టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన కృతిసనన్ కి ఇక్కడ సరైన అవకాశాలు రాలేదు. దీంతో ఆమె బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సక్సెస్ మీద సక్సెస్ అందుకుంటోంది. దీంతో ఆమెకి బాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం ఆమె చేతుల్లో ఐదు సినిమాలున్నాయి. అందులో ఒకటి ‘ఆదిపురుష్’. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో అమ్మడు క్రేజ్ మరింత పెరగడం ఖాయం.
టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన కృతి ఇప్పుడు తన చెల్లెల్ని హీరోయిన్ గా పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తోంది. కృతి సోదరి నుపుర్ సనన్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమె ఒక మ్యూజిక్ వీడియో ఆల్బమ్ లో నటించింది. అందులో అక్షయ్ కుమార్ సరసన కనిపించింది. కానీ అది కేవలం ప్రైవేట్ సాంగ్. ఇప్పుడు నుపుర్ కోసం మంచి సినిమాను సెట్ చేసే పనిలో పడింది కృతిసనన్.
ప్రస్తుతం ఈ బ్యూటీ టైగర్ ష్రాఫ్ సరసన ఒక హిందీ సినిమా చేస్తోంది. ఇందులో మరో హీరోయిన్ కూడా నటించాలి. రెండో హీరోయిన్ పాత్ర కోసం నుపుర్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను కృతి ఖండించింది. తన చెల్లెల్ని సోలో హీరోయిన్ గానే పరిచయం చేయాలని చూస్తుంది కృతిసనన్. ఈ మేరకు తనకు తెలిసిన కొందరు దర్శకనిర్మాతలను సంప్రదిస్తోంది, మరి నుపుర్ కి సరైన కథ సెట్ అవుతుందేమో చూడాలి!
This post was last modified on July 21, 2021 10:45 am
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…