Movie News

చైతు కోసం తరుణ్ భాస్కర్ స్టోరీ!

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే ఆయన నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమాను పూర్తి చేస్తున్నారు చైతు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో కీలకపాత్ర లో కనిపించనున్నారు ఈ యంగ్ హీరో. ఈ సినిమా షూటింగ్ కోసం లడఖ్ కు వెళ్లారు. ఇదిలా ఉండగా.. చైతు కోసం ఇప్పుడు మరో స్టోరీ సిద్ధమైందని సమాచారం.

తెలుగులో ‘పెళ్లిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు తరుణ్ భాస్కర్.. చైతుతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నిజానికి వెంకీతో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కథ మొత్తం మార్చి రాస్తున్నారట. ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియని పరిస్థితి. అందుకే ముందుగా చైతూతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాను కూడా సురేష్ బాబు నిర్మిస్తారని తెలుస్తోంది.

నిజానికి ‘పెళ్లిచూపులు’ సినిమా విడుదలైన తరువాత తరుణ్ భాస్కర్ కి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేశారు సురేష్ బాబు. కానీ తరుణ్ భాస్కర్ చాలా సమయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్ సురేష్ బాబుకి నచ్చడంతో చైతుని హీరోగా పెట్టి సినిమా చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం లడఖ్ లో ఉన్న చైతు తిరిగొచ్చిన వెంటనే అతడికి కూడా కథ వినిపించనున్నారు. అన్నీ ఒకే అయితే వచ్చే ఏడాదిలో ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది!

This post was last modified on July 18, 2021 9:55 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago