Movie News

అక్కినేని వారికి టైమొచ్చింది

లాక్ డౌన్ టైంలో అంద‌రు హీరోల అభిమానులూ ఏదో ర‌కంగా ఎంగేజ్ అవుతున్నారు. వాళ్లు ముచ్చ‌ట్లు పెట్ట‌డానికి, ట్రెండ్స్‌లో పాల్గొన‌డానికి ఏదో ఒక సంద‌ర్భం ఉంటోంది. కానీ అక్కినేని అభిమానులే అస‌లు చ‌డీచ‌ప్పుడు లేకుండా ఉన్నారు. ఆ ఫ్యామిలీ హీరోల నుంచి ఏ ర‌క‌మైన సినిమా అప్ డేట్లు లేవు. ఏవైనా ప్ర‌త్యేక సంద‌ర్భాలు వ‌స్తే ట్రెండ్స్ చేద్దామంటే అందుకూ అవ‌కాశం లేక‌పోయింది. లాక్ డౌన్ టైంలో మిగ‌తా హీరోల అభిమానులు సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావుడి చేస్తుంటే అక్కినేని ఫ్యాన్స్‌కు మాత్రం గ‌త రెండు నెల‌ల్లో అలాంటి అవ‌కాశ‌మే లేక‌పోయింది. ఐతే ఎట్ట‌కేలకు వాళ్ల‌కూ టైమొచ్చింది. ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ త‌దిత‌ర సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో వాళ్ల సంద‌డీ క‌నిపిస్తోంది.

అక్కినేని నాగార్జున కెరీర్లో చిర‌స్థాయిగా నిలిచిపోయిన అన్న‌మ‌య్య సినిమా రిలీజై శుక్ర‌వారానికి 28 ఏళ్లు పూర్త‌య్యాయి. 1997 మే 22న ఆ చిత్రం రిలీజైంది. ఈ సంద‌ర్భంగా ఈ క‌ల్ట్ క్లాసిక్ మీద హ్యాష్ ట్యాగ్స్ పెట్టి నాగ్ గొప్ప‌ద‌నంపై చ‌ర్చ న‌డిపారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర పోస్టులు, క‌థ‌నాలు కూడా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇక మే 23 అక్కినేని అభిమానుల‌కు మ‌రింత ప్ర‌త్యేకం. ఇది నాగ్ కెరీర్లో మ‌ర‌పురాని రోజు. నాగ్ హీరోగా ప‌రిచ‌యం అయిన విక్ర‌మ్ సినిమా రిలీజైంది ఆ రోజే. అంతే కాక అక్కినేని కుటుంబానికే అత్యంత ప్ర‌త్యేక‌మైన మ‌నం చిత్రం రిలీజైంది కూడా ఇదే తేదీకి. శ‌నివారంతో ఈ సినిమాకు ఆరేళ్లు పూర్త‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మే 23తో త‌న‌కున్న ప్ర‌త్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నాగ్ కూడా ట్వీట్ వేశాడు. దీంతో మ‌రింత ఉత్సాహంగా అభిమానులు ట్రెండ్స్‌కు రెడీ అయిపోయారు. శ‌నివారం అక్కినేని ఫ్యాన్స్ రెచ్చిపోయే అవ‌కాశ‌ముంది.

This post was last modified on May 23, 2020 1:15 am

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

21 minutes ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

57 minutes ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

1 hour ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

4 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

5 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

13 hours ago