టాలీవుడ్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా నటీనటులందరూ తప్పక నటించాలని కోరుకునే దర్శకుల్లో సుకుమార్ ఒకడు. తన సినిమాల్లో చిన్న పాత్రకైనా ఆయన ఇచ్చే ప్రాధాన్యం వేరు. మొక్కుబడిగా ఏ పాత్రను తెరమీద చూపించడు. కొన్ని నిమిషాలు కనిపించినా సరే.. ఆ పాత్ర తన ప్రాధాన్యాన్ని చాటుకునేలా తీర్చిదిద్దుతాడు.
అలాంటి దర్శకుడు తీసిన క్లాసిక్, బ్లాక్బస్టర్ మూవీ ‘రంగస్థలం’లో హీరో హీరోయిన్లు, విలన్ తర్వాత అంత కీలకమైన పాత్రలో అనసూయ వారెవా అనిపించింది. ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో, అనసూయకు ఎంత పేరొచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ ఆమెను రంగమ్మత్త అని పిలుస్తుంటారు అభిమానులు. ఇప్పుడు సుకుమార్ తీస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’లోనూ అనసూయ ఓ పాత్ర చేస్తుండటం విశేషం.
నిజానికి ముందు అనుకున్న స్క్రిప్టులో అనసూయ పాత్ర లేదు. కానీ తర్వాత ఆమెకు పాత్ర క్రియేట్ చేశారు. ఈ పాత్ర నిడివి కూడా ముందు తక్కువేనట. ఐతే సినిమాను రెండు భాగాలుగా మార్చాక దాన్ని పొడిగిస్తున్నట్లు సమాచారం. సుక్కుతో మరోసారి పని చేస్తున్న అనుభవం గురించి అనసూయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “సుకుమార్ గారు ఆర్టిస్టులను ఒక లెక్కలో చెక్కుతారు. ఐతే ఆయన ఒక ఆర్టిస్టును ఒక సినిమాలో నటింపజేశాక వాళ్లను రిపీట్ చేయడం ఉండదని విన్నాను. కానీ నాకు మాత్రం సెకండ్ ఛాన్స్ దక్కింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ‘పుష్ప’లో నేను చేస్తున్న పాత్ర నా కెరీర్లో మరో మరపు రాని క్యారెక్టర్ అవుతుంది” అని చెప్పుకొచ్చింది.
‘పుష్ప’లో సునీల్కు భార్యగా అనసూయ కనిపించనుందని సమాచారం. వీళ్లిద్దరివీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలేనట. ఇద్దరూ ఆ పాత్రల్లో చాలా బాగా ఒదిగిపోతున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం.
This post was last modified on July 18, 2021 6:09 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…