ఈ మధ్యకాలంలో చాలా మంది కోలీవుడ్ హీరోలు తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే ధనుష్, విజయ్ లాంటి స్టార్ హీరోల ప్రాజెక్ట్ లు కన్ఫర్మ్ అయ్యాయి. త్వరలోనే సూర్య కూడా తెలుగు స్ట్రెయిట్ సినిమాలో నటిస్తారని అంటున్నారు. ఇక రీసెంట్ గా కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ కూడా తెలుగు డెబ్యూకి రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ హీరో నటించిన తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు.
వీటిల్లో ‘రెమో’ సినిమా బాగా క్లిక్ అయింది. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్.. శివ కార్తికేయన్ తో సినిమా చేయబోతున్నారు. ఏషియన్ సినిమాస్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా కోసం శివ కార్తికేయన్ కు రెమ్యునరేషన్ గా రూ.20 కోట్లు ఇవ్వబోతున్నారని సమాచారం.
నిజానికి టాలీవుడ్ లో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్లు అందుకునేది స్టార్ హీరోలే. వాళ్లతో పోలిస్తే శివ కార్తికేయన్ కు తెలుగులో అంత క్రేజ్ లేదు. అలాంటిది ఈ హీరోకి ఇరవై కోట్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. కోలీవుడ్ లో ఈ హీరోకి నలభై కోట్ల మార్కెట్ ఉందట. అందుకే ఇరవై కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారు. మరో ఇరవై కోట్లలో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి నిర్మాతకు ఈ సినిమా ఏ రేంజ్ లో లాభాలను తీసుకొస్తుందో చూడాలి!
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…