ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నటుడు రాజశేఖర్ ఆ తరువాత జోరు తగ్గించారు. ఆయన నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతుండడంతో కాస్త బ్రేక్ తీసుకున్నారు. ‘గరుడ వేగ’ సినిమాలో హీరోగా నటించి హిట్టు సినిమా తన ఖాతాలో వేసుకున్నారు.
‘కల్కి’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఏవరేజ్ అనిపించుకుంది. ఇదిలా ఉండగా.. మంచి పాత్ర దొరికితే మల్టీస్టారర్ సినిమాలతో పాటు విలన్ పాత్రలు చేయడానికి కూడా తను సిద్ధమని గతంలో రాజశేఖర్ ప్రకటించారు.
హీరోగా మార్కెట్ పడిపోయిన సమయంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయత్నించాలనుకున్నారు. కానీ అలాంటి అవకాశాలు రాలేదు. నిజానికి ‘అఖండ’ సినిమాలో ముందుగా రాజశేఖర్ ను విలన్ గా తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ బోయపాటి తన ఫేవరెట్ యాక్టర్ జగపతిబాబునే తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఓ సినిమా కోసం రాజశేఖర్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
హీరో గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్ర కోసం రాజశేఖర్ ను తీసుకోవాలనుకుంటున్నారు. ఇది విలన్ రోల్ మాత్రం కాదట. కథను మలుపు తిప్పే కీలకపాత్రలో రాజశేఖర్ ను తీసుకోవాలనుకుంటున్నారు.
కానీ రాజశేఖర్ హీరోగా చాలా సినిమాలు ఒప్పుకుంటున్నారు. రీసెంట్ గానే రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. మరి ఇలాంటి సమయంలో గోపీచంద్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తారో లేదో చూడాలి!
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…