మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు.. హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓ వైపు ప్రకాష్ రాజ్, మరో వైపు మంచు విష్ణు తలపడుతుండటంతో.. దీనిపై తీవ్ర ఆసక్తి పెరిగింది. వీరిద్దరిలో ఎవరి మద్దుతు ఎవరికి అనే విషయం మరింత తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
కాగా.. తాజాగా.. ఈ మా ఎన్నికలపై సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. “మా” ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే బేధాన్ని తాను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. అయితే “మా ” బిల్డింగ్ ఇంతవరకు ఎందుకు కట్టలేకపోయారన్నదే తన ప్రశ్న అని బాలయ్య పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్తో రాసుకుపూసుకు తిరుగుతున్నారని.. ” మా ” బిల్డింగ్ కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వరా అని బాలయ్య ప్రశ్నించారు.
” మా ” బిల్డింగ్ నిర్మాణం కోసం విష్ణు ముందుకొస్తే తానూ సహకరిస్తానని బాలకృష్ణ స్పష్టం చేశారు. అందరం కలిస్తే.. ఇంద్ర భవనం నిర్మించొచ్చని ఆయన పేర్కొన్నారు. ఫండ్ రైజింగ్ కోసం ఫస్ట్క్లాస్లో అమెరికాలో తిరిగారని.. ఆ డబ్బంతా ఏం చేశారని బాలకృష్ణ ప్రశ్నించారు. మనది గ్లామర్ ఇండస్ట్రీ అని.. సమస్యలు బహిరంగంగా చర్చించడం సరికాదని ఆయన హితవు పలికారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…