ఈ మధ్యకాలంలో చాలా మంది కోలీవుడ్ హీరోలు తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే ధనుష్, విజయ్ లాంటి స్టార్ హీరోల ప్రాజెక్ట్ లు కన్ఫర్మ్ అయ్యాయి. త్వరలోనే సూర్య కూడా తెలుగు స్ట్రెయిట్ సినిమాలో నటిస్తారని అంటున్నారు. ఇక రీసెంట్ గా కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ కూడా తెలుగు డెబ్యూకి రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ హీరో నటించిన తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు.
వీటిల్లో ‘రెమో’ సినిమా బాగా క్లిక్ అయింది. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్.. శివ కార్తికేయన్ తో సినిమా చేయబోతున్నారు. ఏషియన్ సినిమాస్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా కోసం శివ కార్తికేయన్ కు రెమ్యునరేషన్ గా రూ.20 కోట్లు ఇవ్వబోతున్నారని సమాచారం.
నిజానికి టాలీవుడ్ లో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్లు అందుకునేది స్టార్ హీరోలే. వాళ్లతో పోలిస్తే శివ కార్తికేయన్ కు తెలుగులో అంత క్రేజ్ లేదు. అలాంటిది ఈ హీరోకి ఇరవై కోట్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. కోలీవుడ్ లో ఈ హీరోకి నలభై కోట్ల మార్కెట్ ఉందట. అందుకే ఇరవై కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారు. మరో ఇరవై కోట్లలో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి నిర్మాతకు ఈ సినిమా ఏ రేంజ్ లో లాభాలను తీసుకొస్తుందో చూడాలి!
This post was last modified on July 15, 2021 11:00 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…