మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు.. హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓ వైపు ప్రకాష్ రాజ్, మరో వైపు మంచు విష్ణు తలపడుతుండటంతో.. దీనిపై తీవ్ర ఆసక్తి పెరిగింది. వీరిద్దరిలో ఎవరి మద్దుతు ఎవరికి అనే విషయం మరింత తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
కాగా.. తాజాగా.. ఈ మా ఎన్నికలపై సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. “మా” ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే బేధాన్ని తాను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. అయితే “మా ” బిల్డింగ్ ఇంతవరకు ఎందుకు కట్టలేకపోయారన్నదే తన ప్రశ్న అని బాలయ్య పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్తో రాసుకుపూసుకు తిరుగుతున్నారని.. ” మా ” బిల్డింగ్ కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వరా అని బాలయ్య ప్రశ్నించారు.
” మా ” బిల్డింగ్ నిర్మాణం కోసం విష్ణు ముందుకొస్తే తానూ సహకరిస్తానని బాలకృష్ణ స్పష్టం చేశారు. అందరం కలిస్తే.. ఇంద్ర భవనం నిర్మించొచ్చని ఆయన పేర్కొన్నారు. ఫండ్ రైజింగ్ కోసం ఫస్ట్క్లాస్లో అమెరికాలో తిరిగారని.. ఆ డబ్బంతా ఏం చేశారని బాలకృష్ణ ప్రశ్నించారు. మనది గ్లామర్ ఇండస్ట్రీ అని.. సమస్యలు బహిరంగంగా చర్చించడం సరికాదని ఆయన హితవు పలికారు.
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అడ్డంకులు రావడం సహజం. ఒక్కోసారి నెలలు సంవత్సరాల తరబడి రిలీజులు ఆగిపోతాయి. కానీ ఓటిటిలో…
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…