తెలుగు సినిమాల్లో హీరో అంటే ఎంతో అందంగా ఉండాలి. చేసే పాత్ర ఎలాంటిదైనా సరే.. గ్లామర్ తగ్గకూడదు. ఒక మెకానిక్ క్యారెక్టర్ చేసినా కూడా.. చక్కటి హేర్ స్టైల్, నీట్గా ఉండే డ్రెస్తోనే కనిపిస్తారు. హీరో ఎంత పేదవాడిగా కనిపించినా గ్లామర్ మెయింటైన్ చేసేలా చూడటం మన వాళ్లకే చెల్లుతుంది. ఒక భాషలో ఓ హీరో చాలా సాధారణంగా కనిపించిన సినిమాను రీమేక్ చేస్తున్నపుడు మన వాళ్లు కామన్గా చేసే మార్పు.. హీరోను గ్లామరస్గా చూపించడం. ఐతే కొన్ని కథలు, పాత్రల విషయంలో ఈ మార్పులు నడిచిపోతాయి. కానీ కొన్ని చిత్రాల విషయంలో ఇలాంటి ఛేంజెస్ పాత్ర ఔచిత్యమే దెబ్బ తినేలా చేస్తాయి. ఇందుకు తాజా ఉదాహరణ.. నారప్ప సినిమానే.
ఈ చిత్రం తమిళ బ్లాక్బస్టర్ ‘అసురన్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్లో ధనుష్ చేసిన పాత్రను ఇక్కడ వెంకీ చేశాడు. ఐతే తమిళంలో ఆద్యంతం ఎంతో ఎమోషనల్గా, హృద్యంగా అనిపించే ‘అసురన్’ తెలుగులోకి వచ్చేసరికి అంత ప్రభావవంతంగా కనిపించలేదు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఉన్న ఆత్మను పట్టుకోవడంలో, అందులోని ఫీల్ను ఇక్కడ తీసుకురావడంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విఫలమయ్యాడు. హీరో క్యారెక్టర్ను చూపించే విషయంలో జాగ్రత్త పడకపోవడమే చేటు చేసింది.
హీరో అందులో సారా కాచేవాడు. పేదవాడు. అలాంటి వ్యక్తి ఎలా కనిపించాలి. చాలా సాధారణమైన బట్టలు వేయాలి. తన ఆహార్యం పట్ల ఏమీ శ్రద్ధ లేనట్లు కనిపించాలి. రఫ్ లుక్తో ఉండాలి. కానీ వెంకీకి మాత్రం డిజైనర్ షర్టులేయించారు. ఇస్త్రీ చేసిన పట్టు పంచెలు కట్టించారు. క్లీన్ షేవ్.. స్టైలింగ్ చేసిన హేర్తో చూపించారు. ఓవైపు కుల అసమానతలు, రాజు-పేద తారతమ్యాల గురించి చర్చిస్తూ హీరోను ఇలా చూపిస్తే ప్రేక్షకుల్లో ఎలా ఎమోషన్ వస్తుంది? హీరో పరిస్థితి పట్ల మనకు ముందు జాలి కలిగితే కానీ ఈ ఎమోషన్ పండదు.
కానీ ‘నారప్ప’లో కథానాయకుడు కనిపించే విధానం వల్ల మనకు ఆ ఫీలే రాదు. ఫలితంగా ఫ్లాష్ బ్యాక్ ఇంపాక్ట్ చూపించలేకపోయింది. గత కొన్నేళ్లలో మన ప్రేక్షకుల అభిరుచి ఎంతో మారి హీరో ఎంత డీగ్లామరస్గా, లోపాలతో కనిపించినా కూడా ఆమోదిస్తున్నారు. ‘రంగస్థలం’ లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. ప్రేక్షకులు ఎంతో మారాక కూడా హీరోలు, ఫిలిం మేకర్స్ పాత ఆలోచనలతో ఉండటంలో అర్థం లేదు. ఇకనైనా పాత్రతో సంబంధం లేకుండా హీరోను అత్యంత ఆకర్షణీయంగా చూపించే పాత పద్ధతులకు చరమగీతం పాడితే మంచిది.
This post was last modified on July 21, 2021 9:37 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…