టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన కృతిసనన్ కి ఇక్కడ సరైన అవకాశాలు రాలేదు. దీంతో ఆమె బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సక్సెస్ మీద సక్సెస్ అందుకుంటోంది. దీంతో ఆమెకి బాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం ఆమె చేతుల్లో ఐదు సినిమాలున్నాయి. అందులో ఒకటి ‘ఆదిపురుష్’. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో అమ్మడు క్రేజ్ మరింత పెరగడం ఖాయం.
టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన కృతి ఇప్పుడు తన చెల్లెల్ని హీరోయిన్ గా పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తోంది. కృతి సోదరి నుపుర్ సనన్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమె ఒక మ్యూజిక్ వీడియో ఆల్బమ్ లో నటించింది. అందులో అక్షయ్ కుమార్ సరసన కనిపించింది. కానీ అది కేవలం ప్రైవేట్ సాంగ్. ఇప్పుడు నుపుర్ కోసం మంచి సినిమాను సెట్ చేసే పనిలో పడింది కృతిసనన్.
ప్రస్తుతం ఈ బ్యూటీ టైగర్ ష్రాఫ్ సరసన ఒక హిందీ సినిమా చేస్తోంది. ఇందులో మరో హీరోయిన్ కూడా నటించాలి. రెండో హీరోయిన్ పాత్ర కోసం నుపుర్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను కృతి ఖండించింది. తన చెల్లెల్ని సోలో హీరోయిన్ గానే పరిచయం చేయాలని చూస్తుంది కృతిసనన్. ఈ మేరకు తనకు తెలిసిన కొందరు దర్శకనిర్మాతలను సంప్రదిస్తోంది, మరి నుపుర్ కి సరైన కథ సెట్ అవుతుందేమో చూడాలి!
This post was last modified on July 21, 2021 10:45 am
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…