లాక్ డౌన్ టైంలో అందరు హీరోల అభిమానులూ ఏదో రకంగా ఎంగేజ్ అవుతున్నారు. వాళ్లు ముచ్చట్లు పెట్టడానికి, ట్రెండ్స్లో పాల్గొనడానికి ఏదో ఒక సందర్భం ఉంటోంది. కానీ అక్కినేని అభిమానులే అసలు చడీచప్పుడు లేకుండా ఉన్నారు. ఆ ఫ్యామిలీ హీరోల నుంచి ఏ రకమైన సినిమా అప్ డేట్లు లేవు. ఏవైనా ప్రత్యేక సందర్భాలు వస్తే ట్రెండ్స్ చేద్దామంటే అందుకూ అవకాశం లేకపోయింది. లాక్ డౌన్ టైంలో మిగతా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తుంటే అక్కినేని ఫ్యాన్స్కు మాత్రం గత రెండు నెలల్లో అలాంటి అవకాశమే లేకపోయింది. ఐతే ఎట్టకేలకు వాళ్లకూ టైమొచ్చింది. ప్రస్తుతం ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్లో వాళ్ల సందడీ కనిపిస్తోంది.
అక్కినేని నాగార్జున కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అన్నమయ్య సినిమా రిలీజై శుక్రవారానికి 28 ఏళ్లు పూర్తయ్యాయి. 1997 మే 22న ఆ చిత్రం రిలీజైంది. ఈ సందర్భంగా ఈ కల్ట్ క్లాసిక్ మీద హ్యాష్ ట్యాగ్స్ పెట్టి నాగ్ గొప్పదనంపై చర్చ నడిపారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర పోస్టులు, కథనాలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక మే 23 అక్కినేని అభిమానులకు మరింత ప్రత్యేకం. ఇది నాగ్ కెరీర్లో మరపురాని రోజు. నాగ్ హీరోగా పరిచయం అయిన విక్రమ్ సినిమా రిలీజైంది ఆ రోజే. అంతే కాక అక్కినేని కుటుంబానికే అత్యంత ప్రత్యేకమైన మనం చిత్రం రిలీజైంది కూడా ఇదే తేదీకి. శనివారంతో ఈ సినిమాకు ఆరేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 23తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నాగ్ కూడా ట్వీట్ వేశాడు. దీంతో మరింత ఉత్సాహంగా అభిమానులు ట్రెండ్స్కు రెడీ అయిపోయారు. శనివారం అక్కినేని ఫ్యాన్స్ రెచ్చిపోయే అవకాశముంది.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…