్పాక.. రాజమౌళికి ‘భజరంగి భాయిజాన్’ స్టోరీ వినిపించానని.. ఆ కథ తన కొడుక్కి కూడా బాగా నచ్చిందని.. ఐతే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తావా అని అడిగితే మాత్రం తాను చేయనని రాజమౌళి చెప్పాడని విజయేంద్ర తెలిపాడు. ఐతే ‘భజరంగి భాయిజాన్’ విడుదలయ్యాక తాను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనందుకు ఫీలవుతున్నట్లు చెప్పాడని.. రాజమౌళి సరైన మూడ్లో లేనపుడు తాను ఈ కథ చెప్పడం తప్పయిందని విజయేంద్ర తెలిపాడు.
‘బాహుబలి’ కోసం ఎర్రటి ఎండలో వెయ్యిమందికి పైగా ఆర్టిస్టులతో భారీ యుద్ధ సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్న సమయంలో తాను అతడికి ఈ కథ చెప్పానని.. బ్యాడ్ మూడ్లో ఉండటంతో తాను ఈ సినిమాను డైరెక్ట్ చేయలేకపోయానని రాజమౌళి తనకు తర్వాత చెప్పాడని విజయేంద్ర తెలిపాడు. ఇక ఒకప్పుడు రాజమౌళి తన స్థాయిలో విజయవంతం కావాలని కోరుకునేవాడినని.. కానీ ఇప్పుడు అతడి స్థాయిని తాను అందుకోవడానికి కష్టపడుతున్నానని విజయేంద్ర చెప్పడం విశేషం.
This post was last modified on July 22, 2021 11:21 am
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…