లాక్ డౌన్ టైంలో అందరు హీరోల అభిమానులూ ఏదో రకంగా ఎంగేజ్ అవుతున్నారు. వాళ్లు ముచ్చట్లు పెట్టడానికి, ట్రెండ్స్లో పాల్గొనడానికి ఏదో ఒక సందర్భం ఉంటోంది. కానీ అక్కినేని అభిమానులే అసలు చడీచప్పుడు లేకుండా ఉన్నారు. ఆ ఫ్యామిలీ హీరోల నుంచి ఏ రకమైన సినిమా అప్ డేట్లు లేవు. ఏవైనా ప్రత్యేక సందర్భాలు వస్తే ట్రెండ్స్ చేద్దామంటే అందుకూ అవకాశం లేకపోయింది. లాక్ డౌన్ టైంలో మిగతా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తుంటే అక్కినేని ఫ్యాన్స్కు మాత్రం గత రెండు నెలల్లో అలాంటి అవకాశమే లేకపోయింది. ఐతే ఎట్టకేలకు వాళ్లకూ టైమొచ్చింది. ప్రస్తుతం ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్లో వాళ్ల సందడీ కనిపిస్తోంది.
అక్కినేని నాగార్జున కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అన్నమయ్య సినిమా రిలీజై శుక్రవారానికి 28 ఏళ్లు పూర్తయ్యాయి. 1997 మే 22న ఆ చిత్రం రిలీజైంది. ఈ సందర్భంగా ఈ కల్ట్ క్లాసిక్ మీద హ్యాష్ ట్యాగ్స్ పెట్టి నాగ్ గొప్పదనంపై చర్చ నడిపారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర పోస్టులు, కథనాలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక మే 23 అక్కినేని అభిమానులకు మరింత ప్రత్యేకం. ఇది నాగ్ కెరీర్లో మరపురాని రోజు. నాగ్ హీరోగా పరిచయం అయిన విక్రమ్ సినిమా రిలీజైంది ఆ రోజే. అంతే కాక అక్కినేని కుటుంబానికే అత్యంత ప్రత్యేకమైన మనం చిత్రం రిలీజైంది కూడా ఇదే తేదీకి. శనివారంతో ఈ సినిమాకు ఆరేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 23తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నాగ్ కూడా ట్వీట్ వేశాడు. దీంతో మరింత ఉత్సాహంగా అభిమానులు ట్రెండ్స్కు రెడీ అయిపోయారు. శనివారం అక్కినేని ఫ్యాన్స్ రెచ్చిపోయే అవకాశముంది.
This post was last modified on May 23, 2020 1:15 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…