రంజాన్ వచ్చిందంటే చాలు.. బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయిపోవాల్సిందే. దశాబ్ద కాలంగా నడుస్తున్న సంప్రదాయం ఇది. ఈద్కి కర్చీఫ్ వేసి కూర్చుంటాడు సల్మాన్ ఖాన్. 2013లో మినహాయిస్తే 2009 నుంచి ప్రతిసారీ రంజాన్కు అతడి సినిమా రిలీజవుతూ వస్తోంది. టాక్తో సంబంధం లేకుండా అతడి సినిమాలు ఈద్కు వసూళ్ల మోత మోగిస్తాయి. గత ఏడాది కూడా ‘భారత్’ సినిమా తొలి వారాంతంలో భారీగా వసూళ్లు రాబట్టింది. 2009లో ‘వాంటెడ్’తో సల్మాన్ రంజాన్ ప్రభంజనం మొదలైంది. ఆ తర్వాత వరుసగా దబంగ్, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, కిక్, భజరంగి భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్ లైట్, రేస్-3 సినిమాలు రంజాన్కు విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ ఏడాది కూడా సల్మాన్ ‘రాధె’ సినిమాతో ఈద్కు ట్రీట్ ఇవ్వాలనుకున్నాడు. కానీ కరోనా వచ్చి అతడి ఆశలకు బ్రేక్ వేసింది.
మామూలుగా రంజాన్కు సల్మాన్ సినిమా ఉందంటే దానికి ఎదురెళ్లే సాహసం ఎవ్వరూ చేయరు. కానీ ఈసారి మాత్రం దానికి పోటీగా అక్షయ్ కుమార్ సినిమా ‘లక్ష్మీబాంబ్’ను రిలీజ్ చేయాలనుకున్నారు. వేసవి కాబట్టి ఒకే వారాంతంలో రెండు సినిమాలు రిలీజైనా ఇబ్బంది ఉండదనుకున్నారు. ఆదివారం (మే 24) రంజాన్ నేపథ్యంలో ఈ శుక్రవారం (మే 22న) ఈ రెండు చిత్రాలు విడుదల కావాల్సింది. ఇలాంటి రెండు భారీ చిత్రాలు విడుదలైతే బాక్సాఫీస్ షేక్ అయిపోయేదే. అటు ఇటుగా రూ.400 కోట్ల మేర బిజినెస్ జరిగేది. కానీ కరోనా పుణ్యమా అని ఇప్పుడు థియేటర్లన్నీ మూతబడి ఉన్నాయి. రెండు నెలలకు పైగా లాక్ డౌన్ నడుస్తుండటంతో భారతీయ సినీ పరిశ్రమ వేల కోట్లలో నష్టపోయింది. బంగారం లాంటి వేసవి సీజన్ ఇలా వృథా అయిపోతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ‘రాధె’ షూటింగ్ పెండింగ్ పడటంతో ఈ ఏడాది చివరికి సినిమా వాయిదా పడేలా ఉంది.
This post was last modified on May 23, 2020 9:22 am
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి…
జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఆ స్థాయి ఫాంటసీ మూవీగా అంచనాలు మోస్తున్న విశ్వంభర వ్యవహారం ఎంతకీ తెగక, విడుదల తేదీ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు భారీ మేలును…
ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు…
ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో…
ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…