రంజాన్ వచ్చిందంటే చాలు.. బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయిపోవాల్సిందే. దశాబ్ద కాలంగా నడుస్తున్న సంప్రదాయం ఇది. ఈద్కి కర్చీఫ్ వేసి కూర్చుంటాడు సల్మాన్ ఖాన్. 2013లో మినహాయిస్తే 2009 నుంచి ప్రతిసారీ రంజాన్కు అతడి సినిమా రిలీజవుతూ వస్తోంది. టాక్తో సంబంధం లేకుండా అతడి సినిమాలు ఈద్కు వసూళ్ల మోత మోగిస్తాయి. గత ఏడాది కూడా ‘భారత్’ సినిమా తొలి వారాంతంలో భారీగా వసూళ్లు రాబట్టింది. 2009లో ‘వాంటెడ్’తో సల్మాన్ రంజాన్ ప్రభంజనం మొదలైంది. ఆ తర్వాత వరుసగా దబంగ్, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, కిక్, భజరంగి భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్ లైట్, రేస్-3 సినిమాలు రంజాన్కు విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ ఏడాది కూడా సల్మాన్ ‘రాధె’ సినిమాతో ఈద్కు ట్రీట్ ఇవ్వాలనుకున్నాడు. కానీ కరోనా వచ్చి అతడి ఆశలకు బ్రేక్ వేసింది.
మామూలుగా రంజాన్కు సల్మాన్ సినిమా ఉందంటే దానికి ఎదురెళ్లే సాహసం ఎవ్వరూ చేయరు. కానీ ఈసారి మాత్రం దానికి పోటీగా అక్షయ్ కుమార్ సినిమా ‘లక్ష్మీబాంబ్’ను రిలీజ్ చేయాలనుకున్నారు. వేసవి కాబట్టి ఒకే వారాంతంలో రెండు సినిమాలు రిలీజైనా ఇబ్బంది ఉండదనుకున్నారు. ఆదివారం (మే 24) రంజాన్ నేపథ్యంలో ఈ శుక్రవారం (మే 22న) ఈ రెండు చిత్రాలు విడుదల కావాల్సింది. ఇలాంటి రెండు భారీ చిత్రాలు విడుదలైతే బాక్సాఫీస్ షేక్ అయిపోయేదే. అటు ఇటుగా రూ.400 కోట్ల మేర బిజినెస్ జరిగేది. కానీ కరోనా పుణ్యమా అని ఇప్పుడు థియేటర్లన్నీ మూతబడి ఉన్నాయి. రెండు నెలలకు పైగా లాక్ డౌన్ నడుస్తుండటంతో భారతీయ సినీ పరిశ్రమ వేల కోట్లలో నష్టపోయింది. బంగారం లాంటి వేసవి సీజన్ ఇలా వృథా అయిపోతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ‘రాధె’ షూటింగ్ పెండింగ్ పడటంతో ఈ ఏడాది చివరికి సినిమా వాయిదా పడేలా ఉంది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…