టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన కృతిసనన్ కి ఇక్కడ సరైన అవకాశాలు రాలేదు. దీంతో ఆమె బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సక్సెస్ మీద సక్సెస్ అందుకుంటోంది. దీంతో ఆమెకి బాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం ఆమె చేతుల్లో ఐదు సినిమాలున్నాయి. అందులో ఒకటి ‘ఆదిపురుష్’. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో అమ్మడు క్రేజ్ మరింత పెరగడం ఖాయం.
టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన కృతి ఇప్పుడు తన చెల్లెల్ని హీరోయిన్ గా పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తోంది. కృతి సోదరి నుపుర్ సనన్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమె ఒక మ్యూజిక్ వీడియో ఆల్బమ్ లో నటించింది. అందులో అక్షయ్ కుమార్ సరసన కనిపించింది. కానీ అది కేవలం ప్రైవేట్ సాంగ్. ఇప్పుడు నుపుర్ కోసం మంచి సినిమాను సెట్ చేసే పనిలో పడింది కృతిసనన్.
ప్రస్తుతం ఈ బ్యూటీ టైగర్ ష్రాఫ్ సరసన ఒక హిందీ సినిమా చేస్తోంది. ఇందులో మరో హీరోయిన్ కూడా నటించాలి. రెండో హీరోయిన్ పాత్ర కోసం నుపుర్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను కృతి ఖండించింది. తన చెల్లెల్ని సోలో హీరోయిన్ గానే పరిచయం చేయాలని చూస్తుంది కృతిసనన్. ఈ మేరకు తనకు తెలిసిన కొందరు దర్శకనిర్మాతలను సంప్రదిస్తోంది, మరి నుపుర్ కి సరైన కథ సెట్ అవుతుందేమో చూడాలి!
This post was last modified on July 21, 2021 10:45 am
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…