Movie News

బాక్సాఫీస్ షేకవ్వాల్సిన రోజిది

రంజాన్ వచ్చిందంటే చాలు.. బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయిపోవాల్సిందే. దశాబ్ద కాలంగా నడుస్తున్న సంప్రదాయం ఇది. ఈద్‌కి కర్చీఫ్ వేసి కూర్చుంటాడు సల్మాన్ ఖాన్. 2013లో మినహాయిస్తే 2009 నుంచి ప్రతిసారీ రంజాన్‌కు అతడి సినిమా రిలీజవుతూ వస్తోంది. టాక్‌తో సంబంధం లేకుండా అతడి సినిమాలు ఈద్‌కు వసూళ్ల మోత మోగిస్తాయి. గత ఏడాది కూడా ‘భారత్’ సినిమా తొలి వారాంతంలో భారీగా వసూళ్లు రాబట్టింది. 2009లో ‘వాంటెడ్‌’తో సల్మాన్ రంజాన్ ప్రభంజనం మొదలైంది. ఆ తర్వాత వరుసగా దబంగ్, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, కిక్, భజరంగి భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్ లైట్, రేస్-3 సినిమాలు రంజాన్‌కు విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ ఏడాది కూడా సల్మాన్ ‘రాధె’ సినిమాతో ఈద్‌కు ట్రీట్ ఇవ్వాలనుకున్నాడు. కానీ కరోనా వచ్చి అతడి ఆశలకు బ్రేక్ వేసింది.

మామూలుగా రంజాన్‌కు సల్మాన్ సినిమా ఉందంటే దానికి ఎదురెళ్లే సాహసం ఎవ్వరూ చేయరు. కానీ ఈసారి మాత్రం దానికి పోటీగా అక్షయ్ కుమార్ సినిమా ‘లక్ష్మీబాంబ్’ను రిలీజ్ చేయాలనుకున్నారు. వేసవి కాబట్టి ఒకే వారాంతంలో రెండు సినిమాలు రిలీజైనా ఇబ్బంది ఉండదనుకున్నారు. ఆదివారం (మే 24) రంజాన్ నేపథ్యంలో ఈ శుక్రవారం (మే 22న) ఈ రెండు చిత్రాలు విడుదల కావాల్సింది. ఇలాంటి రెండు భారీ చిత్రాలు విడుదలైతే బాక్సాఫీస్ షేక్ అయిపోయేదే. అటు ఇటుగా రూ.400 కోట్ల మేర బిజినెస్ జరిగేది. కానీ కరోనా పుణ్యమా అని ఇప్పుడు థియేటర్లన్నీ మూతబడి ఉన్నాయి. రెండు నెలలకు పైగా లాక్ డౌన్ నడుస్తుండటంతో భారతీయ సినీ పరిశ్రమ వేల కోట్లలో నష్టపోయింది. బంగారం లాంటి వేసవి సీజన్ ఇలా వృథా అయిపోతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ‘రాధె’ షూటింగ్ పెండింగ్ పడటంతో ఈ ఏడాది చివరికి సినిమా వాయిదా పడేలా ఉంది.

This post was last modified on May 23, 2020 9:22 am

Share
Show comments
Published by
suman

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

15 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

34 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago