ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నటుడు రాజశేఖర్ ఆ తరువాత జోరు తగ్గించారు. ఆయన నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతుండడంతో కాస్త బ్రేక్ తీసుకున్నారు. ‘గరుడ వేగ’ సినిమాలో హీరోగా నటించి హిట్టు సినిమా తన ఖాతాలో వేసుకున్నారు.
‘కల్కి’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఏవరేజ్ అనిపించుకుంది. ఇదిలా ఉండగా.. మంచి పాత్ర దొరికితే మల్టీస్టారర్ సినిమాలతో పాటు విలన్ పాత్రలు చేయడానికి కూడా తను సిద్ధమని గతంలో రాజశేఖర్ ప్రకటించారు.
హీరోగా మార్కెట్ పడిపోయిన సమయంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయత్నించాలనుకున్నారు. కానీ అలాంటి అవకాశాలు రాలేదు. నిజానికి ‘అఖండ’ సినిమాలో ముందుగా రాజశేఖర్ ను విలన్ గా తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ బోయపాటి తన ఫేవరెట్ యాక్టర్ జగపతిబాబునే తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఓ సినిమా కోసం రాజశేఖర్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
హీరో గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్ర కోసం రాజశేఖర్ ను తీసుకోవాలనుకుంటున్నారు. ఇది విలన్ రోల్ మాత్రం కాదట. కథను మలుపు తిప్పే కీలకపాత్రలో రాజశేఖర్ ను తీసుకోవాలనుకుంటున్నారు.
కానీ రాజశేఖర్ హీరోగా చాలా సినిమాలు ఒప్పుకుంటున్నారు. రీసెంట్ గానే రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. మరి ఇలాంటి సమయంలో గోపీచంద్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తారో లేదో చూడాలి!
This post was last modified on July 17, 2021 8:39 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…