Movie News

అక్కినేని వారికి టైమొచ్చింది

లాక్ డౌన్ టైంలో అంద‌రు హీరోల అభిమానులూ ఏదో ర‌కంగా ఎంగేజ్ అవుతున్నారు. వాళ్లు ముచ్చ‌ట్లు పెట్ట‌డానికి, ట్రెండ్స్‌లో పాల్గొన‌డానికి ఏదో ఒక సంద‌ర్భం ఉంటోంది. కానీ అక్కినేని అభిమానులే అస‌లు చ‌డీచ‌ప్పుడు లేకుండా ఉన్నారు. ఆ ఫ్యామిలీ హీరోల నుంచి ఏ ర‌క‌మైన సినిమా అప్ డేట్లు లేవు. ఏవైనా ప్ర‌త్యేక సంద‌ర్భాలు వ‌స్తే ట్రెండ్స్ చేద్దామంటే అందుకూ అవ‌కాశం లేక‌పోయింది. లాక్ డౌన్ టైంలో మిగ‌తా హీరోల అభిమానులు సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావుడి చేస్తుంటే అక్కినేని ఫ్యాన్స్‌కు మాత్రం గ‌త రెండు నెల‌ల్లో అలాంటి అవ‌కాశ‌మే లేక‌పోయింది. ఐతే ఎట్ట‌కేలకు వాళ్ల‌కూ టైమొచ్చింది. ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ త‌దిత‌ర సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో వాళ్ల సంద‌డీ క‌నిపిస్తోంది.

అక్కినేని నాగార్జున కెరీర్లో చిర‌స్థాయిగా నిలిచిపోయిన అన్న‌మ‌య్య సినిమా రిలీజై శుక్ర‌వారానికి 28 ఏళ్లు పూర్త‌య్యాయి. 1997 మే 22న ఆ చిత్రం రిలీజైంది. ఈ సంద‌ర్భంగా ఈ క‌ల్ట్ క్లాసిక్ మీద హ్యాష్ ట్యాగ్స్ పెట్టి నాగ్ గొప్ప‌ద‌నంపై చ‌ర్చ న‌డిపారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర పోస్టులు, క‌థ‌నాలు కూడా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇక మే 23 అక్కినేని అభిమానుల‌కు మ‌రింత ప్ర‌త్యేకం. ఇది నాగ్ కెరీర్లో మ‌ర‌పురాని రోజు. నాగ్ హీరోగా ప‌రిచ‌యం అయిన విక్ర‌మ్ సినిమా రిలీజైంది ఆ రోజే. అంతే కాక అక్కినేని కుటుంబానికే అత్యంత ప్ర‌త్యేక‌మైన మ‌నం చిత్రం రిలీజైంది కూడా ఇదే తేదీకి. శ‌నివారంతో ఈ సినిమాకు ఆరేళ్లు పూర్త‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మే 23తో త‌న‌కున్న ప్ర‌త్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నాగ్ కూడా ట్వీట్ వేశాడు. దీంతో మ‌రింత ఉత్సాహంగా అభిమానులు ట్రెండ్స్‌కు రెడీ అయిపోయారు. శ‌నివారం అక్కినేని ఫ్యాన్స్ రెచ్చిపోయే అవ‌కాశ‌ముంది.

suman

Recent Posts

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

2 hours ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

3 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

4 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

4 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

5 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

5 hours ago