రంజాన్ వచ్చిందంటే చాలు.. బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయిపోవాల్సిందే. దశాబ్ద కాలంగా నడుస్తున్న సంప్రదాయం ఇది. ఈద్కి కర్చీఫ్ వేసి కూర్చుంటాడు సల్మాన్ ఖాన్. 2013లో మినహాయిస్తే 2009 నుంచి ప్రతిసారీ రంజాన్కు అతడి సినిమా రిలీజవుతూ వస్తోంది. టాక్తో సంబంధం లేకుండా అతడి సినిమాలు ఈద్కు వసూళ్ల మోత మోగిస్తాయి. గత ఏడాది కూడా ‘భారత్’ సినిమా తొలి వారాంతంలో భారీగా వసూళ్లు రాబట్టింది. 2009లో ‘వాంటెడ్’తో సల్మాన్ రంజాన్ ప్రభంజనం మొదలైంది. ఆ తర్వాత వరుసగా దబంగ్, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, కిక్, భజరంగి భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్ లైట్, రేస్-3 సినిమాలు రంజాన్కు విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ ఏడాది కూడా సల్మాన్ ‘రాధె’ సినిమాతో ఈద్కు ట్రీట్ ఇవ్వాలనుకున్నాడు. కానీ కరోనా వచ్చి అతడి ఆశలకు బ్రేక్ వేసింది.
మామూలుగా రంజాన్కు సల్మాన్ సినిమా ఉందంటే దానికి ఎదురెళ్లే సాహసం ఎవ్వరూ చేయరు. కానీ ఈసారి మాత్రం దానికి పోటీగా అక్షయ్ కుమార్ సినిమా ‘లక్ష్మీబాంబ్’ను రిలీజ్ చేయాలనుకున్నారు. వేసవి కాబట్టి ఒకే వారాంతంలో రెండు సినిమాలు రిలీజైనా ఇబ్బంది ఉండదనుకున్నారు. ఆదివారం (మే 24) రంజాన్ నేపథ్యంలో ఈ శుక్రవారం (మే 22న) ఈ రెండు చిత్రాలు విడుదల కావాల్సింది. ఇలాంటి రెండు భారీ చిత్రాలు విడుదలైతే బాక్సాఫీస్ షేక్ అయిపోయేదే. అటు ఇటుగా రూ.400 కోట్ల మేర బిజినెస్ జరిగేది. కానీ కరోనా పుణ్యమా అని ఇప్పుడు థియేటర్లన్నీ మూతబడి ఉన్నాయి. రెండు నెలలకు పైగా లాక్ డౌన్ నడుస్తుండటంతో భారతీయ సినీ పరిశ్రమ వేల కోట్లలో నష్టపోయింది. బంగారం లాంటి వేసవి సీజన్ ఇలా వృథా అయిపోతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ‘రాధె’ షూటింగ్ పెండింగ్ పడటంతో ఈ ఏడాది చివరికి సినిమా వాయిదా పడేలా ఉంది.
This post was last modified on May 23, 2020 9:22 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…