90ల్లో బాగా సినిమాలు చూసి ఆస్వాదించిన ప్రేక్షకులకు ‘రోజా’ ఒక మరపురాని జ్ఞాపకం. మణిరత్నం ప్రతిభ ఏంటో దేశం మొత్తానికి తెలిసేలా చేసిన చిత్రమిది. ఇందులో టైటిల్ రోల్ పోషించిన మధుబాల, ఆమెకు జోడీగా నటించిన అరవింద్ స్వామిలకు ఎంత పేరొచ్చిందో.. ఆ జోడీ ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరూ కలిసి చేసింది ఒకే సినిమా.
కానీ ఆ సినిమాతో ఎవర్ గ్రీన్ పెయిర్ అనిపించుకున్నారు. వాళ్లిద్దరూ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతారు. మామూలుగా ఒక హిట్, క్లాసిక్ సినిమాలో నటించిన నటీనటుల్ని కలిపి మళ్లీ సినిమాలు తీయడం మామూలే.
కానీ ఎందుకోగానీ ఎవ్వరూ అరవింద్, మధులతో మళ్లీ ఓ సినిమా చేయలేదు. కథానాయికగా మధు కెరీర్ ఎక్కువ కాలం కొనసాగకపోవడం.. అరవింద్ స్వామి కూడా మధ్యలో బ్రేక్ తీసుకోవడం ఇందుకు కారణం కావచ్చు. ఐతే ఈ జోడీని దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసి చూసే అవకాశం దక్కబోతోంది.
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఎ.ఎల్.విజయ్ ‘తలైవి’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రలో కనిపించనున్నాడు. ఎంజీఆర్గా అతడి ట్రాన్స్ఫర్మేషన్ చూసి జనాలు అవాక్కవడం తెలిసిందే. ఈ పాత్రకు ఇంకెవరూ ఇంత బాగా నప్పరు అనిపించాడు.
ఇందులో ఎంజీఆర్ భార్యగా మధుబాల కనిపించనుందట. ఎంజీఆర్కు, జయలలితకు ఉన్న సంబంధం.. తర్వాత ఆమే ఆయన రాజకీయ వారసురాలిగా మారడం అప్పట్లో ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఐతే భార్యకు కూడా ఎంజీఆర్ ఎంతో విలువ ఇచ్చాడని చెబుతారు. కాకపోతే ఆమె గురించి సామాన్య జనాలకు పెద్దగా తెలియదు.
మరి ‘తలైవి’లో ఈ జోడీని ఎలా ప్రెజెంట్ చేశారో చూడాలి. ఒక క్లాసిక్లో నటించిన జోడీ మూడు దశాబ్దాల తర్వాత ఇలా తెరపై కనిపించనుండటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on July 13, 2021 11:02 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…