మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు.. హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓ వైపు ప్రకాష్ రాజ్, మరో వైపు మంచు విష్ణు తలపడుతుండటంతో.. దీనిపై తీవ్ర ఆసక్తి పెరిగింది. వీరిద్దరిలో ఎవరి మద్దుతు ఎవరికి అనే విషయం మరింత తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
కాగా.. తాజాగా.. ఈ మా ఎన్నికలపై సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. “మా” ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే బేధాన్ని తాను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. అయితే “మా ” బిల్డింగ్ ఇంతవరకు ఎందుకు కట్టలేకపోయారన్నదే తన ప్రశ్న అని బాలయ్య పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్తో రాసుకుపూసుకు తిరుగుతున్నారని.. ” మా ” బిల్డింగ్ కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వరా అని బాలయ్య ప్రశ్నించారు.
” మా ” బిల్డింగ్ నిర్మాణం కోసం విష్ణు ముందుకొస్తే తానూ సహకరిస్తానని బాలకృష్ణ స్పష్టం చేశారు. అందరం కలిస్తే.. ఇంద్ర భవనం నిర్మించొచ్చని ఆయన పేర్కొన్నారు. ఫండ్ రైజింగ్ కోసం ఫస్ట్క్లాస్లో అమెరికాలో తిరిగారని.. ఆ డబ్బంతా ఏం చేశారని బాలకృష్ణ ప్రశ్నించారు. మనది గ్లామర్ ఇండస్ట్రీ అని.. సమస్యలు బహిరంగంగా చర్చించడం సరికాదని ఆయన హితవు పలికారు.
This post was last modified on July 15, 2021 5:55 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…